తెలంగాణ

Fake Deliveray Scam: డెలివరీ బాయ్ స్కామ్‌తో జాగ్రత్త..మీరు ఏం ఆర్డర్ చేయకుండానే ఓటీపీ చెప్పారో..అంతే!

Arun Charagonda

సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు. తాజాగా డెలివరీ బాయ్ స్కామ్ తెరపైకి వచ్చింది. మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా అది స్కాం అని గుర్తించండి. మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి. మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు కాబట్టి అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించి సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Telangana Assembly Sessions: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, బీసీసీఐతో చర్చలు జరిపామన్న సీఎం రేవంత్ రెడ్డి, మండలానికో మినీ స్టేడియం ప్రతిపాదన

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.

Road Accident Video: వీడియో ఇదిగో, రాయదుర్గంలో వేగంగా వచ్చి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు, స్పాట్‌లోనే స్టూడెంట్ మృతి

Hazarath Reddy

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్‌లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్‌ నేతల నిరాశ

Arun Charagonda

ఫిరాయింపులు , బుజ్జగింపులు వెరీసీ తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి బీఆర్ఎస్ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో టిఫిన్ చేస్తూ జరిగిన చర్చల ఫలితం 24 గంటలు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

Advertisement

Jurala Project: జురాలకు పోటెత్తిన వరద, 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, పోటెత్తిన పర్యాటకులు

Arun Charagonda

మహబూబ్‌నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్ ఫ్లో: 3,25,000 వేల క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 3,11,734 వేల క్యూ సెక్కులుగా ఉంది.

Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్

Rudra

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.

TG Job Calendar: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటన.. తెల్ల రేషన్‌ కార్డులు జారీపై కూడా కీలక ప్రకటన

Rudra

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులు గత ఏండ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ఉద్దేశించిన జాబ్ క్యాలెండర్‌ ను నేటి అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వం ప్రకటించబోతున్నది.

Raj Tarun Case: లావ‌ణ్య కేసులో హైకోర్టును ఆశ్ర‌యించిన హీరో రాజ్ త‌రుణ్, విచార‌ణ రేప‌టికి వాయిదా

VNS

ముందస్తు బెయిల్ మంజూరు (Bail Petition) చేయాలని పిటిషన్ వేశాడు. పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని నార్సింగ్ పోలీసులకు హైకోర్టు (TG High Court) ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

GHMC Rain Alert: గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు రెయిన్ అల‌ర్ట్, రెండు రోజుల పాటూ ఈ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రిక‌

VNS

బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌లోని (GHMC Rain Alert) కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్‌ (TGDPS) అధికారులు వెల్లడించారు. జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మహదేవ్‌పురం, మచ్చబొల్లారం తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి.

Bhumata Portal: ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తిరిగి తెరుచుకోనున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్​లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ధరణి పోర్టల్‌ పేరును భూమాతగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ధరణి పేరును భూమాతగా మార్చనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ.. తన ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిన సంగతి విదితమే.

TG Job Calendar: తెలంగాణ యువ‌త‌కు గుడ్ న్యూస్, రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌నున్న ప్ర‌భుత్వం

VNS

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను (Job Calender) కేబినేట్ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ నెల 2వ తేదీన అసెంబ్లీ (Assembly) వేదిక‌గా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

Skill University: హైద‌రాబాద్ జంట న‌గ‌రాల‌కు జోడీగా మ‌రో సిటీ, కందుకూరు ద‌గ్గ‌ర కొత్త న‌గ‌రం రూపుదిద్దుకోబోతుంద‌న్న సీఎం రేవంత్ రెడ్డి

VNS

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో స్కిల్ యూనివర్సిటీకి (Skill University) సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ వర్సీటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేసింది ప్రభుత్వం.

Advertisement

Telangana Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు స్పాట్‌లోనే మృతి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం సమీపంలోని రామ గోవిందాపురం గ్రామం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Telangana Cabinet Meeting: తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ, జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Telangana Road Accident: చౌటుప్పల్ వద్ద రోడ్డు ప్రమాదం, పోలీసుల స్పందన భేష్, స్థానికుల హర్షం

Arun Charagonda

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. రెండు లారీలు ఢీకొట్టుకోవడంతో బీర్ల సీసాలు, ఉల్లిగడ్డలు చెల్లాచెదురుగా పడ్డాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు రోడ్డును శుభ్రం చేసి వేగంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. వారు వ్యవహరించిన తీరు పట్ల వాహనదారులు ప్రశంసలు కురిపించారు.

Telangana Weather Forecast: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్

Hazarath Reddy

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని బులిటెన్‌లో పేర్కొంది.

Advertisement

Telangana: బుజ్జగింపులు.. పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఇంటికి జూపల్లి, ఆసక్తికరంగా రాజకీయాలు, ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారా?

Arun Charagonda

తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని తిరిగి సొంతగూటికి చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. బుజ్జగింపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాగా , బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Telangana Assembly Session: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారిందని మండిపాటు, సీఎం ఛాంబర్ ముందు బైఠాయింపు

Arun Charagonda

బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.

Telangana Shocker: కొడుకు బాగా చదవలేదని తండ్రి దారుణం, చితక బాది గోనె సంచిలో కుక్కి చెరువులో పడవేసిన కసాయి, పిల్లాడు ఏడుపులు విని స్థానికులు.

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కొడుకు చదువుకోవడం లేదని ఓ తండ్రి ఆ పిల్లాడిని చితక బాది గోనె సంచిలో కుక్కాడు. అనంతరం ఎవరికి కనిపించకుండా తన ఆటోలో మలపు రాజు కుంట చెరువులో పడవేసి కాళ్లతో తొక్కివేశాడు

Dogs Attack: వృద్దురాలి తల,కడుపు పీక్కుతిన్న కుక్కలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం, ఇంటికి తలుపులు లేకపోవడంతో దాడి

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తాండ లో దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న పిట్ల రాజ్యలక్మి (75) అనే వృద్ధురాలు పై కుక్కలు దాడి చేశాయి. తల, కడుపు భాగం పూర్తిగా తిన్నాయి కుక్కలు. రాత్రి దాడి చేసి చంపిన కుక్కలు, తెల్లవారి ఉదయం 9గంటలకు చూశారు కుటుంబ సభ్యులు.

Advertisement
Advertisement