News
Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్ఆర్ఎస్, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్లైన్లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్చేసుకోండి
Arun Charagondaలేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్ఆర్ఎస్పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్లైన్స్ సిద్ధం చేసింది.
Ola Launches Roadster Electric: ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ చూశారా? రూ.75000 నుంచే ప్రారంభం, 8 ఏళ్ల వారెంటీతో అందిస్తున్న కంపెనీ, ఎప్పటి నుంచి డెలివరీ ప్రారంభం అంటే..
VNSభారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మూడు ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను (Ola Launches Roadster Electric) లాంచ్ చేసింది. ఓలా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ (Roadster Electric) శ్రేణిలో రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్, రోడ్స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్స్టర్ ఎక్స్ ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
Saarthi AI Layoffs: ఆగని లేఆప్స్, భారీగా తొలగింపులను చేపట్టిన సారథి AI గ్రూపు, సీఈఓ పాస్ పోర్టును దొంగిలించిన మాజీ ఉద్యోగి
Vikas Mతొలగింపుల వల్ల ప్రభావితమైన ఒక ఉద్యోగి US వీసాతో తన పాస్పోర్ట్ను దొంగిలించినప్పుడు సారథి AI CEO విశ్వ నాథ్ ఝా సమస్యాత్మక పరిస్థితిని ఎదుర్కొన్నారు.US వీసా కలిగి ఉన్న తన పాస్పోర్ట్ దొంగిలించబడిందని సారథి AI CEO పేర్కొన్నాడు, తద్వారా అతను ఇతర గమ్యస్థానాలకు విమానంలో ప్రయాణించడం అసాధ్యంగా మారింది.
Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్
Hazarath Reddyఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి
Hyderabad Rains: హైదరాబాద్లో కుండపోత వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, మరో 5 రోజులు వర్షాలు, విపత్తు సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచన
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్పేట్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్స్టాప్గా కురుస్తోంది. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు...విపత్తు సంభవిస్తే టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు.
Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ఇదిగో, మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు
Hazarath Reddyమొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది.
Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు
Hazarath Reddyదేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
Nagpur Shocker: ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో ఇదిగో, సరదాపడి చేసిన స్టంట్తో యువకుడు మృతి, డ్యాంలో మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
Hazarath Reddyమహారాష్ట్రలో యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్ద రిస్కీ స్టంట్స్ చేసి ప్రాణాలే కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం
Arun Charagondaసిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .
Assembly Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు
Bandi Sanjay On BRS: కాంగ్రెస్లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్
Arun Charagondaకేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్ది అన్నారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో
Arun Charagondaటీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత
CM Revanth Reddy On BRS: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్కు ఏ పదవో తెలుసా?
Arun Charagondaబీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, బెడ్ రూంలో కానిస్టేబుల్తో శృంగారంలో మునిగిపోయిన భార్య, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త
Hazarath Reddyఉత్తరప్రదేశ్లో షాకింగ్ సంఘటనలో తన భార్య కానిస్టేబుల్తో రూంలో అసభ్యకర స్థితిలో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసు కానిస్టేబుల్తో తన భార్య బెడ్ మీద శృంగారంలో ఉండగా భర్త పట్టుకుని ఇద్దరినీ పట్టుకుని చితకబాదాడు.
IMD Weather Forecast: 25 రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, గత మూడు నెలల్లో వరదలకు 600కు పైగా మృతి
Hazarath Reddyదేశ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి.
CM Revanth Reddy Meets Foxconn Chairman: మీ విజన్ అద్భుతం..సీఎం రేవంత్రెడ్డికి ఫాక్స్ కాన్ సీఈవో కితాబు, త్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తా, పెట్టుబడులు పెడుతానని వెల్లడించిన యంగ్ లియూ
Arun Charagondaత్వరలోనే హైదరాబాద్ను సందర్శిస్తానని చెప్పారు ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి- లియూ మధ్య జరిగిన భేటీలో హైదరాబాద్లో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ, సర్వీస్ రంగాల్లో విస్తరించే సత్తా గల నగరం హైదరాబాద్ అని కొనియాడారు. ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం అని కితాబిచ్చారు.
KTR Apologies To Womens: మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్, అక్కాచెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం లేదని కామెంట్
Arun Charagondaతెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.
Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!
Arun Charagondaప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్ టిన్లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది.
Israel-Palestine Conflict: గాజాలో మృత్యుఘోష, 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని తెలిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇంకా ఆగని వార్
Hazarath Reddyగాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని భూభాగ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో 92,401 మంది గాయపడ్డారు.
EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..
Hazarath Reddyఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ను (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.