Prepaid Meters Policy: ఏపీలో రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్, త్వరలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు తీసుకువచ్చే ప్రయత్నాలు, ఏపీ విద్యుత్ శాఖ కొత్త వ్యూహం
Representational Image (Photo credits: PTI)

Amaravati, June 23: ఏపీలో ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్‌ శాఖకు (AP Electricity Department) తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ (EPDCL) కొత్త వ్యూహాలను అన్వేషిస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్‌ మీటర్లు (Prepaid Meters Policy) అమర్చడానికి ఏపీ విద్యుత్ శాఖ రెడీ అవుతోంది. భుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేకి కరోనా, శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థారణ

ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు (prepaid smart meters) అందుబాటులోకి యాప్ ద్వారా బిల్లులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యుత్‌ బిల్లులను మొబైల్‌ రీచార్జ్‌లా ముందుగానే రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితోపాటు విద్యుత్‌ చెల్లింపు కేంద్రాల్లో కూడా రీచార్జ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. మరో నెల రోజుల్లో జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుండటంతో డిస్కంలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నాయి. దీంతో పాటుగా కోట్లాది రూపాయుల బాకాయిలతో ఈపీడీసీఎల్‌ నష్టాల్లో ఉంది. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు వస్తే ఆ సమస్యలకు చెక్‌ పెట్టినట్లు అవుతుంది. వినియోగదారులు కూడా సమర్థవంతంగా విద్యుత్‌ వాడుకునేందుకు వీలవుతుందని అదికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమయితే ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటీవల ఈపీడీసీఎల్‌ పరిధిలో విశాఖ, ఏలూరులో ఏపీఈఆర్‌సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా నిపుణులు ప్రీపెయిడ్‌ మీటర్లు తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టారిఫ్‌ ప్లాన్‌లో భాగంగా 500 యూనిట్లు దాటి వినియోగించుకునే వారు ప్రీపెయిడ్‌ మీటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న నెలరోజుల్లో ప్రీపెయిడ్‌ మీటర్‌ అమర్చనున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఈపీడీసీఎల్‌కు అన్ని సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.6,356.93కోట్లు ఉంది. ఇందులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3,251 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా వినియోగదారుల నుంచి రూ.1549.11కోట్లు రావాల్సి ఉంది. పరిశ్రమల నుంచి 50 శాతం పైగా బకాయిలు ఉన్నాయి. మరోవైపు విద్యుత్తు కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు కలిసి రూ.10,944.27కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. ఆ బకాయిలకు ఇప్పటిదాకా బ్యాంకులకు చెల్లించిన వడ్డీనే రూ.344.24కోట్లుగా ఉన్నట్లు సమాచారం.