Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన

బంగ్లాదేశ్‌ లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి.. మరో 35 మందికి తీవ్ర గాయాలు.. బంగ్లాదేశ్‌లో ఘటన
Credits: Twitter

Newdelhi, July 23: బంగ్లాదేశ్‌ (Bangladesh) లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌ పూర్‌ కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు.

Viral Video: నేను అరెస్టు చేస్తే వాళ్లు లంచం తీసుకుని విడుదల చేస్తున్నారు.. పంజాబ్‌లోని జలంధర్‌ జాతీయ రహదారిపై హోంగార్డు నిరసన.. వీడియో వైరల్

ప్రమాద కారణమిదే

ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

(The above story first appeared on LatestLY on Jul 23, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).