రాష్ట్రీయం

Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు

Rudra

జమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.

LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ

Rudra

మరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.

Advertisement

Sri Lankan REP Met CM Jagan: శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించండి, సీఎం జగన్‌ను కోరిన శ్రీలంక ప్రతినిధులు

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.

Hyderabad Shocker: తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.

Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

Hazarath Reddy

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

Advertisement

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం

kanha

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..

Telangana: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం, రైలు ఢీకొని అరవై మేకలు మృతి, రైలు పట్టాలు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రైన్

Hazarath Reddy

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

AP Weather Forecast: ఏపీలో మూడు రోజులు అలర్ట్, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ తెలిపారు.

146 New Ambulances in AP: 146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

Hazarath Reddy

వైద్యరంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు మరో దిశగా ముందడుగు వేసింది. 108 అంబులెన్స్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌­లను కొనుగోలు చేసింది

Advertisement

MLA Raghunandan Rao: వీడియో ఇదిగో, నాకు నచ్చితే ఉంటా, లేకపోతే వెళ్లిపోతా, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

నన్ను గౌరవించని చోట నేను పనిచేయాలేను. నాకు నచ్చినన్ని రోజులే పనిచేస్తాను, నాకు నచ్చకపోతే ఎవరూ నన్ను బలవంతం చేయలేరు - దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

TS Weather Forecast: తెలంగాణకు గుడ్ న్యూస్, ఈ నెలంతా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో ఈ నెలంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. నైరుతి రుతుపవనాల సీజన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పరిగణిస్తారు.

Weather Forecast: దేశంలో పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో ఈవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐంఎడీ

Hazarath Reddy

ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. IMD ప్రకారం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, రాయలసీమ, బీహార్‌లోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Fire Accident: శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఆటోమొబైల్ షాపులో మంటలు.. వీడియోతో

Rudra

హైదరాబాద్ శంషాబాద్‌లోని ఓ ఆటోమొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ.. ఘటన సమయంలో దుకాణం మూసివేయడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

PM Modi House: ప్రధాని మోదీ నివాసం మీదుగా డ్రోన్.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు

Rudra

ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో ప్రధాని నివాసంపై డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు.

YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్‌ లోకి షర్మిల.. తనకు సమాచారం ఉందన్న కేవీపీ.. కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామన్న కేవీపీ

Rudra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు స్పందించారు.

Tadipatri Horror: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం.. పని ఒత్తిడే ప్రాణం తీసిందన్న ఆయన కుమార్తె భవ్య.. వీడియోతో

Rudra

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

Tirumala Update: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. సర్వదర్శనానికి 24 గంటల సమయం.. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీవారు స్వయంగా కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వారాంతం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నుంచి ఇక్కడ భారీ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

Advertisement
Advertisement