ప్రపంచం
Manoj Mukund Naravane: ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?, ఆర్మీ చీఫ్ కాకముందు ఆయన ఏం విధులు నిర్వర్తించారు, సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ఆయన పాత్ర ఏంటీ ? కొత్త ఆర్మీ చీఫ్‌పై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyభారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే మంగళవారం డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ రావత్‌ (General Bipin Rawat)స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ నరవణే బాధ్యతలు(Lieutenant General Manoj Mukund Naravane) స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా(Chief of Army Staff) బాధ్యతలు స్వీకరించిన నరవణే.. 28వ సైన్యాధిపతిగా నిలిచారు.
Fire At PM Modi Residential Area: ప్రధాని నివాసం సమీపంలో మంటలు, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమన్న ప్రధాని కార్యాలయం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ఫైర్ సిబ్బంది
Hazarath Reddyఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) నివాసం సమీపంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. లోక్‌ కళ్యాణ్ మార్గ్‌లోని(7 Lok Kalyan Marg) ప్రధాని నివాసం సమీపంలోని ఎస్పీజీ రిసెప్షన్( SPG reception area) ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది… ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో 9 ఫైరింజన్లు(Nine fire tenders) సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
Happy New Year 2020 Wishes and Messages: ఇది అంతమే కాదు, మరో దశాబ్దానికి ఆరంభం కూడా! ఎలా ఉన్నాయి మీ కొత్త సంవత్సర వేడుకల ఏర్పాట్లు? ఈ 2020 గొప్పగా ఉండాలని చెప్పే నూతన సంవత్సర శుభాకాంక్షలు, Facebook Quotes, Insta Captions and SMS Templates కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaఈ న్యూ ఇయర్ 2020 శుభాకాంక్షలు, ఫోటో సందేశాలు మరియు జీవిత సూక్తులు మీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ లేదా SMS ద్వారా పంపించుకోవచ్చు....
Bipin Rawat: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం, భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్‌గా జనరల్ బిపిన్ రావత్ నియామకం, 65 ఏళ్లు వచ్చేవరకు పదవిలో బిపిన్ రావత్, ఆయన బాధ్యతలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఇండియా మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను(Army chief General Bipin Rawat) కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబ‌ర్ 31,2019న ఆర్మీ చీఫ్‌గా రావ‌త్ రిటైర్‌ కానున్నారు. ఈ నేప‌థ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Anti-CAA Rangoli Row: తమిళనాడులో కొత్త తరహా నిరసన, సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు, తమిళనాడు అగ్ర నేతల ఇంటి ముందు సీఏఏకి వ్యతిరేకమంటూ రంగోలి స్లోగన్స్, కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
Hazarath Reddyసీఏఏ, (CAA)ఎన్ఆర్‌సీలకు(NRC) వ్యతిరేకంగా (Tamil Nadu) తమిళనాడులో కొత్త తరహా నిరసనలు ఊపందుకున్నాయి. మొన్నమహిళలు సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా ముగ్గులు (Rangoli) వేసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా డీఎంకే చీఫ్ స్టాలిన్, ఎంపీ కనిమెళి(DMK MP Kanimozhi) ఇంటి బయట ఈ ముగ్గులు దర్శనమిస్తున్నాయి.
Jharkhand CM Swearing-in Ceremony: జార్ఖండ్ పీఠంపై హేమంత్ సోరెన్, 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ప్రతిపక్షాల ఐక్యతతో దద్దరిల్లిన సభా ప్రాంగణం, హాజరయిన ప్రముఖులు
Hazarath Reddyజార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం (Hemant Soren Takes Oath As Jharkhand CM) చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ద్రౌపది ముర్మా (Governor Draupadi Murmu) ఆయనచే ప్రమాణం చేయించారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్ (Hemant Soren) బాధ్యతలు స్వీకరించారు.
