Bengaluru Water Crisis: బెంగుళూరులో నీటి సంక్షోభం, కారు వాషింగ్, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేస్తామని తెలిపిన ప్రభుత్వం

నీటి కొరత బెంగుళూరు నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు (Bengaluru Water Crisis) పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు

Bengaluru Water Crisis: బెంగుళూరులో నీటి సంక్షోభం, కారు వాషింగ్, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరాఫరా చేస్తామని తెలిపిన ప్రభుత్వం
Water Supply (Photo-X)

Bengaluru, Mar 6: నీటి కొరత బెంగుళూరు నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు (Bengaluru Water Crisis) పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కరువు కారణంగా బెంగళూరు తీవ్ర తాగునీటి కొరతను (Bengaluru Water Crisis) ఎదుర్కొంటుండగా, అనేక సొసైటీలు కార్ వాషింగ్, స్విమ్మింగ్ పూల్ కార్యకలాపాలపై నిషేధం విధించాయి.

మార్చిలో అసాధారణంగా వేడి వాతావరణం మధ్య బెంగుళూరు త్రాగునీటి సంక్షోభంతో పోరాడుతోంది. ఇప్పుడు, సంపన్న పరిసరాల్లోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) నీటి సంరక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకున్నాయి. నీటి సరఫరా తగ్గిపోవడం, నీటి ట్యాంకర్ సేవలపై పరిమితులకు ప్రతిస్పందనగా, RWAలు కఠినమైన రేషన్ చర్యలను అమలు చేశాయి. పరిస్థితిని తగ్గించడానికి వినూత్న పరిష్కారాలను ప్రవేశపెట్టాయి.

బెంగుళూరు వాసులకు చుక్కలు చూపిస్తున్న నీటి కొరత, మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయిందని తెలిపిన డిప్యూటీ సీఎం డికె శివకుమార్

పరిస్థితిని హేతుబద్ధంగా ఎదుర్కోవడానికి, నగరంలోని RWAలు తమ ప్రాంతాల్లో నీటి రేషన్‌ను ప్రారంభించారు మరియు వాహనాలను కడగడం మరియు స్విమ్మింగ్ పూల్ వినియోగం వంటి కార్యకలాపాలపై నిషేధాన్ని విధించారు. నీటి వృథాను నియంత్రించడం, నివాసితుల మధ్య సమాన పంపిణీని నిర్ధారించడం దీని లక్ష్యం.

నీటి పంపిణీని క్రమబద్ధీకరించడానికి, సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించడానికి, ప్రైవేట్ ట్యాంకర్లు, బోర్‌వెల్‌లు మరియు నీటిపారుదల బావులను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ప్రణాళికలు ప్రకటించారు.

డికె శివకుమార్ మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు, అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని (Borewell At My Home Also Dry) తెలిపిన డిప్యూటీ ముఖ్యమంత్రి.. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.

నీటి సమస్యను (Deepening Water Shortage) తీర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు.

నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్‌ విమర్శించారు. బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని.. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

కరవు పరిస్థితులతో తాగునీటి కొరత గ్రామాలనే కాకుండా, సిలికాన్‌ సిటీలో, అందులోనూ సీఎం అధికార నివాసం కృష్ణను కూడా పీడిస్తోంది. నగరంలో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో సీఎం నివాసానికి జలమండలి కొళాయిల నుంచి నీరు రావడం లేదు. అధికారులు హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారమే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే మాసాల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

(The above story first appeared on LatestLY on Mar 06, 2024 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).