Karnataka: రూపాయి చిల్లర లేదన్న కండక్టర్, కోర్టు గడప తొక్కి రూ.3 వేలు వసూలు చేసిన ప్రయాణికుడు, 45 రోజుల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని BMTCకి కోర్టు ఆదేశాలు
ఆర్టీసీ బస్సులో కండక్టర్ రూపాయి చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు కోర్టును (Man goes to court) ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు.
Bengaluru, Feb 21: ఆర్టీసీ బస్సులో కండక్టర్ రూపాయి చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు కోర్టును (Man goes to court) ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఘటన వివరాల్లోకెళితే.. 2019లో, రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుండి మెజెస్టిక్ బస్ డిపోకు BMTC బస్సులో ప్రయాణించాడు, ఆ సమయంలో కండక్టర్ రూ. 29కి టిక్కెట్ ఇచ్చాడు. ఫిర్యాదుదారు రూ. 30 చెల్లించాడు. అయితే రూపాయి చిల్లర లేదని (not getting Rs 1 change back ) కండక్టర్ ఇవ్వలేదు.పైగా చిల్లర లేదంటూ బస్సు కండక్టర్ రమేష్పై దుర్భూషలాడాడు.
దీంతో మనస్తాపానికి గురైన ఆయన రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ వ్యక్తికి రూ.2,000 పరిహారం చెల్లించాలని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)ని బెంగళూరు కోర్టు ఆదేశించింది. ఫిర్యాదుదారుడి లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బీఎంటీసీని కోర్టు ఆదేశించింది.
ఈ విషయాన్ని BTCTC ఉన్నత కార్యాలయానికి తీసుకువెళ్లినప్పుడు, ఉద్యోగి ఇవ్వాల్సిన రూ. 1ని తిరిగి చెల్లించలేదు కదా కండక్టర్ కే వారు సపోర్ట్ చేశారు. BMTC చట్టం, చర్యతో బాధపడిన ఫిర్యాదుదారుడు ప్రస్తుత ఫిర్యాదుతో పాటుగా రూ. 1 తిరిగి చెల్లించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయవలసి వచ్చింది. అయితే, ఇది మాములు అంశమని బీఎంటీసీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సర్వీస్లో లోపం ఉందన్న ఆరోపణను కొట్టిపారేసింది. ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది.
అయితే, రమేష్ చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్ దాఖలు చేశారు, ఈ నేపథ్యంలో పరిహారం చెల్లించాలని ఆదేశించారు.ఫిర్యాదుదారు ఈ సమస్యను కమిషన్ ముందు హక్కుగా తీసుకున్నందున వివాదం స్వభావంలో చిన్నదిగా కనిపిస్తుంది. ఇది వినియోగదారుడి హక్కుకు సంబంధించిన అంశంగా గుర్తించబడాలి. ప్రశంసించబడాలి.
అటువంటి సందర్భంలో ఫిర్యాదుదారుడు తన హక్కును పొందేందుకు అర్హుడు అంటూ కోర్టు పేర్కొంది. ఫిర్యాదుదారుడు రూ.15,000 నష్టపరిహారం కోరగా, కోర్టు ఫీజు కోసం రూ.1,000తో పాటు రూ.2,000 పాక్షిక ఉపశమనం చెల్లించాలని కోర్టు BMTCని ఆదేశించింది. ఆర్డర్ ఇచ్చిన 45 రోజులలోపు మొత్తాన్ని చెల్లించాలని BMTCని ఆదేశించింది, లేని పక్షంలో సంవత్సరానికి రూ. 6,000 వడ్డీ రేటు వర్తిస్తుందని తన ఆదేశాల్లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Feb 21, 2023 01:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

