రాష్ట్రీయం

Konda Raghava Reddy: వీడియో ఇదిగో, వైఎస్సార్‌ని చంపింది కాంగ్రెస్ పార్టీ, కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, షర్మిలతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం

Hazarath Reddy

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ లో పాల్గొన్న వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఊహించని కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు.

Rakhi Pournami 2023: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్‌కు రాఖీలు కట్టిన తోబుట్టువులు, ప్రగతి భవన్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Hazarath Reddy

రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికయింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, శ్రీమతి జయమ్మ, శ్రీమతి లలితమ్మ, చెల్లెలు శ్రీమతి వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టారు.

Gym Owner Sells Steroids in Hyd: కండలు పెంచుకునేందుకు స్టెరాయిడ్‌లు, ఇంజక్షన్లు అమ్మకం, జిమ్ ఓనర్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

స్టెరాయిడ్‌లు, కండలు పెంచేందుకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఇటీవల నగరంలో అరెస్టు చేశారు. నిందితులు స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు విక్రయించారని, ఇవి కండరాలను బలపరిచేందుకు, శక్తిని పెంచడానికి సహాయపడతాయని పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువైన సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, సెప్టెంబర్ 18 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Hazarath Reddy

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సమయంలో జర్మన్ షెడ్లను వేసి లాకర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు

Advertisement

TTD Srivari Brahmotsavam: సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Hazarath Reddy

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు

Paidithalli Sirimanotsavam: అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 15 నుంచి న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు నెల రోజుల పాటు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఉత్స‌వాలు

Hazarath Reddy

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఇల‌వేల్పు అయిన శ్రీపైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం అక్టోబ‌ర్ 31న నిర్వ‌హించ‌నున్నట్లు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్, ఆల‌య ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను మీడియాకు తెలియజేశారు.

YSR Rythu Bharosa: కౌలు రైతులకు జగన్ సర్కారు శుభవార్త, రేపే అన్నదాతల అకౌంట్లోకి రూ. 7500, వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.109.74 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూము­లను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున రూ.109.74 కోట్లు సాయం (rs 109.74 Crore ) పంపిణీ చేయనున్నారు.

Raksha Bandhan 2023: జగన్‌కు రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు, ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు. వాటిని ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి. ఫోటోలు, వీడియో ఇదిగో..

Advertisement

Pawan Kalyan: 470 కిలోల వెండితో పవన్ కళ్యాణ్ చిత్రపటం, సెప్టెంబరు 2 పుట్టిన రోజున జనసేనానికి గిఫ్ట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సెప్టెంబరు 2న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు.

Viral Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన అక్క, సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన సోదరుడికి రాఖీ కట్టేందుకు దాదాపు 8 కిలోమీటర్లు ఓ మహిళ కాలినడకన నడిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.

Video: నా కుక్కలనే ఢీ కొడతారా అంటూ పోలీసులపై దూసుకెళ్లిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ - ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు పెట్రోలింగ్ కార్ నెంబర్-2 సిబ్బంది విధుల్లో భాగంగా రోడ్లపై గస్తీ చేస్తున్నారు. అదే టైంలో ప్రణయ్ తన 2 పెంపుడు కుక్కలతో అదే దారిలో వెళ్తున్నాడు.

Hyderabad: వీడియో ఇదిగో, రోడ్డు మీద కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి రక్షించిన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి, ప్రస్తుతం నిలకడగా అతని ఆరోగ్యం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బేగంపుట్ వద్ద ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ ఏసీపీ పి.మధుసూధన్ రెడ్డి వెంటనే అతనికి సీపీఆర్ ఇస్తూ కాపాడారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఏసీపీపై సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెలువెత్తుతున్నాయి. వీడియో చూడండి

Advertisement

Andhra Pradesh Assembly Elections 2024: రాజానగరంలో జనసేనకు షాక్, వైసీపీలో చేరిన రాయపురెడ్డి ప్రసాద్‌, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్న) వైఎస్సార్‌‌సీపీలో చేరారు

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం సస్పెన్స్, కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయిన షర్మిల, కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అని వెల్లడి

Hazarath Reddy

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. గురువారం ఉదయం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో ఆమె బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయపరమైన చర్చ జరిగినట్లు స్పష్టమవుతోంది.

Hyderabad: ఫంక్షన్‌కు వెళ్లి ఏడేళ్ల బాలుడు మిస్సింగ్, ఉదయం నుంచి వెతికినా దొరకకపోవడంతో పోలిస్‌ కంప్లైంట్, చివరికి బాలుడు ఎక్కడ దొరికాడంటే?

VNS

వివాహ వేడుకలో విషాదం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ లోని (Shamshabad) ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు (Boy Died Suspiciously). వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు.

Rave Party Busted in Hyderabad: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం, రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ సినీ నిర్మాత, దాడుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌, దొరికినవారిలో పలువురు టాలీవుడ్ ఆర్టిస్టులు

VNS

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Fire Accident In Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అగ్నిప్రమాదం, కాలిబూడిదైన 15 షాపులు, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, రూ. 2కోట్లకు పైగా ఆస్తినష్టం

VNS

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని నంద్యాల(Nandyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. 15 షాపులు దగ్ధం అయ్యాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ(Srisaila Mallikarjuna Swamy Temple) సమీపంలో ఉన్న లలితాంబికా దుకాణ సముదాయంలో(Lalitambika Shop Complex) గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

Hazarath Reddy

ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆమె సోదరి అదృశ్యమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పట్టణంలోని తన ఇంట్లో దీప్తి(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Former MLA Bhadraiah Joins YSRCP: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య అతని కుమారుడు డాక్టర్ తలే రాజేశ్

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీలో చేరారు. ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేశ్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేరారు.

Raksha Bandhan 2023: రాఖీ పండగ సందర్భంగా సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మంత్రి విడదల రజనీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌కు రాఖీ కట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని. వీడియో ఇదిగో..

Advertisement
Advertisement