Information
Sim Verification: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ, తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా tafcop.dgtelecom.gov.in ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ
Hazarath Reddyఈ పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది (How to know) చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది.
Fuel Price Hike: తగ్గేది లేదంటున్న పెట్రోలు ధరలు, తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంపు, మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి, హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోలు ధర
Hazarath Reddyశంలో ఇంధన ధరల పెంపు అలాగే కొనసాగుతోంది. చమురు కంపెనీలు శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు (Fuel Price Hike) పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది.
AP SSC, Inter Exams Cancelled: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు (AP SSC, Inter Exams Cancelled) చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.
ED Action Under PMLA: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు షాకిచ్చిన ఈడీ, రూ.9,371.17 కోట్ల విలువైన వారి ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ, రూ.18,170.02 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన‌ట్లు తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌
Hazarath Reddyబ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల (Mehul Choksi, Nirav Modi, Vijay Mallya) నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది.
EMI on Debit Cards: డెబిట్‌ కార్డ్ మీద ఈఎంఐ ఎలా తీసుకోవాలి, మీ డెబిట్ కార్డుకు అర్హత ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, డెబిట్ కార్డ్ ఈఎంఐ గురించి ముఖ్యమైన సమాచారం మీకోసం
Hazarath Reddyడెబిట్ కార్డులపై కనిష్టంగా ఈఎంఐ పొందే మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. గరిష్ట లావాదేవీ విలువ ఖాతాదారునికి ముందుగా ఆమోదించిన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది.మీరు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా మీ EMI అర్హతను తనిఖీ చేయడానికి SMS పంపవచ్చు
Telangana: రేపటి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు, అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు అంగీకారం తెలిపిన కేసీఆర్ సర్కారు, కర్ఫ్యూ నిబంధనలకు అనుగుణంగా నడవనున్న ఆర్టీసీ బస్సులు, బెంగుళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు టీఎస్‌‌ఆర్టీసీ బస్‌ సర్వీసులు
Hazarath Reddyతెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేయడంతో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులకు (Inter-State Transmission) ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ (Lockdown in Telangana) నేటి నుంచి ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి.
IRCTC-iPay: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్, యూజర్ ఇంటర్ ఫేస్ అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ, IRCTC-ipay ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Hazarath Reddyరైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్తను అందించింది. ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
CIBIL Score Check on Paytm App: ఇప్పుడు మీ CIBIL స్కోరు నిమిషంలో తెలుసుకోవచ్చు, పేటీఎం నుంచి కొత్త ఫీచర్, క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyపేటియం తెచ్చిన సదుపాయంతో క్రియాశీల క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును.
'Can't Pay Rs 4 Lakhs Ex Gratia': కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు చెల్లించలేం, ఒక వేళ అలా చెల్లిస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుంది, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyకరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించలేమని (Can't pay Rs 4 lakhs ex gratia) కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్టపరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని ఓ అఫిడవిట్ ద్వారా తెలిపింది.
Telangana Lockdown Ends: ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Hazarath Reddyతెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన (Telangana Lockdown Lifted) నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి (Telangana) రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.
Indian Railways: రేపటి నుంచి మరిన్ని ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపిన రైల్వేశాఖ, విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లు మరికొంత కాలం పొడిగింపు, పూర్తి సమాచారం ఇదే..
Hazarath Reddyకరోనావైరస్ సెకండ్‌ వేవ్‌ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ (Indian Railways) ప్రకటించింది. ఈ మేరకు ట్రైన్ల జాబితాను చైన్నైలోని సదరన్‌ రైల్వే (Indian Railways to restore some cancelled spl trains) ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి భద్రతా నియమాలు పాటించాలని ప్రయాణికులను కోరింది.
Andhra Pradesh Job Calendar 2021-22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసిన సీఎం జగన్, ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడి
Vikas Mandaప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. 2021, జూలై నుంచి ఉద్యోగ నిమామకాలు చేపట్టనున్నట్లు అందులో సూచించారు....
Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం
Team Latestlyటెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...
APPSC Group-I Services Interview 2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు, హైకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూలు వాయిదా
Hazarath Reddyగ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.
HDFC Bank Mobile App:హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ క్రాష్, సమస్యను పరిష్కరించామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ
Hazarath Reddyహెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ గంట పాటు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. ఎట్టకేలకు సమస్యను పరిషర్కించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి యథావిధిగా మొబైల్ యాప్ సేవలు పనిచేస్తాయని ఆయన అన్నారు.
Boycott Chinese Products: చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం
Hazarath Reddyసరిహద్దులో చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి విదితమే. లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ (Galwan valley escalation) తర్వాత ఈ వాతావరణం మరింతగా వేడెక్కింది. అయితే ఈ ప్రభావం ఇండియాలోని చైనా వ్యాపారాలపై పడింది
Degree Courses in English Medium: ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యామండలి సూచన
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో (Degree Courses in English Medium) మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి (English-medium education) మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
Monsoon 2021 Forecast: ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, దేశ భూభాగంలో 80 శాతం కవర్ చేసిన నైరుతి రుతుపవనాలు, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగుల పడే అవకాశముందని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyజూన్ 3 న ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు వేగవంతమైన పురోగతిని కొనసాగిస్తూ 10 రోజుల్లో దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 80 శాతానికి చేరుకున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు (Southwest monsoon) ఎక్కువగా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) (Indian Meteorological Department)ఆదివారం తెలిపింది.
Monsoon 2021 Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, హెచ్చరించిన వాతావరణశాఖ అధికారులు
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.