తెలంగాణ

RS Praveen Kumar: కొండా మురళిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్..ఎంతోమంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశాడు, దీనికి సాక్ష్యం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు అని వెల్లడి

Arun Charagonda

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ గెస్ట్ హౌజుల్లో కొండా మురళి దారుణాలు చేశాడని ఆరోపించారు. వరంగల్‌లో ఎంతో మంది అమ్మాయిలు, విద్యార్థుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశాడని...2002లో ఆయన ఘోరాలు భరించలేక నళిన్ ప్రభాకర్ అనే పోలీస్ ఆఫీసర్ హన్మకొండ చౌరస్తాలో బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చాడని గుర్తు చేశారు.

CM Revanth Reddy: పాలమూరుకు వస్తున్నా..రైతులతో కలిసి ఆనందం పంచుకోవడానికి, ఓటు అభయ హస్తమై రైతన్నల చరిత్ర తిరగరాసిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు...ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి...ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టామన్నారు.

Vishva Hindu Parishad: ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలి, బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని హైదరాబాద్‌లో మానవహారం

Arun Charagonda

ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలని.. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Burra Venkatesham: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బుర్రా వెంకటేశం, ఫైలుపై సంతకం చేసిన గవర్నర్..డిసెంబర్ 2న బాధ్యతలు చేపట్టనున్న వెంకటేశం

Arun Charagonda

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్ పర్సన్ గా ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం నియామకమయ్యారు. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వీకరించనుండగా ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ గవర్నర్ సంతకం చేశారు.

Advertisement

Medak: మెదక్‌లో ఫన్నీ సంఘటన.. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

మెదక్ జిల్లా నార్సింగిలో ఫన్నీ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ ఇచ్చారు. చుట్టూ పక్కల రెక్కీ నిర్వహించి గేటు తాళం పగలగొట్టగా ఇంతలోనే సడెన్ ఎంట్రీ ఇచ్చారు ఇంటి యజమాని. వేరేవాళ్లు అనుకుని గేటు లోపలికి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేయగా యజమాని సంతోష్ అదే ఇంటికి రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత దొంగ అక్కడి నుండి పారిపోగా సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Telugu Student Dies in US: అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

Rudra

అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు.

Harishrao: రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే కుట్ర..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో షేర్ చేసిన హరీశ్‌ రావు, రైతులను మోసం చేసి రైతు పండుగ నిర్వహిస్తారా అని ఫైర్

Arun Charagonda

సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన వీడియోను షేర్ చేసిన హరీశ్‌....రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అన్నారు.

KTR: జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్..చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం, లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయమన్న కేటీఆర్

Arun Charagonda

లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం.. తెలంగాణ ప్రజల విజయం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం... ఆత్మగౌరవం, అస్తిత్వం, అస్మిత.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లవుతం అన్నారు.

Advertisement

Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Rudra

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.

Cyclone Fengal Live Update: దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రం తుఫాన్ గా బలపడింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Protest in Nagarjuna University: సాంబార్‌ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)

Rudra

నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినులు ధర్నాకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం సాంబార్‌ లో కప్ప వచ్చిందని విద్యార్థినులు భోజనం మానేశారు.

Advertisement

Good News for PSU Employees: తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 5 శాతం ఐఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మధ్యంతర భృతి

Rudra

తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు (పీఎస్ యూ ఉద్యోగులకు) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా ఐఆర్ పెంచుతూ సర్కారు జీవో జారీ చేసింది.

Rashmika Mandanna Video On SHE Teams: నిన్న అల్లు అర్జున్, ఇవాళ ర‌ష్మిక మంద‌నా, సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న పుష్ప టీం, అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

VNS

షీ టీమ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ చేసిన వీడియోను ఆమె పోస్ట్ చేశారు. బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్ప‌టికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్ర‌గ్స్ ర‌హిత తెలంగాణ కోసం అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘

Cold Wave in Telangana: వామ్మో అక్క‌డ ఏకంగా 8 డిగ్రీల‌కు ప‌డిపోయిన టెంప‌రేచ‌ర్, తెలంగాణ‌లో రోజు రోజుకూ త‌గ్గుతున్న ఉష్ణోగ్ర‌త‌లు

VNS

పది రోజులుగా సింగిల్‌ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.

KTR Responds On Lagacherla: ల‌గ‌చ‌ర్ల‌లో ప్ర‌భుత్వం వెనుక‌డుగు త‌ప్ప‌కుండా బీఆర్ఎస్ విజ‌య‌మే! తెలంగాణ దీక్షా దివ‌స్ లో కేటీఆర్ కీల‌క కామెంట్లు

VNS

రియల్ ఎస్టేట్ వ్యాపారికి, పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు. మరొక రూపంలో మీ భూములు కావాలంటూ మళ్లీ వస్తాడు. జాగ్రత్తగా ఉండాలే. ఈ ప్రభుత్వంపై ప్రతిఘటన మాత్రమే మనకు ఉన్న గత్యంతరం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

Telangana Shocker: దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఓ కసాయి భార్య. 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు కీర్తి, జగదీష్. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా జగదీష్ పనిచేస్తున్నారు. అయితే నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకుంది కీర్తి

Telangana: వీడియో ఇదిగో, బూతులతో రెచ్చిపోయి తిట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్, సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ఘటన

Hazarath Reddy

ఆర్టీసీ డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్ బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ రేతిఫిల్ బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది పక్కకు తీయాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసును తిట్టిన మిధాని బస్ డిపో డ్రైవర్.. తానేం తక్కువ కాదన్నట్లు బూతు పురాణం అందుకున్న ట్రాఫిక్ పోలీస్..

Komatireddy: గురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి ఆగ్రహం..నాసిరకం వంటకాలు, భోజనంలో నాణ్యత లేదని అధికారులపై ఫైర్..

Arun Charagonda

గురుకుల సిబ్బందిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం చేశారు.

Thummala Nageswara Rao: రైతు బందు బంద్ చేసే ఆలోచనలో ప్రభుత్వం.. రైతు బంధు స్థానంలో బోనస్...మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు...రైతులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తామని కామెంట్స్

Arun Charagonda

రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు...ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు.. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము అన్నారు.

Advertisement
Advertisement