సమాచారం

Degree Courses in English Medium: ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యామండలి సూచన

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో (Degree Courses in English Medium) మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి (English-medium education) మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.

Monsoon 2021 Forecast: ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు, దేశ భూభాగంలో 80 శాతం కవర్ చేసిన నైరుతి రుతుపవనాలు, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగుల పడే అవకాశముందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

జూన్ 3 న ప్రారంభమైన నైరుతి రుతుపవనాలు వేగవంతమైన పురోగతిని కొనసాగిస్తూ 10 రోజుల్లో దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 80 శాతానికి చేరుకున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు (Southwest monsoon) ఎక్కువగా ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) (Indian Meteorological Department)ఆదివారం తెలిపింది.

Monsoon 2021 Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, హెచ్చరించిన వాతావరణశాఖ అధికారులు

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Mumbai Rains: రుతపవనాలు రాకతో ముంబైలో భారీ వర్షాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన పలు రైల్వే ట్రాక్‌లు, మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన

Hazarath Reddy

దేశ ఆర్థిక రాజధాని ముంబైని రుతుపవనాలు తాకాయి. ఈరోజు ఉద‌యం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఫ‌లితంగా ప‌లు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Advertisement

weather in Telugu States: మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు, ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం, వివరాలను వెల్లడించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

రాగల రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు (southwest monsoon) పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP SSC & Inter Exams Update: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు కరోనా తగ్గిన తర్వాతే..మీడియాతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు (AP SSC& Inter Exams Update) నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన ( Education Minister Adimulapu Suresh) మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

National COVID Vaccination Program: జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు వ్యాక్సిన్ల‌ పంపిణీ, వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌, టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్

Hazarath Reddy

రాష్ట్రాల‌కు కేంద్రం అందించే ఉచిత క‌రోనా వ్యాక్సిన్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను (Revised COVID-19 Vaccination Policy Guidelines Issued by Centre) ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. వీటి ప్ర‌కారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు జ‌నాభా, కేసుల సంఖ్య‌, వ్యాక్సినేష‌న్ పురోగ‌తి ఆధారంగా వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేయ‌నున్నారు.ఈ మేరకు జాతీయ వ్యాక్సినేషన్‌ విధానంపై (National COVID Vaccination Program) మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

New Income Tax E-Filing Portal: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త, కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించిన ఆదాయపు పన్నుశాఖ, మొబైల్‌ యాప్‌ కూడా విడుదల, కొత్త ఫీచర్లు గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఆదాయపు పన్ను శాఖ ప్రజలు మరింత సులభంగా పన్నుల చెల్లించే విధంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను (www.incometax.gov.in) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్‌ రూపొందించినట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది.

Advertisement

PF withdrawal: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు తీసుకునే వెసులుబాటు, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. భవిష్యత్ నిధి అనేది ఇప్పుడు ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది చెప్పుకోవాలి. అయితే కోవిడ్ కల్లోలంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారికి పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వెసులుబాటును కంపెనీ ఈపీఎప్ సంస్థ కల్పించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Tamil Nadu 12th Board Exams 2021: 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు, కరోనా వ్యాప్తి వేళ కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కారు, కమిటీ ఇచ్చిన స్కోర్‌ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడి

Hazarath Reddy

తమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు (TN government cancels 12th class board exams) చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం (Tamil Nadu 12th Board Exams 2021) తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు.

Indian Railways: రైల్వే తీపి కబురు, ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 24 రైళ్లకు గ్రీన్ సిగ్నల్, రైళ్లు నడిచే సమయంతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు, రైళ్ల పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ దేశంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రైల్వేల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రాజధాని, దురంతో, శతాబ్ది తదితర సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు చాలా ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి.

Fuel Price Hike: బాదుడే బాదుడు..సెంచరీ కొట్టిన పెట్రోల్‌ ధర, వందకు చేరువలో డీజిల్ ధర, ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటి పరుగులు పెడుతున్న ఇంధన ధరలను (Petrol and diesel rates)వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి.

