తెలంగాణ

Hyderabad Metro Rail Phase Two Plan: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు, 70 కిలో మీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు

Hazarath Reddy

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. ఈ వివరాలను సీఎంకు అందించారు.

Special Trains to Ayodhya: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి బయలుదేరే రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

న్నో ఏళ్ళ తరువాత అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Ram Mandir Pran Pratishtha: వీడియో ఇదిగో, రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా స్వీట్లు పంచిన ముస్లిం యువకుడు, హైదరాబాద్ నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం

Hazarath Reddy

అయోధ్య శ్రీరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లొ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ముస్లిం నేత హిందువులకు సంతోషంతో స్వీట్లు పంచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం

Hazarath Reddy

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Advertisement

Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే..రామనామ స్మరణలో యావత్తు దేశం..మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)

Rudra

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేడే జరుగనున్నది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది.

Chandrababu Naidu In Ayodhya: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబునాయుడు, బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్న టీడీపీ అధినేత..

sajaya

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరామప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు అయ్యేందుకు అయోధ్యకు వెళ్లారు. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.

Ram Ke Naam Movie: వివాదాస్పద చిత్రం రాం కే నామ్ ప్రదర్శించిన వ్యక్తులపై నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..

sajaya

"రామ్ కే నామ్" అనే డాక్యుమెంటరీ/సినిమా ప్రదర్శనను నిర్వహించినందుకు ముగ్గురు వ్యక్తులపై రాచకొండలోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Hyderabad Shocker: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..

sajaya

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

Advertisement

Ram Ke Naam: అయోధ్య‌లో రామ‌మందిర ప్రాణ ప్ర‌తిష్ట ముందు హైద‌రాబాద్ లో క‌ల్లోలం సృష్టించేందుకు య‌త్నం, వివాదాస్ప‌ద డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించిన ముగ్గురిపై కేసు

VNS

రామ మందిరం ప్రారంభోత్స‌వం ముందు రెండు వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌య‌త్నించారు. రామ్ కే నామ్ (Ram Ke Naam) అనే నిషేదిక డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు. దీంతో వారిపై కేసు న‌మోదు చేశారు నేరేడ్ మెట్ పోలీసులు. సైనిక్ పురిలోకి ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో పోలీసుల (documentary) నుంచి ఎలాంటి ముంద‌స్తు అనుమ‌తి తీసుకోకుండా ఈ డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు.

KTR On Congress: క‌రెంట్ బిల్లుల‌ను సోనియా గాంధీకే పంపిద్దాం! ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

VNS

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందన్నారు. బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామన్నారు.

Ayodhya Invitation for KCR: అయోధ్య రామాలయ వేడుకకు కేసీఆర్ ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. ఇప్పటికే చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం

Rudra

ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

Devarakonda with Prabhas: ప్రభాస్ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ?!

Rudra

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి 2829 AD చిత్రంతో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ జోనర్ చేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో కల్కి తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

Hepatitis-A Vaccine: దేశీయంగా తొలి హెపటైటిస్‌ ఏ టీకా ఆవిష్కరణ.. అభివృద్ధి చేసిన ఐఐఎల్‌-హైదరాబాద్

Rudra

దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్‌ ఏ టీకా హవిష్యూర్‌ ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌ లిమిటెడ్‌(ఐఐఎల్‌) ఆవిష్కరించింది. ‘క్లినికల్‌ పరీక్షల్లో ఈ టీకా సురక్షితం, సమర్థవంతమైనదిగా నిరూపితమైంది’ అని ఐఐఎల్‌ ఎండీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.

Ramoji Film City Tragedy: రామోజీ ఫిల్మ్ సిటీపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘోర ప్రమాదంలో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్‌ షా మృతి, చైర్మన్‌ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజ్‌మెంట్‌ను నిందితులుగా చేర్చారు.

Ayodhya Ram Mandir: రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు రారండి! బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆహ్వానం పంపిన రామ‌తీర్ధ‌క్షేత్ర ట్ర‌స్టు, ఆహ్వానంపై కేసీఆర్ ఏమ‌న్నారంటే?

VNS

ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Event) రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) తరఫున ఆహ్వానం పంపించారు.

TSRTC Bus Collides with Oil Tanker: హన్మకొండలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌, 12 మందికి గాయాలు, బస్సులో 70 మంది ప్రయాణికులు

Hazarath Reddy

ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ దొంగను చితకబాదిన స్థానికులు

Hazarath Reddy

ఎల్బీనగర్‌లొ గంజాయి మత్తులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. హోల్ సేల్ మార్కెట్‌ గల్లీలో రెండు రోజుల క్రితం కూల్ డ్రింక్ షాప్‌లొ చొరబడి కౌంటర్ నుంచి పదివేల నగదును ఎత్తుకెళ్లాడు. మరోసారి అదే ప్రాంతానికి వచ్చి దొంగతనానికి పాల్పడుతుండగా గుర్తించిన స్థానికులు పట్టుకొని, చితకబాది పోలీసులకు అప్పగించారు.

Malla Reddy Enjoyed Ride in Dubai: వీడియో ఇదిగో, దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న మల్లారెడ్డి, రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Hazarath Reddy

రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్న తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి దుబాయ్‌లో రైడ్‌ను ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana: వీడియో ఇదిగో, 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన టైరు, ఒక్కసారిగా అంటుకున్న మంటలు, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద నేషనల్ హైవేపై బెంగళూరు నుండి హైదరాబాద్‌కు 35 మందితో వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు రన్నింగ్‌లో టైర్ ఊడి మంటలు అంటుకున్నాయి.. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

Telangana Shocker: అంబర్ పేటలో దారుణం, ప్రేమించడం లేదని అమ్మాయిని కత్తితో పొడిచిన బాలుడు, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య

Hazarath Reddy

హైదరాబాద్ అంబర్‌పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని మైనర్ అమ్మాయి‌పై ఓ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అడ్డు వచ్చిన ఆమె సోదరిపై కూడా ఆ బాలుడు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు

Advertisement
Advertisement