రాష్ట్రీయం

Telangana Assembly Budget Session 2024: ఫిబ్రవరి 10న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌, టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, గవర్నర్‌ తమిళిసై ప్రసంగం ఇదిగో

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

Andhra Pradesh: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన జగన్ సర్కారు, వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లు ఖరారు చేసిన వైసీపీ అధిష్ఠానం

Hazarath Reddy

రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ తాజాగా ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు.

MLA Padi Kaushik Reddy Travel by Auto: అసెంబ్లీ‌కి ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టానికి నిరసనగా ప్రయాణం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో వెళ్లారు. అయితే పోలీసులు అసెంబ్లీ లోపలికి ఆటోను అనుమతించలేదు . మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో..ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని వివరించేందుకే ఆటోలో వచ్చానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తెలిపారు.

Malla Reddy University Students Protest Video: హాస్టల్ భోజనంలో పురుగులు, కీటకాలు, మల్లారెడ్డి యూనివర్శిటీలోని నిరసనకు దిగిన విద్యార్థినులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన హైదరాబాద్ శివార్లలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్శిటీలోని విద్యార్థినులు హాస్టల్‌లో తమకు అందించిన ఆహారంలో పురుగులు/కీటకాలు ఉన్నాయని ఆరోపిస్తూ క్యాంపస్‌లో నిరసనకు దిగారు.

Advertisement

Janasena Glass Symbol Row: హైకోర్టుకు చేరిన జనసేన గాజు గ్లాసు గుర్తు పంచాయితీ, ఆ గుర్తు కోసం ముందుగా నేను దరఖాస్తు చేసుకున్నానని పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాస్

Hazarath Reddy

జనసేకు గాజు గ్లాసును కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్‌(ఈసీ) గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ (సెక్యూలర్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమహేంద్రవరానికి చెందిన ఎం శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Male Passengers Fight for Seat in RTC Bus: బస్సులో ఉన్న ఒక్క సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మగ ప్రయాణికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వేములవాడ - తిప్పాపురం బస్టాండ్లో మంగళవారం రాత్రి రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సు సీట్ల కోసం పలువురు గొడవ పడ్డారు. మహిళలు బస్సు ఎక్కగానే కనిపించిన ఒకే ఒక్క ఖాళీ సీటుకోసం సీటు నాదంటే నాదంటూ గొడవ పడటంతో ఘర్షణ మొదలై, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు

Hyderabad Shocker: అందరి ముందే కటింగ్ చేయించుకోమన్న పీఈటీ, అవమానం తట్టుకోలేక కాలేజీ భవనం పైనుంచి దూకిన విద్యార్థి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఘట్కేసర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను హెయిర్ కటింగ్ చేయించుకోలేదని డీన్ శ్రీనివాసరావుతో పాటు ఫిజికల్ టైనర్ అందరి ముందు అవమానించి కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అవమాన భారం తట్టుకోలేక అదే యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకాడు.

MLC Balmuri Venkat Travel by RTC Bus: అసెంబ్లీ‌కి మొదటి రోజే ఆర్టీసీ బస్‌లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చారు. నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి చేరుకున్నారు. ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన సంగతి విదితమే

Advertisement

Telangana: డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ, ఇస్రోతో ఒప్పందం కుదర్చుకున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో ఛైర్మన్ సమక్షంలో TAA CEO, NRSC డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డ్రోన్ పైలట్లకు NRSC అధునాతన శిక్షణ అందించనుంది.

Case Filed On Tollywood Producer: కెమెరామెన్ ను పెళ్లిపేరుతో మోసం చేసిన టాలీవుడ్ మహిళా నిర్మాత, ఇప్పటికే 2 పెళ్లీళ్లు చేసుకున్న కిలాడీ, తీసుకున్న డబ్బులు అడిగినందుకు రివర్స్‌ లో కేసు

VNS

పెండ్లి పేరుతో మోసం చేసిందని టాలీవుడ్‌ మహిళా నిర్మాతపై (Tollywood Producer) ఓ బాధితుడు కేసు పెట్టాడు. అప్పటికే రెండు పెండ్లిళ్లు అయ్యి.. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆ విషయం దాచి.. తనను పెండ్లి చేసుకుందని అసిస్టెంట్‌ కెమెరామ్యాన్‌ నాగార్జున జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

Krishna Devarayalu Lavu Meet CBN: టీడీపీలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎంపీ, చంద్రబాబుతో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు భేటీ, పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలు

VNS

పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం అయ్యారు. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు. మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి

Chandrababu Naidu Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ, మరోసారి ఎన్డీయేలోకి టీడీపీ, ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కల్యాణ్..భేటీ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం

VNS

చంద్రబాబు – పవన్ మరోసారి భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే చంద్రబాబు – పవన్ చర్చలు జరిపారు. టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ కలిస్తే ఆ పార్టీకి ఇవ్వాల్సిన సీట్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

Telangana Assembly Budget Sessions: తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ పై అందరి దృష్టి, రేవంత్ సర్కారు తొలి బడ్జెట్ సహా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదిక కానున్న అసెంబ్లీ

VNS

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ స్పీచ్‌పై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు

Niloufer Hospital Fire: నిలోఫర్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంటల వల్ల హాస్పిటల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

RTC Bus Hits Tree Video: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు వీడియో ఇదిగో, 30 మంది ప్రయాణికులకు గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా - నర్సాపూర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉదయం జిన్నారం బయలుదేరిన బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

AP DSC & TET 2024 Schedule: ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్ ఇదిగో, అలాగే టెట్ షెడ్యూల్ కూడా తెలుసుకోండి, మొత్తం 6,100 పోస్టుల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి బొత్సా సత్యానారాయణ అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

Advertisement

Babu Mohan Resigns BJP: బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా, నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదని ఆవేదన

Hazarath Reddy

బీజేపీకి అందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాజీ మంత్రి నటుడు బాబు మోహన్ ప్రెస్ మీట్‌లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

AP DSC Notification 2024: ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు

Hazarath Reddy

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు.

AP Vote on Account Budget Highlights: ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పూర్తి హైలెట్స్ ఇవిగో, రూ. 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడిని అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2024-25 (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌)ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 కోట్లు, మూలధన వ్యయం రూ.30,530 కోట్లుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు రూ.55,817 కోట్లు ఉండగా రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు ఉంది.

Telangana Road Accident: అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, ఆరుమందికి గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో TSRTC పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుండి తలమడుగు మండలం ఝరి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Advertisement
Advertisement