Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Hyderabad, Dec 1: ఏపీకి (AP) తుఫాను (Cyclone) ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మైచౌంగ్ గా (Cyclone Michaung) నామకరణం చేసిన ఈ తుఫాను డిసెంబర్ 4 లేదా 5వ తేదీనా ఏపీ తీరానికి సమీపంగా వస్తుందని పేర్కొంది. అయితే, ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై ప్రస్తుతం చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను కారణంగా కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకూ భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. డిసెంబర్ 1 నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.
Cyclone Michaung Update on December 1, 2023: The low over South Bay is turning into a depression. It's heading towards Andhra Pradesh, and Chennai might see heavy rains in the next 36 hours. #ChennaiRains
(PC:COMK) pic.twitter.com/F20rFZQ0W7
— Insightful (@InsightWithHari) December 1, 2023
హెచ్చరికలు జారీ
అల్పపీడనం కారణంగా కోస్తా ఆంధ్రలో 65.2 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వరకూ వర్షపాతం నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
(The above story first appeared on LatestLY on Dec 01, 2023 08:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

