రాష్ట్రీయం

APSRTC: సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి

Hazarath Reddy

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 7,200 అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలకు వీటిని నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

Kishan Reddy Slams Telangana Govt: వీడియో ఇదిగో, మేము తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరుగలేరు, వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Hazarath Reddy

బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీజేపీ నేతలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిందని తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ కార్యాలయం(Telangana BJP office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ప్రకటించారు. ప్రస్తుతం కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన రాజాసింగ్ వార్తల్లో బీజేపీ కార్యాలయంపై దాడి వార్తలను చూసి ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

Cyberabad Police Alert on Chinese Manja: గాలిపటాలకు చైనా మాంజా వాడవద్దు, ప్రజలకు సూచనలు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదకరమైన నైలాన్ చైనీస్ మాంజా, గాజు లేదా మెటల్ పూతతో కూడిన దేశీ తీగలను వాడవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు.

Advertisement

Andhra Pradesh Horror: కడపలో దారుణం, భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపిన భర్త, అనంతరం నా భార్యను చంపేశానంటూ సమాధానం..

Hazarath Reddy

కడప జిల్లా తొండూరు మండలం తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు భర్త గంగాధర్, అతను మతిస్థిమితం లేక భార్య, కుమార్తెను భర్త హత్య చేశారు

Sajjanar on Online Betting Apps: వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చంటూ వీడియో, వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

Hazarath Reddy

ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు.

BJP VS Congress: వీడియోలు ఇవిగో, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు,ఎదురుతిరిగిన బీజేపీ నాయకులు

Hazarath Reddy

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ (BJP) కార్యాలయం వద్ద హైటెన్సన్ నెలకొంది. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలు యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు

Ghatkesar Car Catches Fire Case: ఘట్‌కేసర్‌ కారు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు, బంధువు బ్లాక్ మెయిల్ కారణంగా మంటల్లో కాలి లోకాన్ని వీడిన లవర్స్

Hazarath Reddy

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ఠాణా పరిధిలో కారు మంటల్లో కాలిపోయిన ఘటనను పోలీసులు చేధించారు. ఈ కారు ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగినది కాదని ప్రేమికులు కారులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.

Advertisement

Formula-E Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Former Minister KTR) వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) డిస్మిస్ చేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, చికిత్స కోసం ఇచ్చిన ఇంజక్షన్ వికటించడంతో విద్యార్థి మృతి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆందోళన

Hazarath Reddy

ఏపీలోని విజయనగరం పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఓ విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగా సిబ్బంది సమాచారంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది విద్యార్థికి ఇంజెక్షన్ ఇవ్వగా.. అది వికటించడంతో ఆ విద్యార్థి ప్రాణాలు పోయాయి.

Allu Arjun Meets Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

Advertisement

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Formula-E Car Race: ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు హైకోర్టులో ఊరట దక్కేనా?? క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నేడే.. కోర్టు ఏం చెప్పనుంది? సర్వత్రా ఉత్కంఠ

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో కేటీఆర్‌ కు వేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Ambati Rambabu: వీడియో ఇదిగో, అడ్వకేట్‌గా మారిన అంబటి రాంబాబు, ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించిన మాజీ మంత్రి

Hazarath Reddy

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అడ్వకేట్ గా మారిపోయారు. ఏపీ హైకోర్టులో తన పిటిషన్ పై తానే వాదనలు వినిపించారు. ఇక ఎ‍ల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్‌ ఇచ్చారు.

Car Catches Fire in Ghatkesar: వీడియో ఇదిగో, ఘట్‌కేసర్ వద్ద కారులో మంటలు, బయటకు వచ్చే అవకాశం లేక ఇద్దరు సజీవ దహనం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరొకరు కారులోనే మృతి చెందారు. మృ‌తులు ఉప్పల్ వాసులుగా గుర్తించారు.

Formula E Race Case: కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన ఏసీబీ, ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు, నేడు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Hazarath Reddy

హైదరాబాద్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు అందించారు. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు దర్యాప్తు సంస్థ తన తాజా నోటీసుల్లో పేర్కొంది.

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement