రాష్ట్రీయం

Note For Vote Case: వీడియో ఇదిగో, ఓటుకు నోటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఉమ్మతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయాకర్ రావు శత్రువుల పంచన చేరి కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..

Telangana: పెన్షన్, రేషన్ బియ్యం కోసం వచ్చి మనువరాలితో సహా సజీవదనమైన వృద్ధురాలు, మెదక్‌ జిల్లాలో విషాదకర ఘటన

VNS

మనవరాలు మధు (6)తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి (cylinder explosion) భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గ్రామస్తులు, ఫైరింజన్‌ సహాయంతో మంటలు ఆర్పివేసినా ఫలితం లేకుండా పోయింది.

Music University In Telangana: దేశంలోనే తొలి మ్యూజిక్ యూనివర్సిటీ తెలంగాణలో ఏర్పాటు, ఇళయరాజా అంగీకరిస్తే ప్రారంభిస్తామన్న కేటీఆర్

VNS

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు.

Telangana Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కను సీఎం చేస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ahana

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తానా సభలో రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు, ఆదివాసీలు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? అని ప్రశ్నించడంతో సీతక్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు.

Advertisement

Yellow Alert For Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, ఏయే జిల్లాల్లో భారీ వర్షాలంటే?

VNS

ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది.

Telangana: ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగుల మందు తాగించిన దుర్మార్గుడు, పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ప్రేమ పేరుతో యువతి వెంటపడి వేధించిన వ్యక్తి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘాతుకం

VNS

ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన (Women Killed) ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్‌ (Asifabad) జిల్లా సిర్పూర్‌(టీ) మండలం వెంకట్రావ్‌పేట్‌లో చోటుచేసుకుంది. సిర్పూర్‌(టీ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేట్‌కు చెందిన దంద్రే కమలాకర్‌ (28)కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Telangana: పేస్ట్ ధర ఎక్కువ అమ్ముతున్నారంటూ కోల్గేట్ కంపెనీపై పిటిషన్, రూ. 65 వేలు జరిమానా విధించిన సంగారెడ్డి వినియోగదారుల ఫోరమ్‌

Hazarath Reddy

కొల్గేట్ కంపెనీకి తెలంగాణకు చెందిన న్యాయవాది భారీ షాక్ ఇచ్చారు. ఎక్కువ ధరకు పేస్ అమ్ముతున్నారంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఆ న్యాయవాదితో ఏకీభవించిన న్యాయస్థానం కోల్గేట్ కంపెనీకి (Colgate Palmolive India) ఏకంగా రూ. 65 వేలు జరిమానా విధించింది.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్‌లో నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు.

Advertisement

KTR Fell Down Video: వీడియో ఇదిగో, ప్రచార వాహనంపై నుంచి కిందపడిన మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, కేటీఆర్‌కు స్వల్ప గాయాలు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు.

AP Fibernet Case: ఫైబర్‌నెట్‌ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా, దీపావళి సెలవుల తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు వెలువరిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది

Telangana Elections 2023: వరుసగా 5వ సారి బరిలో, సిరిసిల్ల‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన మంత్రి కేటీఆర్, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు

Hazarath Reddy

సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో నిలిచారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి బయలుదేరిన సీఎం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి

Advertisement

Telangana Elections 2023: మేం అధికారంలోకి వస్తే యువత 24 గంటలు కూరగాయలతో సహా వ్యాపారాలను చేసుకునేలా ఉపాధి కల్పిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

యువత 24 గంటలు కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.మేం అధికారంలోకి వస్తే కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే దుస్థితి లేకుండా మూసీ నది చుట్టూ యువత 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది

AP Fibernet Case: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, సెక్షన్‌ 17-ఎ కేసులో ఇంకా వెలువడని తీర్పు, టీడీపీ అధినేత కేసు అప్‌డేట్స్ ఇవే

Hazarath Reddy

ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను బాహుబలితో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులపై లుంగీల సెటైర్లు

Hazarath Reddy

బాహుబలి లాంటి కేసీఆర్‌ను.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు నాలుగైదు కొత్త తెల్ల అంగీలు కట్టించుకుని ఓడిస్తాం అని తయారైతున్నరు - అసదుద్దీన్ ఓవైసీ

IT Raid on Ponguleti: మరికాసేపట్లో నామినేషన్ వేయనుండగా పొంగులేటికి బిగ్ షాక్, ఖమ్మంలోని నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, ఐటీ రైడ్స్ గురించి ముందే చెప్పిన పొంగులేటి

VNS

గురువారం తెల్లవారు జాము 3గంటలకు ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఖమ్మంలోని ఇల్లు, పాలేరు (Paleru) క్యాంపు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. మూకుమ్మడిగా పొంగులేటి (Ponguleti Srinivas Reddy) ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Road Accident Video: అతివేగం తెచ్చిన అనర్థమంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం

Hazarath Reddy

అతివేగం తెచ్చిన అనర్థం ఇది! అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ఎక్స్ అకౌంట్లో షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేస్తూ.. గుజరాత్ లోని ఆనంద్ లో మూడు రోజుల క్రితం జరిగిందీ ఘోర ప్రమాదం. ఈ దుర్ఘటనలో బైక్ వెళ్తున్న తండ్రి, ఐదేళ్ల చిన్నారి దుర్మరణం చెందారు. తల్లికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు.

Telangana Elections 2023: టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు, టికెట్ అమ్ముకున్నారని మండిపాటు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగిన బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు. బీసీ నేత అయిన తనకు కాకుండా మోసం చేసి స్థానికేతరుడు ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ అమ్ముకున్నారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బాలరాజు.

Andhra Pradesh Election 2024: ముసుగు తీసేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను నరసాపురం నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Disproportionate Assets Case: అక్రమాస్తుల కేసు, సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు

Hazarath Reddy

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ వేశారు. ఎన్నికలు జరిగే లోపల ఈ కేసులపై తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో ఆయన కోరారు.

Advertisement
Advertisement