ఆంధ్ర ప్రదేశ్

Road Accident Video: వీడియో ఇదిగో, ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి ఢీకొట్టిన లారీ

Hazarath Reddy

ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి.

Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!

Hazarath Reddy

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత తీవ్ర అస్వ‌స్థ‌త‌, వారాహి స‌భ‌లో పాల్గొంటారని తెలిపిన శ్రేణులు

Hazarath Reddy

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ సమయంలో ఆయ‌న‌ వెన్నునొప్పితో బాధపడ్డారు

Jagan Meeting With YSRCP Leaders: 16 నెలల జైలు జీవితంపై జగన్ సంచలన వ్యాఖ్యలు, కేసులు పెట్టడం మినహా వీళ్లు ఏమీ చేయలేరంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్

Hazarath Reddy

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Goddess Kanaka Durga: నేటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ, వజ్రాలతో కూడిన కిరీటాన్ని కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Arun Charagonda

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ్టి నుండి వజ్ర కిరీటంతో భక్తులను దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. 2.5 కోట్లతో వజ్రాలు, బంగారంతో చేసిన కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు అజ్ఞాత భక్తుడు.

Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదు, అన్నదాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Hazarath Reddy

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు . కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు.

Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి చెత్త ప‌న్ను రద్దు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపు

Hazarath Reddy

ఏపీలో నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు (abolition of Garbage Tax) చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారుల‌ను ఎక్క‌డా ప్ర‌జ‌ల నుంచి చెత్త ప‌న్ను వ‌సూలు చేయ‌రాద‌ని ఆదేశించారు.

Y. S. Avinash Reddy: మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు కూటమి నేతల పని చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Roja on Pawan Kalyan: తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా

Hazarath Reddy

పవన్ ప్రాయశ్చిత్త దీక్షపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు.సుప్రీం కోర్టు వ్యాఖ్యలను పురంధరేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారని మాజీమంత్రి రోజా అన్నారు.

AP DCM Pawan Kalyan At Tirumala: తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..

sajaya

గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు.

AP Liquor Policy Notification: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ, మద్యం షాపుల లైసెన్సుల కోసం నిబంధనలు ఇవే..

sajaya

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది, ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం రెండేళ్ల కాలపరిమితితో వస్తుంది.

Pawan Kalyan Fell Ill: వీడియోలు ఇవిగో, తిరుమల కొండ మెట్లు ఎక్కుతుండగా పవన్‌కి అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు.

Advertisement

Pawan Kalyan Health Update: వీడియో ఇదిగో, తిరుమల కొండ ఎక్కుతుండగా పవన్‌కి తీవ్ర అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండెక్కుతుండగా పవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: ఏపీలో వైన్ షాపులు బంద్, లబోదిబోమంటున్న మందుబాబులు, బార్లకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ గగ్గోలు

Hazarath Reddy

ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది

Jagananna Thodu Name Change: 'జ‌గ‌న‌న్న తోడు' ప‌థ‌కం పేరు మారుస్తూ ఏపీ స‌ర్కార్‌ ఉత్తర్వులు జారీ.. 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్ర‌భుత్వం

Rudra

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన‌ 'జగనన్న తోడు' స్కీమ్‌ పేరును మార్చింది.

Advertisement

LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

Rudra

దసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్‌ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.

Tirupati Laddu Row: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, వారిపై మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

SC On Tirupati Laddu Row: కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

Arun Charagonda

తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.

Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

Advertisement
Advertisement