India
Telangana: డబ్బులు చెల్లించలేదని గాయానికి కట్టిన కుట్లు విప్పదీసిన ఆస్పత్రి సిబ్బంది, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తానని చెప్పినా వినకుండా దాడి
Hazarath Reddyకామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 చెల్లించాడు.
Weather Forecast: రెండు తెలుగు రాష్ట్రాలకు అలర్ట్, నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyపశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
SC On Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో ఉన్నా నేరమే, మద్రాస్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం
Hazarath Reddyచైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రూపంలో వున్నా నేరమేనని సర్వోన్నత న్యాయస్థానం (SC On Child Pornography) స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, డౌన్ లోడ్ చేసుకున్నా, షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని Supreme Court స్పష్టత నిచ్చింది.
Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ
Hazarath Reddyశ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Tirupati Laddu Controversy: సుప్రీంకోర్టుకు తిరుమల లడ్డూ వివాదం పంచాయితీ, సీబీఐతో విచారణ జరిపించాలంటూ పిటిషన్, హైకోర్టులో పిల్ దాఖలు చేయనున్న వైసీపీ
Hazarath Reddyఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, మార్కాపురంలో మహిళలపై కత్తులతో టీడీపీ కార్యకర్తలు దాడి, వీడియోని షేర్ చేస్తూ ఘాటు విమర్శలు చేసిన వైసీపీ
Hazarath Reddyఏపీలో టీడీపీ కార్యకర్తలు మరోసారి వైసీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ తన ఎక్స్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్ చేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు.
Cracks Appear on Walls of Taj Mahal: మాహాద్భుత కట్టడం తాజ్ మహల్ గోడలకు పగుళ్లు.. పలు చోట్ల దెబ్బతిన్న ఫ్లోరింగ్
Rudraప్రేమకు చిహ్నం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది ఏటా పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని తాజ్ మహల్ లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది.
Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)
Rudraహైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.
Tobacco Packet in Tirumala Laddu Prasadam: వెంకటేశా.. క్షమించు..! తిరుమలలో మరో అపచారం.. శ్రీవారి లడ్డూ మహాప్రసాదంలో పొగాకు పొట్లం.. వీడియో వైరల్
Rudraవరుస వివాదాలతో ప్రపంచ ప్రసిద్ధ తిరుమల ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. పశువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారన్న వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల విషయంలో మరో అపచారం జరిగింది.
Modi Hugs Devi Sri Prasad: ప్రధాని మోదీ సభలో ఊర్రూతలూగించిన దేవిశ్రీ ప్రసాద్.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)
Rudraప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) సందడి చేశారు.
Snake Inside Garib Rath Express: ఏసీ ట్రైన్ కోచ్ లో పాము.. గరీబ్ రథ్ రైలులో ఘటన.. ప్రయాణికుల కేకలు (వీడియో)
Rudraఇప్పటివరకూ జనావాసాల్లోకి వచ్చిన పాములు.. ఇప్పుడు ఏకంగా ట్రైన్ లో ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్నాయి. గరీబ్ రథ్ రైలులో ఇటీవల ఓ పాము ప్రత్యక్షం అయ్యింది.
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు కావడంతో ఫర్నీచర్ ధ్వంసం చేసిన అభిమానులు (వీడియో)
Rudraజూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
US Presidential Election 2024: వచ్చే నవంబర్ లో జరిగే ఎన్నికల్లో నేను గనుక ఓడిపోతే ఇకపై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
Rudraమరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తమ శక్తినంతా ధారపోస్తున్నారు.
Kangana Ranaut Comments on Sonia: హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న నిధులను సోనియాకు పంపుతున్నారు! ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
VNSకాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై (Sonia Gandhi) హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న రుణాలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (Himachal Pradesh Government) దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిధులను సోనియాగాంధీకి పంపుతున్నదంటూ ఆరోపణలు గుప్పించారు
Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం, అభిమానుల తాకిడితో నిర్వాహకులు ఏం చేశారో తెలుసా
VNSపరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు.
Tirumala Shanti Homam : తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, తిరుమల దేవస్థానంలో శాంతిహోమం,
VNSతిరుమలలో సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సలహా మండలి శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతిహోమం, పంచగవ్యప్రోక్షణ చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. తిరుమలలో (Tirumala) ఆగస్టు 15న జరిగిన తప్పునకు యాగం చేశారన్నారు.
Israeli Air Strike On School: గాజాలో స్కూల్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావహంగా దృశ్యాలు
VNSగాజా నగరంలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్ ఖాస్సెమ్ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు.
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేంకటేశ్వర ఆలయానికి పోరాటాసి మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. పోరాటాసి మాసంలో వేంకటేశ్వరుడు భూమిపై వెలిశాడని ప్రతీతి.