ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ప్రాణహాని! రెండు రోజుల నుంచి పవన్ ను ఫాలో అవుతున్న వ్యక్తులు, కొద్దిరోజులుగా ఇంటి వద్ద రెక్కీ, జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జనసేన, ఆందోళనలో పవన్ అభిమానులు

Naresh. VNS

విశాఖ పరిణామాల తర్వాత పవన్ కల్యాణ్ నివాసం, కార్యాలయం దగ్గర కొత్త వ్యక్తులు తిరుగాడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడిస్తున్నాయి. ఆ వాహనాల్లోని వ్యక్తులు పవన్ కల్యాణ్ కారును నిశితంగా పరిశీలిస్తున్నారు.

Andhra Pradesh: అనంతపురం విద్యుత్ షాక్ ఘటన, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, ఏడీ, ఏఈ,లైన్ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు

Hazarath Reddy

అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను ( AD, AE and line inspector) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు

Andhra Pradesh: అనంతపురంలో ఘోర విషాదం, విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కార్మికులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోర విషాదం చోటు చేసుకుంది.ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు మృతి చెందారు.

Amaravati Padayatra Row: పాదయాత్రలో ముందు రైతులు ఉంటే వెనక వాళ్లెందుకు ఉన్నారు, పాదయాత్ర ద్వారా కోర్టులపైనా ఒత్తిడి తెస్తారా, ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

అమరావతి పాదయాత్రపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి విదితమే. నేటి విచారణలో భాగంగా పాదయాత్రపై (Amaravati Padayatra Row) ఏపీ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పాదయాత్రలో ముందు రైతులున్నప్పటికీ వెనుక వేరేవాళ్లు ఉన్నారని కోర్టు (High Court) వ్యాఖ్యానించింది.

Advertisement

PM Modi to Visit Vizag: నవంబర్ 11న మూడోసారి విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ, 14 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, స్వాగతం పలకనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి విశాఖకు (PM Modi to Visit Vizag) రానున్నారు. నవంబర్ 11న విశాఖకు రానున్న ప్రధాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు తలమునకలయ్యారు.

MLC Challa Bhagiratha Reddy: వెంటిలేటర్‌పై వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపిన ఆయన బంధువు చల్లా రఘునాథరెడ్డి

Hazarath Reddy

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆయన బంధువు చల్లా రఘునాథరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న చల్లా ఆదివారం తీవ్రమైన దగ్గుతో బాధపడ్డారు.

YSR Achievement Awards 2022: వైఎస్సార్ అవార్డుల ప్రధానోత్సవం, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మందికి వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు

Hazarath Reddy

సామాన్యుల్లోని అసమాన్యుల సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను గర్వకారణంగా నిలుస్తాయని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.

Three Capitals Row: అమరావతి రాజధాని కేసులో కీలక మలుపు, విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు CJI జస్టిస్‌ లలిత్, కేసు వేరే బెంచ్‌కు బదిలీ

Hazarath Reddy

అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు. లలిత్‌ తెలిపారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Andhra Pradesh: 2023 జనవరి 26 నుంచి ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమల్లోకి, ఫ్లెక్సీ తయారీదారులు సామగ్రిని మార్చుకునేందుకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించాలని సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రభుత్వం జనవరి 26కి వాయిదా పడింది. కాగా ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh: అమరావతి పాదయాత్రపై హైకోర్టు కీలక తీర్పు, గతంలో ఇచ్చిన ఆదేశాలు సవరించేది లేదని తెలిపిన ధర్మాసనం,గుర్తింపు కార్డులు చూపాల్సిందేనని స్పష్టం

Hazarath Reddy

అమరావతి పాదయాత్రకు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది.ఈ మేరకు అమరావతి పాదయాత్రకు సంబంధించి వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది.

AP Formation Day: సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ . పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం. అమరజీవి పొట్టిశ్రీరాములుకు సీఎం నివాళులు.

Three Capitals Row: సుప్రీంకోర్టులో నేడు విచారణకు అమరావతి రాజధాని కేసు, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో గత కొద్ది రోజులుగా రాజధాని అంశం హీటెక్కిస్తున్న సంగతి విదితమే.అధికార పార్టీ వికేంద్రీకరణ, మూడు రాజధానులతోనే అభివృద్ధి అంటే ప్రతిపక్షాలు అమరావతి రాజధానిగా ఉండాలంటూ పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కేసు నేడు(మంగళవారం) సుప్రీంకోర్టులో (Supreme Court ) విచారణకు రానుంది.

Advertisement

Andhra Pradesh: నేటి నుంచి ఆ యూనివర్సిటీ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీ, బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ చట్ట సవరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు.

AP Formation Day: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్, అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలను (Andhra Pradesh celebrates Formation Day) ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Sabari Express: శబరి ఎక్స్‌ ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుప రాడ్డుకట్టిన దుండగులు.. లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Sriyansh S

హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ ప్రెస్ కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలుకు బ్రేకులు వేశారు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. లోకోపైలట్ గుర్తించకుంటే కనుక పెను ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు.

AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మెసేజెస్, ఈ కోట్స్ ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పేయండి..

Sriyansh S

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి.

Advertisement

Shock to Narayana: అమెరికా విమానాశ్రయంలో సీపీఐ అగ్రనేత నారాయణకు చేదు అనుభవం.. అమెరికా వీసా ఉన్నా విచారణ కోసం ఆపేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి నారాయణను సుమారు 6 గంటలపాటు అక్కడే నిలిపేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది

Sriyansh S

కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు క్యూబా వెళ్లిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను ఫ్లోరిడా విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణ వివరాలను అడిగిన సిబ్బంది... ఫోన్‌లో క్యూబా దేశాధ్యక్షుడితో దిగిన ఫోటోను చూసి సుమారు 6 గంటలపాటు అక్కడే ఆపారు.

Heavy Rains in AP: తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వాయుగుండంగా మారిన అల్పపీడనం, నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, శ్రీలంక మీదుగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Andhra Pradesh: కాపుల అభివృద్ధే ధ్యేయంగా 3 తీర్మానాలు, 70 లక్షల మంది కాపులకు సంక్షేమ పథకాల లబ్ధి, రాజమండ్రిలో కాపు నేతల సమావేశం

Hazarath Reddy

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కాపులకు పెద్దపీట వేసిందని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు పేర్కొన్నారు. కాపుల రాజకీయ సాధికారత కోసం సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ సీపీ కాపు ముఖ్య నేతలు సోమవారం నాడు రాజమండ్రి వేదికగా కీలక సమావేశం నిర్వహించారు.

AP Shocker: ఒకే మహిళతో ఇద్దరు సంబంధం, ఇక నీవు పడుకోలేవంటూ ఓ వ్యక్తి పురుషాంగాన్ని గాజుతో కోసేసిన మరో వ్యక్తి, సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన, నిందితుడు అరెస్ట్

Hazarath Reddy

ఏపీలో సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను సంబంధం పెట్టుకున్న మహిళతో ఇంకొకరు సంబంధం పెట్టుకోవడంతో సహించలేని ఓ వ్యక్తి సంబంధం పెట్టుకున్న వ్యక్తి పురుషాంగాన్ని (man Cuts Off Genitals Of Man) కోసేశాడు.

Advertisement
Advertisement