Advertisement

New Rule for PF Account Holders: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్ న్యూస్, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్‌తో లింక్ చేయండి, చేయకుంటే యజమాని వాటా ఇక పొందలేరు, జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్, ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా..

Hazarath Reddy

కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాను (PF Account) ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయలేని పక్షంలో పీఎఫ్ లో జమ చేసే మొత్తంపై ప్రభావం పడనుంది. కాగా ఉద్యోగుల ఖాతాలను (PF account holders) ఆధార్ లింకు చేసే బాధ్యతను ఈపీఎఫ్ఓ, ​​యజమానులకు అప్పగించింది.

Monsoon: ఎండల నుంచి ఇక ఉపశమనం, జూన్ 3న కేరళను తాకనున్న రుతుపవనాలు, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతు పవనాలు

Hazarath Reddy

ఎండల నుంచి ఉపశమనం కలిగించే వార్తను ఎఐండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా వచ్చేస్తున్నాయి. జూన్‌ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు (Monsoon likely to hit Kerala by June 3) వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి.

Weather in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం, ఈ సారి ముందే పలకరించిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి కారణంగా జూన్‌ రెండో తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం‌లోని పలు‌జి‌ల్లాల్లో వర్షాలు (More rain forecast in Telangana) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

New Domestic Airfare: విమాన ప్రయాణికులకు షాక్, ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు, 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600, పెరిగిన ధరల లిస్ట్ ఇదే..

Hazarath Reddy

విమాన ప్రయాణం చేసే వారికి షాకింగ్ న్యూస్..దేశీయ విమాన ప్ర‌యాణ ఛార్జీల‌ను (Domestic Flights Cost) పెంచేశారు. పౌర‌విమాన‌యాన శాఖ ఈ మేరకు శుక్ర‌వారం కొత్త ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు (New Domestic Airfare) చేస్తున్నాయి.

Advertisement

Southwest Mansoon 2021: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. మే 31న కేరళను తాకే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ; బలహీనపడిన యాస్ తుఫాను

Team Latestly

శనివారం, ఆదివారం, సోమవారాల్లో తెలంగాణలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది....

Cyclone Yaas: తీరాన్ని తాకిన యాస్ తుఫాన్, ధామ్రా ఓడరేవు సమీప తీరంలో గంట పాటు కొనసాగనున్న ప్రక్రియ, తీరప్రాంతంలోని జిల్లాల్లో 140 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను యాస్‌ (Cyclone Yaas) బుధవారం ఉదయం ఒడిశాలో తీరాన్ని తాకింది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధామ్రా ఓడరేవు సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని వాతావరణ విభాగం(IMD) వెల్లడించింది. తుపాను పరిమాణం భారీగా ఉండటంతో.. తీరాన్ని దాటే ప్రక్రియ ముగియడానికి కొన్ని గంటలు పట్టనుందని తెలిపింది.

Cyclone Yaas: మరి కొద్ది గంటలే..బాలాసోర్‌ దగ్గర తీరం దాటనున్న యాస్ తుఫాన్, తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఏపీ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక

Hazarath Reddy

మూడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్‌ తుఫాను (Cyclone Yaas) తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్‌కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్‌లోని ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త ఉమాశంకర్‌ దాస్‌ పేర్కొన్నారు.

Cyclone Yaas Update: దూసుకొస్తున్న యాస్ తుఫాన్, అల్లకల్లోలంగా బంగాళాఖాతం తీర ప్రాంతాలు, రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసిన ఐఎండీ

Hazarath Reddy

యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. రాబోయే 12 గంటల్లో యాస్‌ తుఫాను అతి తీవ్ర తుఫానుగా (Cyclone Yaas Update) మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయువ్య దిశగా కదిలిందని (Cyclone Yaas Movement) పేర్కొంది.

Advertisement
Advertisement