టెక్నాలజీ
Gautam Adani Richest Indian: హిండెన్ బర్గ్ వివాదం వెంటాడినా తగ్గేదేలే, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ, రెండో స్థానానికి పడిపోయిన ముకేష్ అంబానీ,
Hazarath Reddyబిలియనీర్ గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ వివాదం వెంటాడినా తగ్గేదేలే అని నిరూపించారు అదానీ. తాజాగా వెలువడిన 2024 హురున్ ఇండియా ధనవంతుల జాబితాలో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు
X Down Globally: ట్విట్టర్ డౌన్, సామాజిక మాధ్యమం ఎక్స్ లో సాంకేతిక సమస్య, డౌన్ డిటెక్టర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
VNSప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (X) యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు న్యూస్ ఫీడ్ కనిపించడం లేదు. దీంతో ఎక్స్ డౌన్ (X Down) అయిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Wynk Music App: సంగీత ప్రియులకు షాకివ్వబోతున్న ఎయిర్టెల్, వింక్ మ్యూజిక్ సేవలకు గుడ్ బై.. ఇకపై యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినే అవకాశం
Vikas Mప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాపిల్తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
YouTube Premium Price Hike in India: రూ.129 నుంచి రూ. 149 కి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ధర పెంపు, అన్ని రకాల ధరలను సవరించిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం
Vikas Mప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ (YouTube) భారత్లో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే యూజర్లు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్సైట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
Apple Jobs in India: ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు
Vikas Mగ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు.
Infosys CEO Salil Parekh: ఏఐతో ఉద్యోగాలు పోవు, గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడి
Arun Charagondaఐఏ కారణంగా ఇన్ఫోసిస్లో ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.
Tata Group to Hire 4,000 Women: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్, 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనున్న టాటా గ్రూపు
Hazarath Reddyటాటా గ్రూప్ తమిళనాడు మరియు కర్నాటకలో విడిభాగాల తయారీ మరియు అసెంబ్లీ సౌకర్యాల కోసం ఉత్తరాఖండ్ నుండి 4,000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది
Fact Check: ప్రతి పేద కుటుంబానికీ కేంద్రం రూ.46,715 ఆర్థికసాయం, ఈ లింక్ క్లిక్ చేశారో మీ ఫోన్ హ్యాకయినట్లే, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyదేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ అంటూ వాట్సాప్లో ఓ మెసేజ్ విస్తృతంగా వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది.
ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
Vikas Mయూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.
Telegram CEO Pavel Durov’s Arrest: టెలిగ్రాంలో పిల్లల సెక్స్ వీడియోలు, ప్రాన్స్లో సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్, అక్కడ నిషేధం విధిస్తారా..
Vikas Mటెలిగ్రామ్ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్ఫామ్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
IBM Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఐబిఎం, ఏ దేశంలో ఉద్యోగులు ప్రభావితమవుతారంటే..
Vikas Mబీజింగ్, ఆగస్టు 26: చైనాలో ఐటి హార్డ్వేర్కు డిమాండ్ మందగించడంతో పాటు చైనాలో వృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐబిఎం చైనాలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని, దేశంలో దాదాపు 1,000 మందిని తొలగించాలని యోచిస్తోంది.
Dutch Watchdog Fines Uber: ఉబర్కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
Vikas Mఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన కేసులో హేగ్లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
SEBI Bans Anil Ambani From Market: నిధుల మళ్లింపు ఆరోపణలు, అనిల్ అంబానీపై సెబీ ఐదేళ్ల నిషేధం, రూ.25 కోట్ల జరిమానా
Vikas Mప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్’ (RHFL)లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Jio Issues Cyber Fraud Warning: కస్టమర్లకు జియో సైబర్ వార్నింగ్, ఆ సందేశాలు నమ్మవద్దంటూ అలర్ట్
Vikas Mరిలయన్స్ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.
Cristiano Ronaldo Breaks YouTube Record: గంటకు కోటి, ఇప్పుడు 30 కోట్లు దాటేసిన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు, రికార్డులు బద్దలు కొడుతున్న క్రిస్టియానో రొనాల్డో
Hazarath Reddyకేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్ సబ్స్క్రిప్షన్స్ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్ సబ్స్ర్కైబర్స్ను దాటిన చానెల్ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్ అతడికి ‘గోల్డెన్ బటన్’ను అందించింది.
Zomato Paytm Deal: జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకున్న పేటీఎం, ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన
Vikas Mడిజిటల్ చెల్లింపు సేవల యాప్ పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ జొమాటోతో భారీ డీల్ కుదుర్చుకుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు తన ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం ప్రకటించింది.
TRAI: ఫోన్ నెంబర్లు బ్లాక్ అవుతాయంటూ వచ్చే కాల్స్ నమ్మవద్దు, వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసిన ట్రాయ్
Vikas Mఇటీవల కాలంలో దేశంలో మోసపూరిత, బెదిరింపు ఫోన్ కాల్స్ బెడద ఎక్కువైన నేపథ్యంలో, ట్రాయ్ (Telecom Regulatory Authority of India) స్పందించింది. ఈ తరహా అవాంఛనీయ కాల్స్ పై ట్రాయ్ వినియోగదారులకు సూచనలు చేసింది. TRAI పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Five9 Layoffs: ఆగని లేఆప్స్, 7 శాతం మంది ఉద్యోగులను తీసేసే యోచనలో Five9, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Vikas Mకాల్ & కాంటాక్ట్ సెంటర్ యాజ్ ఎ సర్వీస్ (CCaaS) ప్రొవైడర్ అయిన Five9, దాని పునర్నిర్మాణ ప్రయత్నాలలో భాగంగా తన శ్రామిక శక్తిని 7 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తొలగింపులు దాని కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి చెప్పబడ్డాయి. ఫైవ్9లో ఉద్యోగాల కోతలు కంపెనీలోని అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
Jio New Recharge Plan: జియో నుంచి దిమ్మతిరిగే ప్లాన్, అపరిమిత 5జీ డేటాతో పాటు జియో యాప్ సర్వీసులు ఫ్రీ, రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకోండి
Vikas Mకస్టమర్లను ఆకర్షించేందుకు దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా ఎక్కువ డేటా వాడే వినియోగదారుల కోసం జియో అందిస్తున్న ఓ ఆఫర్ ఆకట్టుకుంటోంది. కొత్తగా రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను ఇటీవలే రిలయన్స్ జియో ప్రకటించింది. 14 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ఆఫర్ కింద అర్హులైన కస్టమర్లు అపరిమిత 5జీ డేటాను పొందొచ్చు.