రాష్ట్రీయం
Amit Shah Telangana Tour Cancelled: మ‌రోసారి ర‌ద్ద‌యిన అమిత్ షా టూర్, తెలంగాణ‌లో రేపు జ‌రగాల్సిన ప‌ర్య‌ట‌న వాయిదా, కార‌ణం ఏంటంటే?
VNSకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన (Amit Shah Telangana Tour) రద్దయ్యింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఆదివారం పర్యటించాల్సి ఉంది. పలు అత్యవసర పనులతో పర్యటన వాయిదా పడిందని (Amit Shah Telangana Tour Cancelled) ఆయన తెలిపారు.
Andhra Pradesh Assembly Elections 2024: విశాఖలో 'సిద్ధం' పేరిట వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం..ఎన్నికల ప్రచారం ప్రారంభం..మేనిఫెస్టోను 99 శాతం నెరవేర్చాం..సీఎం జగన్ ధ్వజం
sajayaభీమిలి: సంగివలసలో సీఎం వైఎస్‌ జగన్‌ శంఖారావం 'సిద్ధం'పేరుతో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహించారు. భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవసైన్యం కనిపిస్తోంది అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.
KTR Traveling in an Auto: ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్.. వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..(Viral Video)
sajayaభారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జనవరి 27, శనివారం జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి ఆటోలో వెళ్లారు. X.comలో షేర్ చేయబడిన వీడియో ఆటో రైడ్ యూసుఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు KTR ప్రయాణాన్ని చూపుతుంది. వీడియోలో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డ్రైవర్‌తో ముందు సీటును పంచుకుంటున్నారు.
Kodandaram, Amer Ali Khan Appointed as MLC: గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్ పేర్లు ఆమోదించిన గవర్నర్ తమిళిసై..
sajayaఉర్దూ దినపత్రిక ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం కోదండ రామ్ పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా ఆమోదించారు.
Medaram Jathara: మేడారం జాతర సందర్భంగా మహిళల నుంచి బస్సు టిక్కెట్లు వసూలు చేయొద్దు..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం..
sajayaఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు.
Jagan Siddam Sabha: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ సభ
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు.
Kurchi Thata in Police Custody: ‘గుంటూరు కారం’ కుర్చీ మడతపెట్టి.. పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత కౌన్సెలింగ్.. అసలేం జరిగిందంటే?
Rudraహీరో మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Secunderabad Girls Hostel: బాత్రూం నుంచి గర్ల్స్ పీజీ హాస్టల్‌ లోకి రాత్రిపూట చొరబడిన దుండగులు.. ఒకడిని పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు.. సికింద్రాబాద్ లో కలకలంరేపిన ఈ ఘటనలో తర్వాత ఏమైంది?? (వీడియోతో)
Rudraసికింద్రాబాద్‌ లోని పీజీ గర్ల్స్ హాస్టల్‌ లోకి అగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. బాత్రూం కిటికీ నుంచి దుండగులు రహస్యంగా లోనికి చొరబడ్డారు. అనంతరం విద్యార్థినులకు అభ్యంతరకరమైన సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా దుండగుల్లో ఒకరిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు.
Narnur Kamdev Jatara: ఆదిలాబాద్‌ లో ప్రారంభమైన నార్నూర్ కామ్‌ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు
Rudraఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌ దేవ్ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.
TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
Rudraమేడారం జాతరకు వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.
Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్
VNSమెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సు కిటికీలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్ తల, 15 నిమిషాలు పాటు విలవిలలాడిన యువకుడు, స్థానికుల సహాయంతో తల బయటకు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. సుమారు 15 నిమిషాలు అవస్థలు పడుతుండడంతో గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటకు తీశారు.
TSPSC New Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి, కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ డీజీపీ
Hazarath Reddyతెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు.
Telangana: ములుగు జిల్లాలో ఘోర విషాదం, రిపబ్లిక్ వేడుకల్లో కరెంట్ వైర్ తగిలి ఇద్దరు యువకులు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సీ వాడలో జరిగిన ఈ ఘటనలో మరో యువకుడు గాయపడ్డాడు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో వారికి లైవ్ వైర్ తగిలింది.
Andhra Pradesh Elections 2024: రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ, పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన, సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని వెల్లడి
Hazarath Reddyవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. టీడీపీ 2 సీట్లు ప్రకటించినందున తాము కూడా 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు.
Mahmood Ali Faints Video: కేటీఆర్ జాతీయ జెండా ఎగరేస్తుండగా..స్పృహతప్పి పడిపోయిన తెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై మాజీ హోం మినిస్టర్ మహమూద్ అలీ కింద పడ్డారు.
Republic Day 2024 : జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌, దేశ వ్యాప్తంగా ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్‌ శ్రీ అబ్దుల్ నజీర్‌, సీఎం వైఎస్‌.జగన్‌ దంపతులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్‌.
Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి అన్నారు
Republic Day 2024 Greeting: రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, రాజ్యాంగకర్తలను స్మరించుకుందామంటూ ట్వీట్
Hazarath Reddyదేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
Hyderabad Fire: వీడియో ఇదిగో, ట్యాంక్ బండ్ మీద మంటల్లో చిక్కుకున్న కారు, భయాందోళనకు గురయిన స్థానికులు
Hazarath Reddyతెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్ బండ్ వైపు వెళుతున్న సమయంలో కారులో మంటలు చెలరేగాయి. కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.