రాష్ట్రీయం
Andhra Pradesh: విజయవాడలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు మగ టీచర్స్, నన్ను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ప్రేమికురాలు
Hazarath Reddyపవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని ట్రాన్స్ జెండర్‌గా మారి భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడంటూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
Nara Lokesh: స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా, మీ ఫస్ట్ క్రష్ ఎవరని విద్యార్థిని అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సమాధానం చెప్పిన వీడియో ఇదిగో..
Hazarath Reddyహలో లోకేశ్ కార్యక్రమంలో ఓ విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని అడగగా.. తనకు కూడా చాలా మంది క్రష్‌లు ఉండేవి. కానీ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ అనవసరంగా ట్రోల్ చేస్తుంది. నాది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ - లోకేశ్
Andhra Pradesh: బైక్ మీద ముగ్గురం వెళ్తే రూ. 1000 ఫైన్ వేశారన్నా, నారా లోకేష్ వద్ద గోడు వెళ్లబోసుకున్న టీడీపీ కార్యకర్త, తగ్గేదేలే అంటూ పుష్ప డైలాగ్ వదిలిన టీడీపీ యువకెరటం
Hazarath Reddyబైక్ మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారని నారా లోకేష్‌కు గోడు వెళ్లబోసుకున్న టీడీపీ కార్యకర్త. అలాగే తగ్గేదేలే లేదు అంటూ నారా లోకేష్ పుష్ప డైలాగ్ వీడియోలు ఇవిగో..
Manda Krishna Madiga on Revanth Reddy: రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి బాగా ఉంది, ఆయన కంటే మిగతా రెడ్లే నయం, మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం అని విమర్శించారు.
Times Now ETG Survey: ఎవరికెన్ని సీట్లు, టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో, మళ్లీ అధికారం మోదీ సర్కారుదే, ఏపీలో జగన్ సర్కారుకు, తెలంగాణలో కేసీఆర్‌కే మళ్లీ పట్టం
Hazarath Reddyదేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది.
Times Now ETG Survey: సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి
Hazarath Reddyఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్‌ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది.
Video: వీడియో ఇదిగో, సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ నేనే పరిచయం చేశాను, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు నాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా కనిపెట్టానని తెలిపిన టీడీపీ అధినేత తాజాగా సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ కూడా నేను పరిచయం చేసిందేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
Vande Bharat Express Cancelled: వందేభారత్ ట్రైన్‌ రద్దు, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ సర్వీస్, ప్రత్యామ్నాయంగా మరో రైలు నడిపిస్తున్న అధికారులు
VNSవిశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ రావాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల్దేరాల్సి ఉంది.
Leopard Trapped In Tirumala: బోనులో చిక్కిన మరో చిరుత, తిరుమల మెట్లమార్గంలో చిరుతను బంధించిన అటవీ సిబ్బంది, ఇంతకీ తిరుమలలో ఎన్ని పులులున్నాయంటే?
VNSతిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే.
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ పూర్తి సారాంశం ఇదిగో, ఈ ఐదు కీలక అంశాలతో భారత్ నంబర్ వన్ అవుతుందని తెలిపిన టీడీపీ అధినేత
Hazarath Reddyవిశాఖ వేదికగా చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. ఇందులో అయిదు కీలక అంశాలను ఆయన ప్రజెంట్ చేశారు. భారతదేశం 2047 నాటికి ప్రపంచ నెంబర్ వన్‌ ఆర్థిక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ విజన్ ను ప్రజల ముందుకు తెస్తున్నాననీ దీనిపై మేథావులు, నిపుణులు స్పందించి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు.
CM KCR's Medak Visit Postponed: భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్, సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా, 23వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా పర్యటన వాయిదా పడింది. అయితే, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌.. పర్యటనను వాయిదా వేసినట్టు సమాచారం. కాగా, సీఎం కేసీఆర్‌ ఈనెల 19వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. వాతావరణ శాఖ అధికారుల సూచనతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 19కి బదులుగా 23వ తేదీన మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్టు తెలిపారు.
Andhra Pradesh: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త, జీతాలను 37 శాతం పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, మూడు చోట్ల ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు రెడీ
Hazarath Reddyసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌.
Tellam Venkatarao: పొంగులేటికి ఝలక్‌ ఇచ్చి బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్న తెల్లం వెంకట్రావ్, భద్రాచలం టికెట్ ఒకే అయినట్లుగా వార్తలు
Hazarath Reddyఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించాడు.భద్రాచలం టికెట్ తెల్లం వెంకట్రావుకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Andhra Pradesh: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయనున్న జగన్ సర్కారు, కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, ఓ అభిమాని తన బిడ్డను చేతుల్లోకి తీసుకోమని ఇస్తుంటే అతడిని నెట్టేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజనసేనాధి నేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఎయిర్ పోర్టు లోపల నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ అభిమాని తన బిడ్డను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువచ్చాడు.
Tension in Srinidhi College: శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత, వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌, విద్యార్థి ఆత్మహత్యా యత్నం
Hazarath Reddyమేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్‌, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్‌ కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కడంతో కలకలం రేగింది.
Hyderabad Bikes Stunt Videos: హైదరాబాద్‌లో బైక్స్ స్టంట్‌లతో విధ్వంసం సృష్టించిన యువకులు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyహైదరాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌ శివారులో యువకులు కారు, బైక్‌ రేసింగ్‌లు, విన్యాసాలతో హల్‌చల్‌ సృష్టించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు దినం కావడంతో, ఈ బృందం అటవీ ప్రాంతంలో డ్రాగ్ రేసింగ్‌లో మునిగిపోయింది,
Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ప్లేయర్, ఆస్పత్రికి తరలించే లోపే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyవరుస గుండెపోటు మరణాలు భయాందోళన కల్గిస్తున్నాయి. ఈరోజు ఉప్పల్ పరిధి రామంతాపూర్లోని ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46) గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు.
Vangaveeti Radha's Wedding: వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధాతో పుష్ప వల్లీ పెళ్లి, ఈనెల 19వ తేదీన నిశ్చితార్థం
Hazarath Reddyవంగవీటి రాధ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈనెల 19వ తేదీన వంగవీటి రాధాకు జక్కం పుష్ప వల్లీకి ఎంగేజ్మెంట్ జరగనుంది. వచ్చే నెల 6వ తేదీన వంగవీటి రాధా పెళ్లి జరగనుంది. నరసాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీని వంగవీటి రాధా మనువాడబోతున్నారు.