Information
Jagananna Vidya Devena: జగనన్న విద్యా దీవెనకు అర్హతలు ఏంటీ?, కుటుంబ వార్షికాదాయం ఎంత ఉండాలి?, పొలం ఎంత ఉండాలి? పూర్తి వివరాలను తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో 2019 - 20 (AP Assembly-2019) సంవత్సరానికి బడ్జెట్‌(AP Budget-2019)ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ విదితమే. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) రూ.2.27లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సంక్షేమానికి పెద్దపీట వేశారు.
Tiger of Mysore: మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు?, తెల్లవారిని హడలెత్తించిన టిప్పు సుల్తాన్ జయంతి నేడు, ఆ దేశభక్తుడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..
Hazarath Reddyభారతదేశంలో రాచరికపు పాలనకు చరమగీతం పాడినవారు టిప్పు సుల్తాన్ (Tipu Sultan). ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary)ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.
One Nation-One Pay Day: ఇక జీతాల ఆలస్యం జరగదు, దేశమంతటా ఉద్యోగస్తులందరికీ ఒకే రోజు జీతాలు చెల్లించేలా 'ఒకే దేశం- ఒకే రోజున వేతనం' పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కార్
Vikas Mandaదేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డ్ విధానాన్ని కూడా అమలు చేసే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా గల 23 కోట్ల మంది రేషన్ కార్డు దారులందరికీ లబ్ది చేకూరేలా జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా....
Dadas of Hyderabad: వర్మ మరో బాంబు, హైదరాబాద్ దాదాగిరిపై తదుపరి సినిమా,హీరోగా జార్జిరెడ్డి ఫేం సందీప్ మాధవ్, హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా
Hazarath Reddyసంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (Kamma Raajyam lo Kadapa Redlu) విడుదలకు సిద్ధమవుతుండ గానే ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. జార్జిరెడ్డి (George Reddy)సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
Mobile Tariff Hike: వినియోగదారులకు షాకిచ్చిన టెల్కోలు, డిసెంబర్ 1 నుంచి మొబైల్ టారిఫ్ రేట్లు పెంపు, ఇప్పటికే కాల్ రేట్లు వసూలు చేస్తున్న రిలయన్స్ జియో
Hazarath Reddyటెలికామ్ వినియోగదారులకు వోడాఫోన్-ఐడియా (Vodafone-Idea), ఎయిర్‌టెల్ (Airtel) సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 1 నుండి మొబైల్ సేవా రేట్లను పెంచనున్నామని (Mobile call, data to cost more) ఈ రెండు సంస్థలు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఈ టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీసు రేట్లను డిసెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం
Hazarath Reddyచంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.
Health Benefits of Banana Peels: అరటి తొక్కే కదా అని తీసిపారేయకండి,దానిలోని ఆరోగ్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, మలబద్దకాన్ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది
Hazarath Reddyమనలో చాలామందికి అరటిపండు అంటే చాలా ఇష్టం. అన్నం తిన్న తరువాత అరటిపండు తినడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకే పెళిల్లలో చాలా చోట్ల అరటిపండు(Banana)ను పెడుతుంటారు. అయితే చాలామంది అరటిపండును తిని దాని తొక్క(Banana Peels)ను పారేస్తుంటారు.
IRCTC Meals Price Hike: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్, ఇకపై ఇంటినుంచి భోజనం పట్టుకెళ్లండి, క్యాటరింగ్ ధరలను పెంచేసింది, ధరల ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyరైల్వే ప్రయాణికులు ఇండియన్ రైల్వే (Indian Railways)బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఇంటి నుంచి సొంత పుడ్ తీసుకువెళ్లడం మంచిది. ఎందుకంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ధరలను‘(IRCTC Meals Price Hike) పెంచింది.
Aadhaar Card: కేవైసీ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం, వలసదారులకు ఊరట, ఇకపై వలసదారులు ఎక్కడినుంచైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు
Hazarath Reddyమీరు వలసదారులా.. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా..అయితే మీకోసం ప్రభుత్వం శుభవార్తను తీసుకువచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో చోటకు మారిన వారు బ్యాంకు ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడకుండా కేవైసీ నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. వలసదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాంతోనే ఖాతాను తెరిచే విధంగా వెలుసుబాటు కల్పించింది.
Abdul Jabbar Passes Away: భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత, తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు, ఆయన వైద్య ఖర్చులను భరిస్తామన్న కాంగ్రెస్, అంతలోనే విషాదం
Hazarath Reddyభోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ కిరణం నేలరాలింది. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ అనారోగ్యం(Abdul Jabbar passes away)తో మరణించారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
Earthquake In Nicobar Islands: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన భూకంప తీవ్రత, భయాందోళనకు గురయిన ప్రజలు
Hazarath Reddyబంగాళాఖాతానికి దక్షిణాన హిందూ మహసముద్రంలో ఉన్న నికోబార్ దీవుల్లో శుక్రవారం భూప్రకంపనలు (major earthquake) సంభవించాయి. నికోబార్ దీవుల్లో(Nicobar Islands region) గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు( India Meteorological Department) చెప్పారు.