Vishwesha Teertha Swami Passes Away: పెజావర మఠాధిపతి విశ్వేశ్వరతీర్థ ఇక లేరు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఓం శాంతి అంటూ ట్వీట్ చేసిన ప్రధాని, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప
Hazarath Reddyపెజావర మఠం అధిపతి శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామిజీ(88) (Vishwesha Teertha Passes Away) కన్నుమూశారు. ఉడిపి (Udupi)శ్రీకృష్ణ మఠ్‌లో. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరతీర్థ డిసెంబర్‌ 20వ తేదీ నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తిగా విషమించి అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీంతో మఠంలోనే తుది శ్వాస విడవాలన్న ఆయన చివరి కోరిక ప్రకారం లైఫ్‌ సపోర్ట్‌తో స్వామిజీని ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంకు తరలించారు. మఠంలోనే ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
'Go To Pakistan': వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండి, మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్, క్లారిటీ ఇచ్చిన మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్
Hazarath Reddyమీరంతా వెంటనే పాకిస్తాన్ వెళ్లిపోండంటూ (Go To Pakistan)ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ (Meerut SP )అఖిలేష్ నారాయణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు(Anti-CAA Protests) జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Hemant Soren:జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌, ఈ నెల 29న ప్రమాణ స్వీకారం, హాజరవ్వనున్న ప్రముఖులు, బీజేపీని మట్టికరిపించి 47 స్థానాల్లో విజయం సాధించిన జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి
Hazarath Reddyజార్ఖండ్‌ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha)పార్టీ నాయకులు హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) ఈ నెల 29న జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీతో పాటు టిఎంసి నాయకులు హాజరు అవుతారని తృణమూల్‌ సీనియర్‌ నాయకులు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీతో హేమంత్‌ సోరెన్‌తో మంచి సంబంధాలను నెరుపుతామని పేర్కొన్నారు.
Kazakhstan Plane Crash: కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే భవనాన్ని ఢీకొట్టి క్రాష్ అయిన ఎయిర్‌క్రాఫ్ట్, ప్రమాద సమయంలో విమానంలో 100 మంది
Vikas Mandaఅల్మటీ నగరం నుంచి రాజధాని నూర్-సుల్తాన్ వైపు వెళ్తుంది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆ విమానం ఎత్తును కోల్పోయి రెండు అంతస్థులు గల ఒక కాంక్రీట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందని తెలిపారు...
Foreigner Busted: ప్రేమ పేరుతో నాలుగేళ్లుగా మహిళను మోసం చేసి, లక్షల రూపాయలు వసూలు చేసి, పెళ్లికి నిరాకరించిన సౌదీ అరేబియన్ యువకుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Vikas Mandaసలీంపై 406, 417, 420, 506 సెక్షన్ల కింద సలీంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతణ్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్ట్ అతడికి రిమాండ్ విధించింది....
Solar Eclipse 2019: ఆకాశంలో కనువిందు చేస్తున్న సూర్యగ్రహణం, ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం, సురక్షితమైన ఫిల్టర్లను ఉపయోగించే చూడాలంటున్న నిపుణులు, వివిధ ప్రాంతాల్లో సూర్యగ్రహణం చిత్రాలు
Vikas Mandaసూర్యగ్రహణం జరిగే ఘట్టాన్ని "రింగ్ ఆఫ్ ఫైర్" అని కూడా చెప్తారు. చంద్రుడు పూర్తిగా భూమికి మరియు సూర్యుడికి మధ్యలోకి వచ్చినపుడు చంద్రుడు ఉండే భాగం నీడలాగా కనిపించి దాని అంచులు సూర్యకాంతిలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. .....
CH59 Asteroid: ఎఫ్‌-16 యుద్ధ విమానాలను మించిన వేగంతో దూసుకువస్తున్న గ్రహశకలం, భూమికి దగ్గరగా వస్తున్న సీహెచ్59 ఆస్టరాయిడ్, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ గ్ర‌హ‌శ‌క‌లంతో భూమికి ప్రమాదం లేదన్న నాసా
Hazarath Reddyభారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి(Earth) అత్యంత స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. నేడు ఆ గ్ర‌హ‌శ‌క‌లం (asteroid)భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా(2000 CH59)) గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారుగా 2034 అడుగుల వెడ‌ల్పు(2,034-foot asteroid) ఉన్న‌ది.
