Prabhas: భద్రాచలం ఆలయానికి ప్రభాస్ రూ. 10 లక్షల విరాళం.. ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని పూజలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు.
Hyderabad, May 14: టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నటుడు ప్రభాస్ (Prabhas) భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి (Bhadradri Seetharamachandra Swamy) ఆలయానికి రూ. 10 లక్షల (10 Lakhs) విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
Film actor #Prabhas’s family members handedover a cheque of Rs 10 lakh to the temple executive officer L Rama Devihttps://t.co/YMXa97pbhN
— Telangana Today (@TelanganaToday) May 13, 2023
కాగా, ప్రభాస్ విరాళంగా అందించిన రూ. 10 లక్షల మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 14, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

