Vande Bharat Train: సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు.. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖకు..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. భారత రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలును కేటాయించింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది.
Hyderabad, Jan 10: తెలుగు రాష్ట్రాల ప్రజలకు (Telugu States) గుడ్ న్యూస్ (Good News). భారత రైల్వే శాఖ (Indian Railway) తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు (Vande Bharat)ను కేటాయించింది. అయితే ఈ సెమీ హైస్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుందన్న దానిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ వందేభారత్ రైలు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ (Visakha), విశాఖ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుందని వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరే వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖ చేరుకుంటుందని తెలిపారు. ఈ రైలును ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, 19న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
?PM Narendra Modi to flag off Vande Bharat express train from Secundrabad to Visakhapatnam on January 19 ?? #AndhraPradesh #Visakhapatnam pic.twitter.com/nB57dQz7rB
— Andhra Pradesh Infra Story (@APInfraStory) January 9, 2023
PM Modi will visit Telangana on 19th January to inagurate and lay the foundation stone of projects worth Rs 7,000 crores. PM will flag off the 8th Vande Bharat train from Secunderabad station & lay stone for the development of Secunderabad Railway Station worth Rs 699 crores. pic.twitter.com/Wj0LreGMYz
— ANI (@ANI) January 9, 2023
(The above story first appeared on LatestLY on Jan 10, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

