ఆంధ్ర ప్రదేశ్

YSRCP 9th List: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి, తొమ్మిదవ జాబితాను విడుదల చేసిన జగన్ సర్కారు, మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకం

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ తాజాగా తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది

Scorching Summer in India: రాబోయే 3 నెలలు భానుడు భగభగలు, తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతాయని ఐఎండీ వార్నింగ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

భారతదేశం ఈ ఏప్రిల్‌లో దేశంలో అతిపెద్ద ఎన్నికల సీజన్‌లోకి వెళుతున్నందున మండే వేసవిని (Scorching Summer in India) చూడబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) మార్చి నుండి మే వరకు సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులను హెచ్చరించింది.రాబోయే మూడు నెలల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో హీట్‌వేవ్ రోజులను మేము ఆశిస్తున్నామని తెలిపింది.

Satish Reddy Joins YSRCP: పులివెందులలో టీడీపీకి భారీ షాక్, వైసీపీలో చేరిన కీలక నేత సతీష్‌రెడ్డి, వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని వెల్లడి

Hazarath Reddy

పులివెందులలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు.

Suryaprakash Joins YSRCP: వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్, ఆరేళ్లలో అరగంట కూడా నాతో పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మండిపాటు

Hazarath Reddy

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై మండిపడ్డారు.

Advertisement

Jagananna Vidya Deevena: ఐదేళ్లలో ఒక్క విద్యారంగానికే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన జగన్ సర్కారు, జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్‌ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్‌ ఖాతాల్లోకి సీఎం జగన్‌ విడుదల చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, సునీత ముసుగు నేటితో తొలగిపోయిందంటూ కౌంటర్ విసిరిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

వివేకా కేసుపై సునీత చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌటంర్ ఇచ్చారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేనని మరి అలాంటప్పుడు ఈ కేసు కేసు గురించి సునీత ఆయన్ని ఎందుకు నిలదీయలేకపోయింది? అని ప్రశ్నించారు

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసు, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే కష్టాలు మరింత ఎక్కువవుతాయి, వైసీపీ పార్టీకి ఓటు వేయవద్దని తెలిపిన వైఎస్ సునీత

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసుపై ఆయన కూతురు వైఎస్ సునీత తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

AP Inter Exams 2024: ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లు సిద్ధం, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే 8.45 గంటల కల్లా విద్యార్థులు పరీక్ష హాల్లో ఉండాలని అధికారులు తెలిపారు.

Advertisement

Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం

Rudra

వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు ధరలను సవరించాయి.

Pattipati Pullarao's Son Sharat Arrest: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న మాచవరం పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అత‌డిపై జిఎస్టీ అధికారులు పిర్యాదు చేయ‌డంతో విచారణ జరిపిన పోలీసులు నేడు శరత్‌ను అరెస్ట్ చేశారు.

Perni Nani Slams Pawan Kalyan: నీ రాజకీయాలే తేడా అనుకున్నా నువు కూడా తేడానే, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన పేర్ని నాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగో, రెండో.. ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్‌.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు

Ambati Rambabu Slams Pawan Kalyan: నీకు, చంద్రబాబుకి మొగుడు జగన్, నీ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, జనసేనాధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్, నీకు, చంద్రబాబునాయుడుకి మొగుడు జగన్ మోహన్ రెడ్డి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

IAS Imtiaz Joins YSRCP: వైసీపీలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌, కర్నూలు అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.

Andhra Pradesh Elections 2024: జెండాలు మార్చుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆసక్తికర సన్నివేశం వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చారు. రైతన్నలకు మద్దతుగా ఇరువురు నేతలు నాగళ్లు భుజాన వేసుకున్నారు. అనంతరం జెండాలు మార్చుకుని తమ మైత్రిని ప్రదర్శించారు.

Mudragada Writes to Pawan Kalyan: మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు, పవన్‌ పవన్‌ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ, మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చంటూ..

Hazarath Reddy

మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు. ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు. నా 40 ఏళ్ల​ రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదు’ అంటూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.

Andhra Pradesh Elections 2024: నా సలహాలు పట్టించుకోకుంటే మీ ఖర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ

Hazarath Reddy

ఈ లేఖలో తెలుగుదేశం, జనసేన బాగు కోరి తాను ఇచ్చే సలహాలు అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేవని... అది వారి ఖర్మ అని జోగయ్య అన్నారు. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. తన సలహాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆయన ఈ లేఖ రాశారు.

Advertisement

YSRCP 8th List: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల

Hazarath Reddy

వైసీపీ తాజాగా మరో రెండు పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో గుంటూరుకు కిలారు రోశయ్య, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని.. అసెంబ్లీ స్థానాల్లో పొన్నూరుకు అంబటి మురళి, కందుకూరుకు మధుసూదన్‌ యాదవ్‌, జీడీ నెల్లూరుకు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Chandrababu Slams CM YS Jagan: టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్‌ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్‌ సినిమా అంటూ ఎద్దేవా

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో ఏపీ ముఖ్యమంత్రిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ (Chandrababu Slams CM YS Jagan) అయ్యారు. టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్‌ ముక్కలై పోవాలి. పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి.

Pawan Kalyan Slams CM YS Jagan: నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్, చంద్రబాబును సీఎం చేయడమే నా లక్ష్యం, టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ - జనసేన ఉమ్మడి సభలో పవన్‌ కళ్యాణ్ సీఎం జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు.

Gollapally Surya Rao Resigns TDP: రాజోలులో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

టీడీపీకి మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

Advertisement
Advertisement