Garlic Price @250: 250 రూపాయలను టచ్ చేసిన వెల్లుల్లి, ఉల్లి ధరలు ఇంకా ఘాటుగానే..మహారాష్ట్ర నుంచి దిగుమతులు బంద్, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలంటూ రైతుల ధర్నా
Hazarath Reddyగత కొద్ది రోజుల నుంచి ఉల్లి అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. తాజాగా దీని సరసన ఇప్పుడు వెల్లుల్లి కూడా చేరింది. ఆంధ్రప్రదేశ్ లో వెల్లుల్లి ధర 250 రూపాలయకు చేరినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉల్లి, వెల్లుల్లి దిగుబడి తగ్గిపోవటంతో ధరలు భారీగా పెరిగాయి. గత కొంత కాలం నుంచి మహారాష్ట్రలో తరచూ భారీ వర్షాలు కురవటం..వరదలు వెల్లువెత్తటంతో పంటలు నాశనమయ్యాయి.
Rafale Case Verdict: రాఫేల్ కేసులో కేంద్రానికి క్లీన్ చిట్, సమీక్ష పిటిషన్లన్నింటిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఎలాంటి అక్రమాలు జరగలేదన్న దేశ అత్యున్నత న్యాయస్థానం, రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
Hazarath Reddyగత కొంత కాలం నుంచి దేశ రాజకీయాల్లో మారు మోగుతున్న రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసు(Rafale Deal Case)లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) కీలక తీర్పును వెలువరించింది. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై దాఖలైన సమీక్ష పిటిషన్లన్నింటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Sabarimala Veridct: నిఘా నీడలో శబరిమల, తీర్పు నేపథ్యంలో 10 వేలమంది పోలీసులతో పహారా, అయిదు దశల్లో పోలీసు బలగాల తరలింపు, 16న తెరుచుకోనున్న ఆలయ తలుపులు
Hazarath Reddyకేరళలోని ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల(Sabarimala)లోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు (Sabarimala Veridct)పై అయ్యప్ప భక్తులు, హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Rafale,Chowkidar Chor Hai Verdicts: రాఫెల్‌ రివ్యూ పిటిషన్‌పై రేపు కీలక తీర్పు, చౌకీదార్ చోర్ హై పిటిషన్ పై కూడా తీర్పు వచ్చే అవకాశం, ఇప్పటికే దీనిపై సారీ చెప్పిన రాహుల్ గాంధీ
Hazarath Reddyభారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi )సారథ్యంలోని సుప్రీంకోర్టు (Supreme Court )ధర్మాసనం వచ్చే వారంలో 3 రోజుల్లో 3 కీలకమైన తీర్పులు ఇవ్వనుంది. రేపు రాఫెల్ రివ్యూ పిటిషన్ల(Rafale review petitions)కు సంబంధించి తీర్పును వెలువరించనుంది.
SC's Vital Verdicts Today: ఈ రోజు మరో రెండు చారిత్రాత్మక తీర్పులు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ వస్తుందా..రాదా అనే దానిపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు, కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత కేసుపై కూడా కీలక తీర్పు
Hazarath Reddyఅయోధ్య భూవివాదం కేసులో గత శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం మరో రెండు కీలక అంశంలో తీర్పునివ్వడానికి సిద్ధమైంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.
Hawala Racket: దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కేంద్రంగా హవాలా స్కామ్, ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా హవాలా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది.
Mysterious Death Of Migratory Birds: వలస పక్షుల మృత్యు ఘోష, సాంబార్ సరస్సులో 5 వేల పక్షులు మృతి, చెల్లా చెదురుగా పక్షుల కళేబరాలు, పర్యావరణానికి ప్రమాదం తప్పదా ?
Hazarath Reddyఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో పక్షుల మృత్యు ఘోష వినిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఉప్పు నీటి సరస్సు అయిన సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. ఇది దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సుకు వేలాది వలస పక్షులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి.
Pranav Wins CM Pinarayi Heart: చేతులు లేవు..కాలుతో సెల్పీ, ఫిదా అయిన సీఎం పినరయి విజయన్, సోమరిపోతులకు ప్రణవ్ కథే ఓ గుణపాఠం, సీఎం రిలీఫ్ ఫండ్‌కి సాయమందించిన ఆర్టిస్ట్ ప్రణవ్
Hazarath Reddyపట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ స్టోరీనే నిదర్శనం, శరీరంలో అన్నీఅవయువాలు సక్రమంగా ఉండి సోమరిపోతుల్లా తిరుగుతున్న యువకులకు ఈ కథనే ఓ గుణపాఠం. పుట్టుకతోనే చేతులు కోల్పోయిన యువకుడు చూపించిన ఆత్మస్థయిర్యానికి కేరళ సీఎం (Kerala CM Pinarayi Vijayan) సైతం ఫిదా అయ్యారు.