రాష్ట్రీయం
Andhra Pradesh Rail Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ఢీకొన్న రెండు రైళ్లు, పట్టాలు తప్పిన మూడు బోగీలు..
ahanaఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
AP Train Accident: విజయనగరంలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన విశాఖ, రాయగడ ప్యాసింజర్
ahanaవిజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపోవడంతో నిలిచినపోయిన విశాఖ - రాయగడ ప్యాసింజర్‌ రైలును, పలాస ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన మూడు ప్యాసింజర్‌ రైలు బోగీలు.. పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.
Telangana Elections 2023: అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదు - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అల్టిమేటం..
ahanaహైదరాబాద్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. తాము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వకపోతే పొత్తు కుదరదని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. ఎల్లుండి మరోసారి రాష్ట్ర కార్య వర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Massage Centre: నెలకు లక్ష జీతం అనగానే సంబురపడింది.. ఫిట్‌ నెస్ శిక్షకురాలిగా చేరింది.. అయితే, ఉద్యోగంలో కొనసాగాలంటే కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాలన్న యజమాని.. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఘటన
Rudraఉద్యోగంలో కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.
Chandrababu Arrest: రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన నారా లోకేష్, భువనేశ్వరి
ahanaటీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును 50 రోజులుగా జైల్లో బంధించారని, ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం వ్యవస్థలు నిర్వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. భువనేశ్వరితో కలిసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన లోకేష్ అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు.
Nalgonda Road Accident: నార్కట్‌పల్లిలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..డ్రైవర్ మృతి, 8 మందికి తీవ్రగాయాలు
ahanaశనివారం తెల్లవారుజామున నార్కట్‌పల్లి మండలం లొంగోటం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
MP Vijayasai Reddy: చంద్రబాబు చరిత్ర ముగిసింది, 175 స్థానాల్లో గెలవడమే వైసీపీ లక్ష్యం...విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ahanaచంద్రబాబు చరిత్ర ముగిసిందని. లోకేశ్‌కు రాజకీయనేత లక్షణాలు లేవు. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారు. 175 స్థానాల్లో గెలవాలన్నదే వైసీపీ లక్ష్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పాల్వాయి స్రవంతిని నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి, మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించిన హైకమాండ్
Hazarath Reddyగత ఏడాది మునుగోడు ఉపఎన్నికల్లో స్రవంతికి రేవంత్ ఇచ్చిన వాగ్ధానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రచార సభ వేదికగా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
Telangana Elections 2023: జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరణతో పి.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం, బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వార్నింగ్..
ahanaజూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో విష్ణు ఆగ్రహంతో ఉన్నారు.
Onion Price Hike: నిన్నటివరకు టమోటా మోత, నేడు ఉల్లి ఘాటు.. 57 శాతం పెరిగిన రిటైల్‌ ఉల్లి ధర.. ధరాఘాతంతో విలవిలలాడుతున్న సామాన్యుడు
Rudraధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు.
Cheetah Spotted Tirumala: తిరుమల మెట్లమార్గంలో మరోసారి చిరుత కలకలం, నడకదారి భక్తులకు మరోసారి అలర్ట్ జారీ, అప్రమత్తమైన టీటీడీ, చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు
VNSఅలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సూచించింది. ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah Spotted), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్‌ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది.
TS Weather: తెలంగాణలో చలి పంజా, మరో మూడు రోజుల పాటూ ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న ఐఎండీ, తెల్లవారుజామున కనిష్టానికి ఉష్ణోగ్రతలు
VNSతెలంగాణను చలి (Cold) వణికిస్తున్నది. రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారు జామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడురోజులు చలి తీవ్రత (Cold wave) కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు ఏర్పడగా.. ఇందులో ఒకటి నైరుతి దిశలో తమిళనాడుకు దగ్గరలో ఉన్నది.
DIG Ravi Kiran on Chandrababu Security: చంద్రబాబు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ కీలక వ్యాఖ్యలు, మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని వెల్లడి
Hazarath Reddyజైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తన ప్రాణాలకు హాని ఉందనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 45 మందితో కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల, అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 45 మందితో తన రెండో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాలో బోథ్ నుంచి వెన్నెల అశోక్, ముథోల్ నుంచి నారాయణ్ రావు, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎల్లారెడ్డి నుంచి మధన్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్ పోటీ చేయనున్నారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో మహిళా ఓటర్లే ఎక్కువ బాసూ, ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఈసీ, మొత్తం 4,01,53,292 మంది ఓటర్లు
Hazarath Reddyఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్‌ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది
Andhra Pradesh Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, ఆనాటి ప్రధాని నెహ్రూ పెట్టిన కండిషన్ ఏమిటీ ? నవంబర్ 1 నుంచి నేటి వరకు ఏం జరిగింది..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023 (Andhra Pradesh Formation Day) నవంబర్ 1 న జరుపుకుంటారు, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం. దీనిని తరచుగా "దక్షిణ ఆహార గిన్నె" అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఏడవ-అతిపెద్ద రాష్ట్రం. పదవ-అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.
Telangana Assembly Elections 2023: మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి
Hazarath Reddyఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు సంతోష్‌ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.
Telangana Assembly Elections 2023: ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ, మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఏపీ మిథున్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.