ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభం, రేపు రాత్రి 8 గంటలకు ముగియనున్న దీక్ష, కార్యాలయానికి తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
Hazarath Reddyటీడీపీ నేత పట్టాభి రామ్ సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. దానికి నిరసనగా ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులు చేసిన సంగతి విదితమే. ఈ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది.
Police Commemoration Day 2021: తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు, అసాంఘీక శక్తులను ఏరి పారేయండి, సీఎంని బూతులు తిట్టే స్థాయికి వచ్చారు, పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్
Hazarath Reddyఏపీలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి (Police Commemoration Day 2021) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్‌ ప్రసంగించారు.
CM KCR Review: గంజాయి లేని రాష్ట్రంగా తెలంగాణ, డ్రగ్స్ వినియోగం, గంజాయి అక్రమసాగుపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై (illegal drug supply in telangana) ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగంపై తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం వచ్చిందన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలని ఆదేశించారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 523 మందికి కోవిడ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 44,086 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 523 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మహమ్మారి వల్ల మృతి చెందారు.
CM YS Jagan: టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీఎం జగన్, సంక్షేమ పాలన చూసి ఓర్వలేక వారు బూతుల రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన, జగనన్న తోడు కింద రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ
Hazarath Reddy'జగనన్న తోడు' కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) జమ చేశారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేశారు.
TDP vs YSRCP: పట్టాబి వ్యాఖ్యలు దారుణం, దీనిపై దర్యాప్తు చేస్తామని తెలిపిన డీజీపీ సవాంగ్, నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు, చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రులు
Hazarath Reddyఈ వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్ (AP DGP Sawang) స్పందించారు. పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.
Atla Tadde 2021: అట్లతద్ది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు, అట్లతద్దె పండుగ చరిత్ర ఏమిటి, ఉయ్యాలపండగ రోజున ఏ పనులు చేయాలి, గోరింటాకు పండగపై ప్రత్యేక కథనం
Hazarath Reddyఅట్ల తద్ది అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ పండుగ.ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది (Atla Tadde 2021) అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 483 మందికి కోవిడ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు, ఇంకా 5,654 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 40,191 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 483 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 81, గుంటూరు జిల్లాలో 61, ప్రకాశం జిల్లాలో 55, పశ్చిమ గోదావరి జిల్లాలో 53 కేసులు గుర్తించారు.
Jagananna Thodu: చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో నేడు వడ్డీ జమ, జగనన్న తోడు లబ్దిదారులు మళ్లీ రుణాలు తీసుకునే అవకాశం, 9.05 లక్షల మందికి రూ. 950 కోట్ల రుణాలను అందించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyజగనన్న తోడు పథకంలో భాగంగా లబ్దిదారుల వడ్డీ సొమ్మును నేడు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ (Andhra Govt to deposit interest amount) చేయనున్నారు.
Andhra Pradesh: ప్రజలు ఆవేశాలకు గురికావొద్దు, రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన డీజీపీ సవాంగ్, నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ
Hazarath Reddyటీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలను ముట్టడించాయి. ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఏపీ డీజీపీ సవాంగ్ రెచ్చగొట్టేవారికి హెచ్చరికలు జారీ చేశారు.
TDP vs YSRCP: సీఎం జగన్‌పై రాయలేని భాష వాడిన టీడీపీ నేత పట్టాభి, నిరసనగా పట్టాభి ఇల్లు-టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు, గవర్నర్ కు ఫోన్ చేసి దాడులు గురించి తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది ఏకంగా దాడుల వరకు వెళ్లింది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ మీడియా సమావేశంలో ఏపీ సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలు (TDP spokesperson Pattabhi Ram) చేసారు. గంజాయి స్మగ్లర్లు పొరుగు రాష్ట్ర పోలీసుల పై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు, 24 గంటల్లో ఆరుగురు మృతి, ప్రస్తుతం ఏపీలో 5,709 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఏపీలో కొత్తగా 332 కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,804కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్‌తో 14,313 మరణించారు. ప్రస్తుతం ఏపీలో 5,709 యాక్టివ్ కేసులు ఉండగా, 20,40,782 మంది రికవరీ అయ్యారు. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు మృతి చెందారు
CM YS Jagan Review: కరోనాతో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు, బొగ్గు కొరత రాకుండా చూడాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Review) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.
AP Shocker: మహిళ అత్యాచారానికి ఒప్పుకోలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన వృద్ధుడు, కోపంతో పోలీసుల ముందే ఆ కామాంధుడిని చంపేసిన గ్రామస్తులు, ప్రకాశం జిల్లాలో ఘటన
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వృద్ధుడు ఆమె ప్రతిఘటించడంతో కత్తితో దారుణంగా (Old Man brutally stabbed to death woman) గొంతు కోసి చంపేశాడు.
YSR Asara: చంద్రబాబుపై విరుచుకుపడిన మంత్రి కొడాలి నాని, డ్వాక్రా మహిళల డబ్బుకు ఎవరి రికమండేషన్‌ అవసరం లేదని తెలిపిన పేర్ని నాని, గొల్లపూడిలో వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం సంబరాలు
Hazarath Reddyఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన 'వైఎస్సార్‌ ఆసరా' కార్యక్రమం (YSR Asara Scheme) సంబరాలకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని (Ministers Kodali Nani, perni nani) ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి కొడాలి నాని టీడీపీ పార్టీపై విరుచుకుపడ్డారు.
AP Shocker: మంచి నిద్రలో భర్త.. సలసల కాగే నీటిని పురుషాంగంపై పోసిన భార్య, విలవిలలాడుతూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు, ఏలూరులో దారుణ ఘటన
Hazarath Reddyఏపీలో ఏలూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య విభేధాలు తీవ్రం కావడంతో నిద్రపోతున్న భర్త పురుషాంగంపై (Wife pours hot water on husband's private parts ) అతని భార్య సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది.
Corona in AP: ఏపీలో కొత్తగా 332 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 55 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో 3 కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల వ్యవధిలో 29,243 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 332 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Heavy Rains: రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, భారీ వర్షాలకు వణుకుతున్న 4 రాష్ట్రాలు, కేరళలో 8 మంది మృతి, హైదరాబాద్‌పై విరుచుకుపడిన వరదలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది.
No Power Outage in AP: విద్యుత్ కోతలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు, ఏపీలో ఎటువంటి విద్యుత్‌ కోతలు ఉండవని తెలిపిన ప్రభుత్వం, బొగ్గు కొనుగోలుకు భారీగా నిధులు ఇచ్చిన జగన్ సర్కారు
Hazarath Reddyఏపీలో విద్యుత్‌ కోతలపై తప్పుడు ప్రచారాన్ని ఇంధన శాఖ ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ చేస్తోన్న దుష్ప్రచారాన్ని (Fake Rumors on Power Outage) ఇంధన శాఖ అధికారులు తప్పుబట్టారు. విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది