ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైసీపీ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాడి, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. గాలీవీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీవోను కోరాడు. ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని ఎంపీడీవో తెలిపారు.

TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ..ఇకపై వారానికి రెండుసార్లు సిఫారసు లేఖలకు అనుమతి

Arun Charagonda

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్తనందించింది. ఇకపై వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

మాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు.

Dr Manmohan Singh Dies: దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయింది, మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు.

Advertisement

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, చంద్రబాబు ష్యూరిటీ లేదు..భవిష్యత్తు గ్యారంటీ లేదు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ మంత్రి రోజా చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.

Andhra Pradesh: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్, వీడియోలు, ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

Minister Konda Surekha: తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యంపై మంత్రి కొండా సురేఖ ఫైర్, టీటీడీ తరపున ధర్మ ప్రచార నిధులను కేటాయించాలని డిమాండ్

Arun Charagonda

తిరుమల వివాదం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం.. ఆంధ్రకు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

Advertisement

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

Arun Charagonda

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, సిలిండర్ పేలి గుడిసె దగ్ధం, మంటలు ఆర్పే శక్తి లేక ఏడుస్తూ చూస్తుండిపోయిన తాతా మనవరాలు

Hazarath Reddy

మడకశిర సరిహద్దు కర్ణాటక రాష్ట్రం పావగడ లోని హరి హర పుర గ్రామంలో సిలిండర్ పేలి గుడిసె దగ్ధం అయింది. బుధవారం సాయంత్రం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మంటలు ఎగసాయి.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మారుతి స్వామి ఆలయంపై దాడి, శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

క్రిస్మస్ పండుగ ముందు రోజు దేవాలయంపై కొంత మంది మతోన్మాదులు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు కోటలోని శ్రీశాన్తి నమ్ర మారుతి స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Hazarath Reddy

2024వ సంవత్సరం ముగింపుకు దగ్గర పడుతుండడంతోపాటు 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో రానున్న సంవత్సరంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తాయో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Roja Slams Chandrababu Govt: లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా మేము గుడ్ బుక్ ఓపెన్ చేస్తాం, ఇప్పుడు ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చిన రోజా

Hazarath Reddy

నగరిలో జరిగిన వైసీపీ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి రోజూ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు

Huge Python: వీడియో ఇదిగో, తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ, పామును చూసిన ఒక్కసారిగా షాక్‌కు గురయిన దుకాణదారులు

Hazarath Reddy

తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో 2500వ మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ దాగి ఉంది. పామును చూసిన దుకాణదారులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు.

Andhra Pradesh Shocker: రూ.300 కోసం ఘర్షణ..కర్రతో దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి, పరారీలో నిందితుడు!

Arun Charagonda

కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో విషాదం చోటు చేసుకుంది. రూ.300 కోసం సతీష్, వెంకటేశ్వరరావు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో సతీష్ పై కర్రతో దాడి చేశారు వెంకటేశ్వరరావు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సతీష్ మృతి చెందగా పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి తెలిపారు. దీని ప్రభావంతో 1.5 కి.మీ. మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Andhra Pradesh: హిజ్రాను ప్రేమించిన కొడుకు, హిజ్రాలతో వాగ్వాదం...అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..నంద్యాలలో షాకింగ్ సంఘటన

Arun Charagonda

ఏపీలోని నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాలలో నివాసముంటున్న సుబ్బరాయుడు-సరస్వతి దంపతుల కుమారుడు సునీల్.

CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్‌ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ

Arun Charagonda

పుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Arun Charagonda

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

VNS

బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) కొనసాగుతోంది. చెన్నైకి 135 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Advertisement
Advertisement