తెలంగాణ
Telangana: నిఖత్ జరీన్‌, ఇషా సింగ్‌కు రూ. 2 కోట్లు నగదు బహుమతి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయింపు
Hazarath Reddyప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘గోల్డ్ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ తేజం ఇషా సింగ్‌కు కూడా భారీ నజరానా ఇస్తున్నట్లు వెల్లడించారు
MLC K Kavitha: దేశానికి ప్రధాని మోదీనా, లేక ఆదానీనా, కార్మిక ధర్మయుద్ధం సభలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తామని వెల్లడి
Hazarath Reddyకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Telangana MLC K Kavitha) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Hyderabad: ట‌కీలా ప‌బ్‌ దాడి మరవక ముందే.. మరో పబ్‌పై దాడి చేసిన పోలీసులు, బసేరా హోటల్‌లోని పబ్‌లో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, పలువురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyగరంలోని బసేరా హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు (North Zone Task Force Police) సికింద్రాబాద్‌లోని (Secunderabad) బసేరా హోటల్‌లోని పబ్‌పై దాడులు జరిపారు.
Innohub IT Company Fraud: రూ. 2 లక్షలు కడితే సాఫ్ట్‌వేర్ జాబ్, బ్యాక్ డోర్ ఉద్యోగాలు నమ్మి రోడ్డున పడ్డ 800 మంది నిరుద్యోగులు, రూ. 20 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఇన్నోహబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ
Hazarath Reddyహైదరాబాద్ మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఇన్నోహబ్ అనే ఐటీ సంస్థ నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని దుకాణం ఎత్తేసింది. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు (Cheating 800 Employees) రోడ్డున పడ్డారు
Telangana: రేవంత్‌ రెడ్డి నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు, రెడ్డిల ముసుగులో నాపై హత్యాయత్నం, దాడిపై స్పందించిన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి
Hazarath Reddyరెడ్ల సింహ గర్జన సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై (Minister Malla Reddy) ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (PCC Revanth Reddy) హస్తం ఉంది.
Telangana: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ, చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు మంత్రి కాన్వాయ్ పై విసిరిన ఆందోళనకారులు, రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్
Hazarath Reddyతెలంగాణ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు.
Telangana: అద్దె ఇంటి కోసం యువతి రూంలోకి రాగానే తలుపులు వేసిన కామాంధుడు, బ‌ట్ట‌లు విప్పాల‌ని బ‌ల‌వంతం చేస్తూ అత్యాచారయత్నం, హైదరాబాద్‌లో విషాద ఘటన
Hazarath Reddyహైద‌రాబాద్ న‌గ‌రంలో అద్దె ఇంటి పేరుతో ఓ యువ‌తిని త‌న నివాసానికి తీసుకెళ్లి అత్యాచార‌య‌త్నం(girl molested in Hyderabad) చేశాడు ఓ కామాందుడు. ఈ ఘ‌ట‌న మే 19వ తేదీన చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. హైద‌రాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఓ యువ‌తి.. న‌గ‌రంలో నివ‌సించేందుకు అద్దె ఇండ్ల కోసం మే మొద‌టి వారంలో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.
Hyderabad Shocker: షాకింగ్ వీడియో.. అందరూ చూస్తుండగానే.. నడిరోడ్డు మీద ప్రియురాలిని కత్తితో పొడిచిన ప్రియుడు, కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రియురాలిపై మాజీ ప్రియుడు దాడి చేసిన ఘటన (Hyderabad Shocker) శుక్రవారం జరిగింది. హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి (Married Woman Stabbed by Stalker) చేశాడు.
Honour killing in Adilabad: తెలంగాణలో మూడో పరువు హత్య, కులాంతర వివాహం చేసుకుందని కూతురును నడిరోడ్డు మీద కత్తితో పొడిచి చంపిన తండ్రి, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyతెలంగాణలో పరువు హత్యలు (Honour killing) తీవ్ర కలవరం రేపుతున్నాయి. వరుస ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న సరూర్‌నగర్‌, బేగంబజార్‌ ఘటన నుంచి తేరుకోకముందే ఆదిలాబాద్‌లో మరో ఘోరం జరిగింది.
