Information
Cyclone Kyarr In South India: సౌత్ ఇండియాకు క్యార్ తుఫాన్ ముప్పు, రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు, సూపర్‌ సైక్లోనిక్‌ తుఫాను మారుతున్న క్యార్, జాలర్లు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
Hazarath Reddyఅరేబియన్‌ సముద్రంలో ఏర్పడిన 'క్యార్‌' తుఫాను ప్రభావంతో సౌత్ ఇండియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Discount Sales Ban: బ్యాన్ దిశగా డిస్కౌంట్ సేల్స్, ఈ కామర్స్ దిగ్గజాల వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం కన్ను, ఫిర్యాదు చేసిన సీఏఐటీ, డిస్కౌంట్‌ దందాపై దర్యాప్తు చేపడతామన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌
Hazarath Reddyఈ కామర్స్ దిగ్గజాలు పండుగ సమయాల్లో ప్రకటిస్తున్న డిస్కౌంట్ దందాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మొత్తం ఏడాది వ్యాపారంలో సగం పండగ సీజన్‌లోనే జరుగుతుందనే అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వరుస ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
IS Chief AL Baghdadi Death: అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాది హతమైనట్లు వార్తలు, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం దాడులు , డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా ? ఇంకా ధృవీకరించని ఫోరెన్సిక్ టెస్ట్
Hazarath Reddyఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.
Kamal Sharma Passed Away: గుండెపోటుతో పంజాబ్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు కమల్‌ శర్మ కన్నుమూత, విషాదంలో పంజాబ్ బీజేపీ శ్రేణులు, మరణించడానికి రెండు గంటల ముందు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన శర్మ
Hazarath Reddyదీపావళి పండుగ వేళ పంజాబ్‌ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ బిజెపి మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కమల్ శర్మ (48) కన్నుమూశారు. ఫెరొజెపూర్ జిల్లాలో గుండెపోటుతో ఆదివారం ఉదయం కమల్ శర్మ మరణించారు.
Indian Soldiers Diwali Celebrations: బార్డర్లో భారత సైనికుల దివాళీ వేడుకలు, దీపాల వెలుగులతో వెలుగులు విరజిమ్మిన ఇండియా బార్డర్, శుభాకాంక్షలు తెలిపిన చైనా ఆర్మీ, ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపిన మోడీ
Hazarath Reddy2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ ఏడాది దీపావళిని సియాచిన్‌ఇండియా బార్డర్ దీపాల వెలుగులతో విరజిమ్మింది. ఇండియన్ ఆర్మీ దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు.
Indian Army Diwali Celebrations: బార్డర్‌లో ఘనంగా ఆర్మీ జవాన్ల దీపావళి వేడుకలు, భారత ఆర్మీకి దివాళీ శుభాకాంక్షలు తెలిపిన చైనా ఆర్మీ, జవాన్లకు దివాళీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ
Hazarath Reddyఇండియా బార్డర్ దీపాల వెలుగులతో విరజిమ్మింది. ఇండియన్ ఆర్మీ దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి కూడా సరిహద్దుల్లోని భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోనున్నారు.
Cyclone Kyarr Alert: హడలెత్తిస్తున్న క్యార్ సైక్లోన్, సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం, 17 మంది జాలర్లను రక్షించిన ఇండియన్ నేవీ, కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Hazarath Reddyక్యార్ తుపాన్ గత రెండు రోజుల నుంచి నార్త్ ఇండియాను హడలెత్తిస్తోంది. ఈ తుఫాన్‌ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సైక్లోన్ ధాటికి కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు పడుతాయని వెల్లడిస్తున్నారు.
Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం
Hazarath Reddyఅయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
Maha Govt Formation: శివసేన చేతిలో బీజేపీ చిక్కుకుందా? కోరికల చిట్టాపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ ఒత్తిడి, ముఖ్యమంత్రి పదవి,మంత్రి పదవుల్లో సమాన వాటా, అమిత్ షా నేరవేర్చాల్సిందేనన్న శివసేన
Hazarath Reddyమరాఠా రాజకీయం హీటెక్కుతోంది. అధికార బీజేపీ గత ఎన్నికల కన్నా తక్కువ స్థానాలు గెలుచుకోవడం, శివసేన తన స్థానాలు నిలుపుకోవడం జరిగిన తరుణంలో ఇప్పుడు సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది.
Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం
Hazarath Reddyదీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.
D.K.Shivakumar Kabali look: నేను వచ్చేశా, కబాలి లుక్‌తో అదరగొడుతున్న కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌, 50 రోజుల తర్వాత సొంతగడ్డ మీదకు, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్, తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌
Hazarath Reddyమనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ తీహార్ జైలు నుంచి కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద శివకుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
AP Village Volunteer 2nd Notification: ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్, మొత్తం 9 వేల 674 పోస్టులు, నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియ, డిసెంబర్ 01 నుంచి విధుల్లోకి
Hazarath Reddyఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు
Hazarath Reddyతూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Save Sujith Wilson: అధికారుల నిర్లక్ష్యానికి చావు బతుకుల్లో రెండేళ్ల బాలుడు, ఆడుకుంటూ 25 అడుగుల బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్‌, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఓ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో సుజిత్ విల్సన్‌ బోరు బావిలో పడిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Reliance Jio New Strategy: అప్పులు లేని కంపెనీగా జియో, డిజిటల్ సేవల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు, ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి,సరికొత్త వ్యూహంతో ముకేష్అంబానీ
Hazarath Reddyచమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది.
POK Controlled By Terrorists: ఉగ్రవాదుల నియంత్రణలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌, ఆర్టికల్‌ 370 కూడా తాత్కాలికమే, ఆపిల్‌ వ్యాపారులపై కాల్పులు జరిపింది ఉగ్రవాదులే, కాశ్మీర్‌లో శాంతి జెండాను ఎగరవేస్తాం, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నీడలో ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mobikwik Gold Offer: మొబిక్విక్ మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్, 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ మార్చుకుంటే ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ ఉచితం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆఫర్ వర్తింపు, పరిమిత కాలం మాత్రమే
Hazarath Reddyదీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ యూజర్ల కోసం మెగా ఎక్స్చేంజ్ వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేసే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Bypoll Winners 2019: ఉపఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల వీరే, మొత్తం 51అసెంబ్లీ, 2 లోక్‌సభ నియోజక వర్గాలకు బైపోలింగ్, యూపీలో బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం, తెలంగాణాలో సత్తాచాటిన టీఆర్ఎస్
Hazarath Reddyఅక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానాలతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ నియోజక వర్గాలకు అలాగే 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. కాగా ఈ రోజు వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి.
Haryana Election results 2019: కీలకంగా మారనున్న స్వతంత్రులు, సీఎం సీటు రేసులో దుష్యంత్ చౌహాలా, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి సై అంటున్న కాంగ్రెస్
Hazarath Reddyహర్యానాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు సరికొత్త మలుపుతో సాగుతున్నాయి. హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది.
Maha Election Results 2019: మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు, సీఎం సీటు కోసం డిమాండ్ చేస్తున్న శివసేన, ప్రతిపక్ష పాత్ర పోషించనున్న యూపీఎ కూటమి, ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి
Hazarath Reddyమహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.