ఆంధ్ర ప్రదేశ్

Independence Day 2023: మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌. అనంతరం ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

AP Road Accident: బాపట్లలో స్కూలు బస్సు బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు

Hazarath Reddy

Andhra Pradesh: కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న యువకుడు, కాకినాడలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇదిగో

Hazarath Reddy

కాకినాడ - రాజాం మండలంలోని రాజిపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది.

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలినడకన వెళ్లే భక్తలకు ఆత్మరక్షణ కోసం మంచి ఉత కర్ర ఇస్తాం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

తిరుమల కాలి నడకన వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి ఆత్మరక్షణ కోసం ఒక మంచి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించాం - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Advertisement

Video: తీవ్ర విషాదాలు, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి, పని కోసం బయటకు వెళ్లి మరొక యువకుడు మృతి

Hazarath Reddy

కర్నూలు - బేతంచెర్లలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర (21) స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి - బిక్కవోలుకు చెందిన రాజా (30) అనే యువకుడు సోమవారం ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్ళాడు.

Video: వీడియో ఇదిగో, దహన సంస్కారాలు చేయాలంటే పొంగి పొర్లుతున్న వాగును దాటాల్సిందే, బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా

Hazarath Reddy

ఆ గ్రామంలో దహన సంస్కరాలు చేయాలంటే పొంగిపోతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామంలో గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌కే ఈ దుస్థితి రావటం ఆ గ్రామ ప్రజలను కలచివేస్తుంది.

Rat in Godavari Express: 20 నిమిషాల పాటు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేసిన ఎలుక, క్యాబిన్ కంట్రోల్ పానెల్‌లోకి దూరడంతో పొగలు

Hazarath Reddy

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎలుక కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీ కోచ్ క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడంతో పొగలు వచ్చాయి. వెంటనే రైలు ఆపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్.. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.

Independence Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జెండా ఎగురవేసిన ఇద్దరు సీఎంలు (వీడియో)

Rudra

తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Advertisement

Independence Day 2023 Google Doodle: భారత స్వాత్రంత్ర దినోత్సవ సంబురాన గూగుల్ ప్రత్యేక డూడుల్.. మీరూ చూడండి!

Rudra

మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గూగుల్.. ప్రత్యేక డూడుల్ ను రూపొందించి ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేసింది.

Independence Day Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు.. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ 10వ ప్రసంగం.. అమృత కాలంలో నవయవ్వన భారతమే లక్ష్యమని ప్రకటన (వీడియోతో)

Rudra

యావత్తు 140 కోట్లమంది భారతదేశ ప్రజల మనసులు గర్వంతో ఉప్పొంగిపోయాయి. మంగళవారం 77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 7.30 గంటలకు రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.

Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం

kanha

తిరుపతి ఎస్వీ యూనివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీలో చిరుత సంచారం కలకలం రేపింది. భయంతో గ్రౌండ్ నుంచి విద్యార్థులు పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మొన్న చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి చెందిన విషయం తెలిసిందే.

Tirumala Bear: తిరుమలలో శ్రీవారి నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్, 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించడంతో పరుగో పరుగు..

kanha

తిరుమలలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. ఈ రోజు ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

AP Police: వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

kanha

ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.

Alert To TTD Devotees: టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు... నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయి - టీటీడీ ఈవో

kanha

టీటీడీ ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Leopard In Tirumala: తిరుమల నడక దారిలో మరో చిరుత పులి, వైరల్ వీడియో చూస్తే గుండె ఆగిపోతుంది, భక్తులు పరుగో పరుగు..

kanha

తిరుమలలో మరో చిరుత.. భక్తుల పరుగులు, తిరుమల నడకదారిలో ఈరోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది.

Annavaram: అన్నవరంలో రేపటి నుండి కొత్త నిబంధన.. రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన.. గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు విక్రయించేందుకు మాత్రమే అనుమతి

Rudra

పర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం కొత్త నిబంధన అమలు చేయనుంది. రేపటి (మంగళవారం) నుంచి కొండపై ప్లాస్టిక్‌ ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. కొండపై ఉన్న దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు.

Advertisement

Leopard at Tirumala: తిరుమలలో ఆరేళ్ల బాలికను పొట్టనపెట్టుకున్న చిరుత ఆటకట్టు.. ఎట్టకేలకు బోనులోకి.. వీడియోతో..

Rudra

తిరుమల నడకమార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను ఇటీవల పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున ఈ చిరుత బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Pawan Kalyan: పవన్ దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలి, పవన్‌ ఓ పిరికిపంద, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

kanha

పవన్ కల్యాణ్ ఆరోపణలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పాతిక సీట్లలో పోటీ చేసి ఎలా సీఎం అవుతావని ప్రశ్నించారు.

Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ

Rudra

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది.

Telangana Rains: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అవర్తనం.. దాని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

తెలంగాణలో వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement
Advertisement