Anti-CAA Stir: యోగీ ప్రభుత్వం ప్రతీకార నిర్ణయం, 28 మంది ఆందోళన కారులకు నోటీసులు, వారి నుంచి దాదాపు రూ. 15 లక్షలు రికవరీ చేయాలన్న యూపీ సీఎం, 31 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyసిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు (Citizenship Amendment Act) వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల సమయంలో ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని నిరసనకారులనుంచి రికవర్‌ చేయడానికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం (Uttar Pradesh government) సమాయత్తమైంది.
Burkina Faso: క్రిస్మస్ రోజున ఉగ్రవాదుల మారణహోమం, 35 మంది పౌరులు మృతి, 80 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన సైన్యం, గత నాలుగు సంవత్సరాల నుంచి పంజా విసురుతున్న ఉగ్రవాదులు
Hazarath Reddyపండుగ పూట ఉగ్రవాదులు నరమేథాన్ని(Jihadists attacked) సృష్టించారు.ఆత్మాహూతి దాడికి తెగబడ్డారు. క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్న సమయంలో పశ్చిమాఫ్రికాలోని(West Africa) బుర్కినాఫసో (Burkina Faso)అనే దేశంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మంగళవారం రాత్రి జరిపిన దాడుల్లో కనీసం 35మంది పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు రోక్‌ మార్క్‌ క్రిస్టియన్ కబోర్‌ (President Roch Marc Christian Kabore) ప్రకటించారు.
India Post Aircraft: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం, పశ్చిమ బెంగాల్‌‌లో ఘటన, బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు,కోల్‌కతా విమానాశ్రయంలో మూలన పడి ఉన్న డజనుకు పైగా విమానాలు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ( DURGAPUR)ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వైనం మంగళవారం వెలుగు చూసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ (India Post Aircraft) కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.
Delhi Fire At Narela industrial Area: ఢిల్లీని వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలు, షూ ఫ్యాక్టరీలో మరో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు, అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రమాదాలు ఢిల్లీ ప్రజలకు ఉక్కిరిబిక్కిర చేశాయి. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నెల వ్యవధిలో అక్కడ మూడో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో (Delhi's Narela industrial area) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Jharkhand Election Results: చిత్తయిన బీజేపీ, 47 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి, 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, రఘుబర్ దాస్ రాజీనామా, నూతన ముఖ్యమంత్రి కానున్న హేమంత్ సోరెన్
Hazarath Reddyజార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Jharkhand Assembly Elections 2019) బీజేపీకి షాకింగ్‌ ఫలితాలు ఎదురయ్యాయి. జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి (JMM-Congress-RJD) మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించి 47 సీట్లు (ఆధిక్యం+విజయం)సాధించింది. బీజేపీ (BJP)పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం(JVM) 3, ఏజేఎస్‌యూ(AJSU) 2, ఇతరులు స్థానాల్లో గెలుపొందారు.
Tamil Nadu: చిట్టి జంతువులపై స్మగ్లర్ల కన్ను, స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడిన ప్రయాణికుడు, బ్యాంకాక్ నుంచి చెన్నైకు స్మగ్లింగ్, ముద్దొచ్చే ఆ చిట్టి జంతువులను తిరిగి బ్యాంకాక్‌కు పంపించిన ఇంటలిజెంట్ ఆఫీసర్లు
Hazarath Reddyచూడగానే ముద్దొచ్చేలా ఉన్న చిన్న జంతువులను స్మగ్లింగ్ చేస్తూ తమిళనాడులో (Tamil Nadu) ఓ స్మగ్లర్ ఇంటలిజెంట్ ఆఫీసర్లకు దొరికిపోయాడు. బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నైలో దిగిన భారత్ కు చెందిన ఓ ప్రయాణీకుడు ఈ అరుదైన జంతువులను బ్యాగులో పెట్టుకుని చెన్నై ఎయిర్‌పోర్టులో (Chennai airport) కనిపించాడు. అతను ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇంటలిజెన్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు.
Jharkhand Assembly Election Results 2019: ప్రారంభమైన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌, హంగ్ అసెంబ్లీ వస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పైనే అందరి కన్ను, మధ్యాహానికి తొలి ఫలితం వెలువడే అవకాశం
Hazarath Reddyజార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Jharkhand Assembly Election Results) ప్రారంభమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ( Jharkhand) 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌(JMM-Congress) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.