తెలంగాణ

Lady Aghori Attacked Video: వీడియో ఇదిగో, బట్టలు వేసుకొని స్వామి దర్శనానికి రమ్మన్నందుకు కత్తితో పలువురిపై దాడి చేసిన లేడీ అఘోరీ

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మంగళవారం లేడీ అఘోరీ హల్చల్ చేసింది. చేతిలో కత్తి పట్టుకొని అక్కడున్న వారిపై దాడికి దిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనతో భయాందోళన చెందారు. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లేడీ అఘోరీ మంగళవారం ఆలయం వద్దకు వచ్చింది.

Telangana Shocker: దారుణం,తన కూతురుతో ఇంట్లో ఉన్న యువకుడి గొంతు కోసిన బాలిక తండ్రి, ప్రియుడి గొంతు కోయడంతో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా పరిధిలోని గోపాల్‌పూర్‌లో ఓ బాలిక తండ్రి ఏకంగా భరత్ అనే యువకుడి గొంతును కత్తితో కోసేసాడు. దీంతో ఆ యువకుడికి గొంతు భాగంలో తీవ్ర రక్త స్రావం అయ్యింది. అక్కడి స్థానికులు వెంటనే గాయపడిన భరత్‌ను ఆస్పత్రికి తరలించారు.

Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి

Hazarath Reddy

రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్‌ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్‌ బండ్‌ సమీపంలో అజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు.

CM Revanth Reddy on Investments: దావోస్‌ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు

Advertisement

Telangana: లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఏసీబీకీ అడ్డంగా దొరికిన ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు, తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్‌ఐ సురేష్ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు బాధితుడు తెలిపారు.

Suryapet Honour Killing Case: నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ తన స్నేహితుడైన నవీన్ సోదరి భార్గవిని ఆరు నెలల క్రితం జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు.

Telangana: వీడియో ఇదిగో, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు, 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన

Hazarath Reddy

డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వెళ్తూ కరెంటు పోలును, డివైడరును ఢీకొన్న బైక్, ముగ్గురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన

Hazarath Reddy

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో కొంతమంది రాజకీయ నాయకులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. బాధిత మహిళ, ఓ నాయకుడికి మధ్య జరిగిన గొడవలో సదరు వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మరి కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Road Accident: హైదరాబాద్ మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదేండ్ల కూతురు మృతి, తండ్రికి గాయాలు (వీడియో)

Rudra

హైదరాబాద్ లో పెరిగిన ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన రోడ్లు వెరసి రోజూ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

Nagoba Jatara 2025: నేటి నుంచి నాగోబా మహా జాతర.. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్‌

Rudra

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది.

Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్‌ లో ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)

Rudra

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. పెద్దవారు చేసే ఇలాంటి తప్పిదాలతో పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

Advertisement

No Night Shows For Minors: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను సినిమా థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది.

Padma Awards Controversy in Telangana: తెలంగాణలో పద్మ అవార్డులపై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం, బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

తెలంగాణలో మరో​సారి రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో పద్మ అవార్డుల ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు కూడా పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Kishan Reddy Met Balakrishna: బాలకృష్ణను కలిసి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డుకు భాలయ్య పూర్తిగా అర్హులంటూ అల్లు అర్జున్ ట్వీట్

Hazarath Reddy

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి, పద్మభూషణ్ అవార్డును అందుకున్నందుకు అభినందించారు. ఇక నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

TGSRTC JAC Issue Strike Notice : 21 డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ, లేకుంటే సమ్మె సైరన్‌ మోగిస్తామని హెచ్చరికలు

Hazarath Reddy

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ (TRC JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండటంతో బస్‌భవన్‌ లోపల ఈడీ మునిశేఖర్‌కు కార్మిక సంఘాలు సోమవారం నాడు నోటీసు (TGSRTC Strike Notice) ఇచ్చారు. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు (TGSRTC JAC issue strike notice) అందజేశాయి.

Advertisement

CM Revanth Reddy Slams PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీని గజనీ మహమూద్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని గెలిపించాలని వినతి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముహమ్మద్ ఘజినీతో పోల్చారు. అలాగే బీజేపీని "బ్రిటిష్ జనతా పార్టీ" అని అభివర్ణించారు.మహౌలో జరిగిన 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ'లో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Telangana: తెలంగాణలో అర్హులైన వారందరికీ మార్చి 31లోగా నాలుగు పథకాలు అమలు, రైతుభరోసా కింద తొలి విడతగా రూ. 6 వేలు పంపిణీ చేసిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు మంజూరు పత్రాలు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు

Telangana: వీడియో ఇదిగో, గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం ఎత్తుకెళ్లిన దొంగలు, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో ఘటన

Hazarath Reddy

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.

Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్‌-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.

Advertisement
Advertisement