Parakram Diwas 2023: 21 దీవులకు పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టిన ప్రధాని మోదీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నేతాజీ జాతీయ స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించిన భారత ప్రధాని
PM Modi (Photo-ANI)

New Delhi, Jan 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక చిహ్నం నమూనాను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అండమాన్ & నికోబార్ దీవులలోని (Andaman & Nicobar Islands) 21 పెద్ద పేరులేని దీవులకు ప్రధాని మోదీ పేర్లు పెట్టారు.ఈ దీవులకు సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్) సహా 21 మంది పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు.

వీరిలో నాయబ్ సుబేదార్ బనా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్, హనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్, 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్‌ సహా 21 మంది పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఉన్నాయి.

శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్​ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అండమాన్ & నికోబార్ దీవులలోని 21 పెద్ద పేరులేని దీవులకు (21 largest unnamed islands ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్లు పెట్టారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నేల అండమాన్‌. స్వతంత్ర భారత ప్రభుత్వం తొలిసారిగా అక్కడ ఏర్పడింది. నేడు నేతాజీ సుభాష్ బోస్ జయంతి. దేశం ఈ రోజును పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

Here's ANI Tweets

భారత స్వాతంత్ర్య ఉద్యమంతో అండమాన్ & నికోబార్ దీవులకు ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఖచ్చితంగా గుర్తించి, అభినందిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నేడు, అండమాన్-నికోబార్ దీవులలోని 21 పెద్ద ద్వీపాలు మన పరమవీర్ చక్ర విజేతల పేర్లతో ముడిపడి ఉన్న ప్రధానమంత్రి మోడీ ఈ చొరవ.. ఈ భూమి ఉన్నంత వరకు వారి జ్ఞాపకార్థం చిరస్థాయిగా ఉండాలనే ప్రయత్నం సైన్యం యొక్క ఉత్సాహాన్ని పెంచుతుందని కేంద్ర హెచ్‌ఎం అమిత్ షా అన్నారు.