ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు, 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్, విజయవాడలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

మే 13న లోక్ సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.

Heatwave Alert: మూడు రోజులు బయటకు రాకండి, ఏపీతో పాటు ఈ రాష్ట్రాలకు తీవ్ర హీట్‌వేవ్ హెచ్చరిక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) అనేక రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్, ఈశాన్య ఐదు రాష్ట్రాల్లో ఈరోజు, మే 2 న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి స‌ర్కిల్ వ‌ర‌కు రోడ్‌షో

Hazarath Reddy

ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు.

Andhra Pradesh Elections 2024: జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాగేసుకునేవాడు కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివరణ ఇచ్చిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: జగన్‌కు అండగా నిలవండి, ఏపీ ముస్లిం ఓటర్లను కోరిన అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతమే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు.

CM Jagan Bus Yatra: నేడు మూడు జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. బొబ్బిలిలో మేమంతా సిద్ధం సభ..

sajaya

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మే 1 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలి లో మెయిన్ రోడ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Andhra Pradesh Election 2024: టీడీపీ, జనసేన రూపొందించిన మేనిఫెస్టోను స్వాగతిస్తున్నామని తెలిపిన బీజేపీ, ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంతో దెప్పి పొడుస్తున్న వైసీపీ

Hazarath Reddy

నేడు విడుదల చేసిన మేనిఫెస్టోకు తమ మద్దతు ఉందని బీజేపీ స్పష్టంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం టీడీపీ, జనసేన సంయుక్తంగా రూపొందించిన ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో-2024ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది అంటూ ఏపీ బీజేపీ ఓ ప్రకటన చేసింది.

Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ దూరంగా వెళ్లిపోయింది, కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని

Hazarath Reddy

కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు

Advertisement

Andhra Pradesh Elections 2024: టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కనిపించని ప్రధాని మోదీ ఫోటో, చంద్రబాబు హామీలు బీజేపీ నమ్మడం లేదనడానికి ఇదే సాక్ష్యమని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ ఈ ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు

Andhra Pradesh Elections 2024: ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం

Hazarath Reddy

ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది.

Vijayawada Doctor Family Died: విజయవాడలో వైద్యుడే కుటుంబ సభ్యులను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్థారించిన పోలీసులు, డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

Hazarath Reddy

విజయవాడలోని గురునానక్‌ నగర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.బాధిత కుటుంబం ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రైతు లోన్ డబ్బును దొంగలించిన దుండగులు, స్కూటీలో నుంచి ఎత్తుకుని పరార్

Hazarath Reddy

రాయదుర్గం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో లోన్ రెన్యువల్ చేసేందుకు 4 లక్షల 70 వేలు బ్యాంకుకు తీసుకువెళ్ళాడు పల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పారెడ్డి. బ్యాంకు లోన్ రేపు కట్టాలని బ్యాంక్ అధికారులు సూచించడంతో డబ్బులు స్కూటీ డిక్కీలో పెట్టగా, అది గమనించిన దుండగులు డబ్బులు దొంగలించి పరార్ అయ్యారు.

Advertisement

Andhra Pradesh Shocker: విజయవాడలో ఘోర విషాదం, ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణమా..

Hazarath Reddy

ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు.మంగళవారం ఉదయం పని మనిషి ఇంటికి వెళ్లి చూడగా బాల్కనీలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు.

Chandrababu Slams CM Jagan: సైకో జగన్‌ని శాశ్వతంగా ఇంటికి పంపండి, డోన్‌ ప్రజాగళం సభలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

Hazarath Reddy

పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ తన ఫొటో వేసుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్‌ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు

Pawan Kalyan Slams CM Jagan: నవ్వుతూ ఉండే ఆ తండ్రి లేని బిడ్డ ఫొటో మనకెందుకు,సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేనాధి నేత పవన్ కల్యాణ్ ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అయి ఉండి సొంత ఇంటికే దారి వేయించుకోలేని వ్యక్తి... మన దారులు ఏం పూడ్చుతాడు, మన రోడ్లు ఏం వేస్తాడు? అంటూ పవన్ విమర్శించారు.

CM Jagan Slams Chandrababu: పోయేకాలం వస్తే హీరో విలన్లకి బచ్చాలానే కనిపిస్తాడు, చంద్రబాబు బచ్చా వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన సీఎం జగన్

Hazarath Reddy

గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు

Advertisement

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు , అలాగే 25 ఎంపి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

CM Jagan Tweet: మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌

sajaya

మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Heat Wave In Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్..

sajaya

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్.. ఏపీలో 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన.

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం.. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ..బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు..

sajaya

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు.. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ.. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్న అధికారులు.

Advertisement
Advertisement