ఆంధ్ర ప్రదేశ్

Vijayawada Rains: విజయవాడ జలమయం, రోడ్లపై మోకాలి లోతు నీరు, వాహనదారుల అవస్తలు, లోతట్టు ప్రాంతాలన్ని జలమయం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీలోని విజయవాడ నీట మునిగింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.

Roja On Party Change: పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి రోజా, అవన్నీ పుకార్లేనని వెల్లడి, పార్టీ మారుతున్న నేతలతో ఎలాంటి నష్టం లేదని వెల్లడి

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు.

Pithapuram Muncipal Council: పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస, కొట్టుకున్న కమిషనర్ - డీఈ, అవాక్కయిన కౌన్సిలర్లు..వీడియో

Arun Charagonda

పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాస చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

Nara Lokesh Inspects Govt Schools: ఏపీ మంత్రి నారా లోకేష్‌ ముందు ఇంగ్లీష్ అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ స్కూల్స్ తనిఖీల్లో ఆశ్చర్యపోయిన లోకేశ్, వీడియో ఇదిగో

Arun Charagonda

ఏపీ మంత్రి నారా లోకేష్ ముందు ఓ విద్యార్థి ఇంగ్లీష్ ఇరగదీశాడు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఓ స్కూల్‌కు వెళ్లిన లోకేష్‌ ఆశ్చర్యపోయారు. లోకేష్ ముందే ఇంగ్లీష్‌లో అదరగొట్టేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో

Arun Charagonda

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Vijayawada Landslide: విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)

Rudra

భారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. నగరంలోని మొగల్ రాజపురంలో పలు ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.

Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.

Hidden Cameras in College Girls' Washroom: పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా, బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు

Hazarath Reddy

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.

Advertisement

'Hidden Cameras' in Girls' Washroom: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, మరింత ఉధృతంగా మారిన విద్యార్థుల ఆందోళన

Hazarath Reddy

YSRCP MPs Clarity on Party Change Rumors: వీడియో ఇదిగో, జగన్ వెంటే మేమంతా ఉంటామని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీలు, మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారనే హాట్ టాఫిక్ రూమర్స్ పై వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు.

V. Vijayasai Reddy: నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Advertisement

R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

Hazarath Reddy

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు

Arun Charagonda

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.

Andhra Pradesh: సీఎం చంద్రబాబు మరో సంచలనం, ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్‌ఆర్ పేరును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Hidden Cameras In Girls Hostel Washroom: గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్‌ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి

Arun Charagonda

గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.

Advertisement

Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం

Arun Charagonda

వైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

Pawan Kalyan On Vana Mahotsavam: వన మహోత్సవం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపు, అన్య జాతుల మొక్కలను పెంచడం ఆపేద్దామన్న పవన్

Arun Charagonda

దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవన్. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Special Trains: రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??

Rudra

రాబోయే దసరా, దీపావళి, ఛట్‌ పూజ, క్రిస్మస్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

AP DY CM Pawan Kalyan: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.

Advertisement
Advertisement