Moratorium to NBFCs: ఆర్బీఐ కీలక నిర్ణయం, మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ, NBFCsలకు మారటోరియం విస్తరణపై బ్యాంకులదే తుది నిర్ణయం
RBI Governor Shaktikanta Das. (Photo Credit: PTI)

Mumbai, April 27: ఇండియాలోని ఆరు డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని (Special Liquidity Facility) ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేందుకు తీసుకున్నఈ సౌలభ్యం సోమవారం నుంచి మే 11 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

అయితే నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (Non-Banking Finance Companies (NBFCs)) 3 నెలల మారటోరియం (Moratorium Benefits) విస్తరించే నిర్ణయం పూర్తిగా బ్యాంకులదేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) తెలిపారు.

దీనిపై ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, "మార్చి 27 సర్క్యులర్‌లో మూడు నెలల్లో వాయిదాల తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధం ఉంటుందని మేము చెప్పాము. రుణాలు అన్ని వాయిదాల చెల్లింపుపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయడానికి సంస్థలకు అనుమతి ఉంది…. ఇది 'మేము కూడా చెప్పాము. పేర్కొన్న సంస్థలు పైన పేర్కొన్న ఉపశమనాలను అందించడానికి బోర్డు ఆమోదించిన విధానాలను రూపొందిస్తాయని అన్నారు. అయితే బ్యాంకుల తీసుకునే నిర్ణయం మీదనే ఇది ఆధారపడి ఉంటుందని అన్నారు. బ్యాంక్ లోన్లు మరియు ఈఎంఐల వసూళ్లపై మూడు నెలల తాత్కాలిక నిషేధం విధించిన ఆర్బీఐ, వడ్డీల చెల్లింపులకీ వర్తింపు, కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటనలు

ప్రతి బ్యాంకు తన సొంత లిక్విడిటీ స్థానం, మూలధన సమృద్ధి మరియు దాని స్వంత ఆర్ధికవ్యవస్థలను అంచనా వేయాలి అనేది దాస్ అభిప్రాయంగా తెలుస్తోంది. దీని అర్థం ఏమిటంటే, ప్రతి బ్యాంకు దాని స్వంత ద్రవ్య స్థితి, మూలధన సమృద్ధి మరియు దాని స్వంత ఆర్థిక పరిస్థితులను అంచనా వేయాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు NBFCsకు మారటోరియం విషయంపై పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బిఐకి సంబంధించినంతవరకు, అక్కడ తగినంత స్పష్టత ఉంది. అమలుకు సంబంధించినంతవరకు, ప్రతి బ్యాంక్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయాలని ఆయన అన్నట్లుగా తెలుస్తోంది. లాక్‌‌డౌన్‌లో దేశ ప్రజల రోజూ వారి అవసరాల కోసం కేంద్రం రూ. 1.7 లక్ష కోట్ల ఆర్థిక ప్యాకేజీ

ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి భారతీయ బ్యాంకుల సంఘం ఒక సమావేశం నిర్వహించిందని, అయితే, ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్‌బిఎఫ్‌సికి తాత్కాలిక నిషేధాన్ని విస్తరించవద్దని స్పష్టంగా పేర్కొన్నందున, ఇతర బ్యాంకులు కూడా అదేబాటలో ఉన్నాయని అన్నారు. అంతకుముందు మార్చి 27 న, ఆర్బిఐ గవర్నర్ అన్ని బ్యాంకులు, రుణ సంస్థలు అన్ని రుణాలపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించవచ్చని ప్రకటించారు. అన్ని రుణాలపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించడమే కాకుండా అన్ని రుణాలపై మూడు నెలల వడ్డీ వాయిదాను అందించడానికి ఆర్బిఐ బ్యాంకులను అనుమతించిందని దాస్ చెప్పారు.