తెలంగాణ

CM Revanth Reddy On Hydra: అక్రమార్కులు ఎంత గొప్పోల్లైన వదలిదేది లేదు..హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్

Arun Charagonda

హైడ్రా అక్రమ నిర్మాణాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్...ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు వార్నింగ్ ఇచ్చారు.

Telangana Police: 11 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్‌కు చెక్కును అందించిన డీజీపీ జితేందర్ రెడ్డి..వీడియో

Arun Charagonda

తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్‌ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్‌డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.

Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం

Arun Charagonda

ఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Mahbubnagar: దొంగతనానికి వచ్చి కరెంట్‌ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్‌నగర్‌లో షాకింగ్ సంఘటన

Arun Charagonda

దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.

Stray Dogs Attack: కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో

Arun Charagonda

తెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశారు. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Pawan Kalyan With Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. కోటి విరాళం అందజేత

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంకు సంబంధించిన చెక్‌ను రేవంత్‌కు అందించారు పవన్.

Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం,కేకలు వేయడంతో పరారైన నిందితుడు

Arun Charagonda

ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Stray Dogs Attack:నిజామాబాద్‌లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

16th Finance Commission Meet: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 41 నుంచి 50 శాతానికి పెంచాలి: 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

Hazarath Reddy

దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని..అందుకే ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.

Godavari Water Level Rise: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం, పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు

Hazarath Reddy

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

Ganesh Visarjan in Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

Advertisement

Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.

BJP MLA Alleti Maheshwar Reddy: హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Hazarath Reddy

గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.

Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Rudra

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Advertisement

Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

Rudra

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Rudra

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.

Hari Babu Kambhampati: కంభంపాటి హరిబాబుకు తీవ్ర అస్వస్థత, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అనారోగ్యం

Hazarath Reddy

మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలిలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను తరలించడం కోసం ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు

Telangana Politics: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోండి, తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..

Hazarath Reddy

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఒక పార్టీ బీఫాంతో ఎన్నికల్లో పోటీచేసి, గెలిచాక మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement