తాజా వార్తలు

DK Shivakumar Meets PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ భేటీ, ఏయే అంశాల‌పై చ‌ర్చించారంటే?

VNS

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్‌ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు

Yellow Alert For Telangana: తెలంగాణ‌కు భారీ వర్ష‌ సూచ‌న‌, వ‌చ్చే నాలుగైదు రోజులు కుండ‌పోత వాన‌లు, ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Pawan Kalyan Meets Chandrababu: సీఎం చంద్ర‌బాబుతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ, నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీపై సుధీర్ఘ చ‌ర్చ‌, పంప‌కాల‌పై మూడు పార్టీల మ‌ధ్య ఒప్పందం

VNS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్

Hazarath Reddy

సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది

Advertisement

Wayanad Landslide: వయనాడ్‌ మృత్యుఘోష, 164 మంది శిథిలాల కింద సజీవ సమాధి, ప్రధాని మోదీ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపిన కేంద్ర మంత్రి రాయ్

Hazarath Reddy

వయనాడ్‌ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాల‌య్యారు.

Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషపై అమిత్ షా ప్రకటన, వాస్తవాలు చెప్పాలంటూ మండిపడిన కేరళ సీఎం, ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని వెల్లడి

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా వాయనాడ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల గురించి జూలై 23 లోనే రాష్ట్రాన్ని హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంటులో చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఖండించారు.ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని కేరళ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో అన్నారు

Amit Shah on Wayanad Landslide: విపత్తు గురించి ముందే అలర్ట్ చేసినా కేరళ సీఎం పట్టించుకోలేదు, వయనాడ్‌ మృత్యుఘోషపై పార్లమెంట్‌లో హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన

Hazarath Reddy

వయనాడ్‌ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాల‌య్యారు

Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం విధించిన యూపీఎస్సీ, పుణే సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్రమాల ఆరోపణలు

Hazarath Reddy

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో పూజా ఖేద్కర్ సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పుణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Astrology: వందేళ్ళకు ఒకసారి వచ్చే చతుగ్రాహి యోగం ఆగస్టు 5న. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 ఏళ్లకు ఒకసారి కలిసే చతుర్ గ్రాహియోగం ఆగస్టు 5న ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఈ నాలుగు రాశుల ఒక వారికి సానుకూల ప్రభావం చూపుతుంది.

French President Kiss Controversy: అందరూ చూస్తుండగానే ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి గాఢంగా ముద్దుపెట్టిన మహిళా మంత్రి, పారిస్ వేడుకల్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ వేడుకల్లో ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.

Revanth Reddy Vs Sabitha Indrareddy: కంటతడి పెట్టిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అక్కను నమ్మితే మోసం తప్పదని సీఎం రేవంత్ కామెంట్, తీవ్రంగా ఖండించిన సబితా

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్‌కు కీలక సూచన చేశారు. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.

Astrology: సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశం..ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

సూర్యుడు ఆత్మవిశ్వాసానికి శక్తికి కారణమైన గ్రహంగా చెప్తారు. సమాజంలో గౌరవం సంపదలు పెరగడానికి ఈ సూర్యగ్రహణం సహకరిస్తుంది. అయితే సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం.

Advertisement

Andhra Pradesh: ఏపీ పొలిటికల్ బ్రదర్స్, పవన్ మాట - లోకేష్ బాట, హాట్ టాపిక్‌గా అన్నాదమ్ముళ్ల వ్యవహారం!

Arun Charagonda

తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దేశంలో ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిగతంగా దూషించుకోవడమైనా, ఆ తర్వాత కలిసి పోవడమమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకే చెల్లుతుంది. అయితే కొంతమంది మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. వీరిలో ప్రధానంగా వినిపించే పేరు హైదరాబాద్ బ్రదర్స్. దివంగత పి జనార్ధన్ రెడ్డి(పీజేఆర్), మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ బ్రదర్స్‌గా నిత్యం సమస్యలపై తమ గళాన్ని వినిపించే వారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో వినిపించిన మరో బ్రదర్స్ పేరు దానం నాగేందర్, దివంగత ముఖేష్ గౌడ్.

Telangana Assembly Session: భట్టి విక్రమార్క సీఎం కావాలి, సీఎం రేవంత్‌ రెడ్డికి సన్మానం చేస్తామన్న కేటీఆర్, వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఏడోరోజు ప్రారంభమయ్యాయి. ద్ర‌వ్య వినిమ‌యం బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగట్టారు. ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌రేట్, మహిళలపై అత్యాచారాలు, పెట్టుబడులు,కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీంల కొనసాగింపు వంటిపై మాటల యుద్ధం నెలకొంది.

Hyderabad Rain Update: ఆగస్టు నెలలో హైదరాబాద్ నగరానికి వరదల ముప్పు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన ఐఎండీ

Hazarath Reddy

చురుకైన రుతుపవనాల సీజన్ తర్వాత ఆగస్టులో హైదరాబాద్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయబడింది. ముఖ్యంగా ఆగస్టు చివర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Telangana Shocker:వీడియో ఇదిగో.. హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌పై దాడి, పోలీసులతో పాటు నిందితుడిపై ఎటాక్, పలువురు పోలీసులకు గాయాలు

Arun Charagonda

హైదరాబాద్ హయత్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి పోలీసులపై దాడికి దిగిన మృతురాలి బంధువులు. అలాగే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని చితకబాధారు మృతురాలి బంధువులు. ఈ ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి.

Advertisement

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, అత్త, మామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు, తీవ్ర గాయాలతో అత్త మృతి, ఆస్పత్రిలో మామ..

Hazarath Reddy

దాడిలో అత్త మృతి చెందింది.మావయ్య కు తీవ్ర గాయాలవగా , స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Bihar Shocker: వీడియో ఇదిగో, స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తీసుకువచ్చి 3వ తరగతి విద్యార్థిని కాల్చిన ఐదేళ్ల బాలుడు

Hazarath Reddy

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తీసుకువచ్చాడు.రాగానే మూడవ తరగతి విద్యార్థిపై కాల్పులు (Boy Shoots Student In School) జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్‌ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకున్నారు

Bombay High Court: భార్య చేసే పనిని అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో భర్త చూపించడం శాడిస్ట్ పద్ధతి, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఓ మహిళ ఇంటిని శుభ్రం చేయమని కోరడం,ఆ పని చేస్తూ అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో చూపించడం శాడిస్ట్ పద్ధతి అని బాంబే హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై సెక్షన్ 498-ఎ కింద దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Tamil Nadu Shocker: తమిళనాడులో తీవ్ర విషాదం, జావెలిన్ త్రోయర్ విసిరిన స్టిక్ తలకు గుచ్చుకుని విద్యార్థి మృతి, పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా ఘటన

Hazarath Reddy

తమిళనాడులో జరిగిన దురదృష్టకర ఘటనలో 15 ఏళ్ల బాలుడు తలకు జావెలిన్ స్టిక్ తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. గత వారం కడలూరు జిల్లాలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో 10వ తరగతి విద్యార్థి తలకు జావెలిన్ త్రో స్టిక్ తగిలిన సంఘటన జరిగింది. టి కిషోర్‌గా గుర్తించిన మృతుడు జూలై 30 మంగళవారం తుది శ్వాస విడిచాడు.

Advertisement
Advertisement