Harish Rao Fire on Modi: మద్దతిచ్చినప్పుడు మంచివాళ్లం, ఇప్పుడెలా అవినీతి పరులమయ్యాం! ప్రధాని మోదీకి హరీష్ కౌంటర్, బీజేపీ మాటలు గురివిందలా ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు, ప్రధాని తన హోదాకు తగ్గట్లు మాట్లాడాలంటూ హితవు
Naresh. VNSప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై (Narendra Modi) తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao)తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ(BJP) నేత‌లే విచ్ఛిన్న‌క‌ర శ‌క్తులు అని మండిప‌డ్డారు. మోదీ సిల్వ‌ర్ జూబ్లీ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి చిల్ల‌ర మాట‌లు మాట్లాడిపోయార‌ని విమ‌ర్శించారు. మోదీ ఆయ‌న‌ స్థాయికి త‌గిన మాట‌లు మాట్లాడ‌లేద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.
Minister KTR Davos Tour: మాస్ట‌ర్‌కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఒప్పందం కుదిరిందని తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ ప్ర‌భుత్వం.. ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ కంపెనీ మాస్ట‌ర్‌కార్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. డిజిట‌ల్ స్టేట్ పార్ట్న‌ర్‌షిప్‌లో భాగంగా ఈ ఒప్పందం జ‌రిగింది. మాస్ట‌ర్‌కార్డ్ వీసీ, అధ్య‌క్షుడు మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మ‌ధ్య ఆ డీల్ కుదిరింది.
Minister KTR Davos Tour: తెలంగాణలో రూ.1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్న హ్యుందాయ్ గ్రూప్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకారం
Hazarath Reddyదావోస్ వేదిక‌గా మంత్రి కేటీఆర్‌తో హ్యుందాయ్ గ్రూప్ తెలంగాణలో రూ. 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో హ్యుందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
Telangana: హైద‌రాబాద్‌లో మ‌రో 37 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టనున్న జీఎంఎం ఫాడుల‌ర్ సంస్థ, ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyజీఎంఎం ఫాడుల‌ర్ సంస్థ హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గ్లాస్ లైన్ ప‌రిక‌రాల త‌యారీకి విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌క‌టించింది. త‌యారీ కేంద్రంపై మ‌రో 37 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్ట‌నుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో స‌మావేశం అనంత‌రం కంపెనీ ఈ ప్ర‌క‌ట‌న చేసింది.
CM KCR on National Politics: కేంద్రంలో మార్పును ఎవరూ ఆపలేరు, రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటారు, దేవేగౌడతో మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyకేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని సీఎం కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండు మూడు నెల‌ల త‌ర్వాత (Sensational news in 2-3 months) సంచ‌ల‌న వార్త వింటార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.
Hindu Ekta Yatra: తెలంగాణలో మసీదులు తవ్వుదాం, శవాలు ఉంటే మీవి, శివలింగాలు ఉంటే మావి, హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
Hazarath Reddyకరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో(Hindu Ekta Yatra) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి (Dig up mosques in Telangana) చూద్దామని శవాలు ఉంటే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు.
CM KCR Bengaluru Tour: మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటన కొనసాగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
PM Modi Hyd Visit: ISB వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆసియాలో టాప్‌ బిజినెస్‌ స్కూల్‌గా ఐఎస్‌బీ ఎదిగిందని కితాబు
Hazarath Reddyప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Minister Talasani) హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగింస్తున్నారు.
PM Modi Hyderabad Visit: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం, పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరు ఉంది, మీ ప్రేమే నా బలం, కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyతెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం..’ అని ప్రసంగాన్ని ప్రారంభించి.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని మోదీ చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా ప్రజల రుణం పెరిగిపోతుందని అనిపిస్తోందన్నారు.
KCR Bengaluru Tour: బెంగళూరుకు సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచిన గులాబీ బాస్, ప్రధాని పర్యటన రోజునే బెంగళూరుకు పయనం, మోదీని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుందనే వెళ్లారని బీజేపీ ఆరోపణ, త్వరలోనే అన్నా హజారేతో కేసీఆర్ భేటీ
Naresh. VNSతెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)గురువారం బెంగళూరు (Bengaluru) వెళ్లనున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ (Devegowda), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో (Kumara swamy) భేటీ కానున్నారు.
Modi Hyderabad Schedule: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, బీజేపీ నేతల్లో కొత్త జోష్, ఏయిర్‌పోర్టు నుంచి ఐఎస్‌బీ వరకు పలుచోట్ల కార్యక్రమాలు, మోదీకి ఆహ్వానం పలికేందుకు ఈసారి కూడా కేసీఆర్ దూరం, మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఇదే!
Naresh. VNSగురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మ‌ధ్య‌హ్నం 1.25 గంట‌ల‌కు బేగంపేట ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamili sai) ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రధానికి స్వాగతం పలకనున్నారు.