Travel

Phones Ban In Jagannath Temple: పూరి ఆలయంలో స్మార్ట్‌ ఫోన్లపై పూర్తి నిషేధం.. భక్తులతో పాటు పోలీసులు, ఆలయ సిబ్బందికీ ఇదే నిబంధన.. జనవరి నుంచే అమలు

Rudra

ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేసింది. జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుక్‌చేసుకోచ్చు.

Arjita Seva Tickets: జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

Rudra

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Billionaire Treats Employees: ఈ బాసు సూపరహా.. ఏకంగా 10 వేల ఉద్యోగుల కుటుంబాలను డిస్నీల్యాండ్ ట్రిప్ తీసుకెళ్ళాడు మరి

Rudra

‘ఎక్స్ ట్రా అవర్స్ పని చెయ్, నెల కాగానే జీతం తీసుకోవట్లేదు?’ అంటూ ఉద్యోగులను మాటలతో పొడిచే బాస్ లు మాత్రమే ఉంటారని అనుకుంటే పొరపాటే. మీరు చదువబోయే ఈ వార్త.. బాస్ లపై మీ అభిప్రాయాన్నే మార్చొచ్చు.

Advertisement

Tirumala Hundi Income Record: రికార్డులు సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి హుండీ.. వరుసగా తొమ్మిదో నెలలోనూ రూ. 100 కోట్ల ఆదాయం.. మూడు నెలల ముందే రూ. 1000 కోట్ల అంచనాకు మించి ఆదాయం

Rudra

తిరుమల శ్రీవారి హుండీ రికార్డులు కొల్లగొడుతోంది. వరుసగా తొమ్మిదో నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు దాటింది.

TTD Srivani Tickets: గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది.

TTD: వ‌యోవృద్ధులైన శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఈ నెల 24న డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టికెట్ల కోటా విడుదల, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరిన టీటీడీ అధికారులు

Hazarath Reddy

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు (senior citizens on Nov 24) వీలుగా డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను (TTD to release December’s quota) ఈనెల 24 న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

Heavy Crowd at Yadadri Temple: యాదాద్రి క్షేత్రానికి ఒక్కరోజులో రూ.1 కోటికిపైగా ఆదాయం... చరిత్రలో ఇదే ప్రథమం.. యాదాద్రీషుడి దర్శనానికి నిన్న ఒక్కరోజే లక్షమందికి పైగా కొండకు.. ఆదివారం, కార్తీకమాసం కావడంతో పోటెత్తిన భక్తులు..

Sriyansh S

తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి. నిన్న ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, యాదాద్రికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. నేడు ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం వచ్చింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం.

Advertisement

Tirumala: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ కోటా విడుదల, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి, తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ( Special Entry Darshan Tickets) టీటీడీ విడుదల చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల (December Quota Released by TTD) చేసింది.

Sai Samadhi: షిర్డీ సాయి భక్తులకు అద్భుత అవకాశం.. సాయి సమాధిని స్పృశించే గొప్ప భాగ్యం మళ్లీ.. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం.. సాధారణ భక్తులకు, సమాధికి మధ్య గాజు అద్దం.. సాయి సంస్థాన్ తాజా నిర్ణయంతో సాధారణ భక్తులకూ సాయి సమాధిని తాకే గొప్ప అవకాశం.. భక్తుల ఆనందం

Sriyansh S

షిర్డీ సాయి భక్తులకు ఇది గొప్ప శుభవార్త. ఇకపై సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లే భక్తులకు సాయి సమాధిని స్పృశించే భాగ్యం కూడా కలగనుంది. ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం ఉండేది. ఇప్పుడు సాధారణ భక్తులకు కూడా ఆ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాగ్యశ్రీ బనాయత్ తెలిపారు.

TTD: డిసెంబర్ ఎస్‌ఈడీ కోటా టికెట్లను రేపు విడుదల చేయనున్న టీటీడీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నవంబర్ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Hazarath Reddy

డిసెంబర్‌కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను (SED tickets online quota) నవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో (TTD Online Booking) విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరింది.

Lunar Eclipse: విజయవాడ కనకదుర్గ ఆలయం మూసివేత, ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ఆలయం మూసివేసినట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేశారు.ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తునట్లు అధికారులు ప్రకటించారు. రేపు యథావిధిగా ఆలయాలు తలుపులు తెరుచుకుంటాయి.

Advertisement

Koti Deepotsavam: విజయవాడలో కోటి దీపోత్సవం వీడియో, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

Hazarath Reddy

కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారుసర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కార్తీక మాసం, చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడ కోటి దీపోత్సవం నిర్వహించారు. విజయవాడలో కోటి దీపోత్సవం వీడియో ఇదే..

TTD Revenue: తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్‌ ఆస్తుల కంటే ఎక్కువ.

TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ 8న శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేత, ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

Hazarath Reddy

నవంబర్ 8న చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు (Tirumala temple to remain closed) ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.

TTD: తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, 12 టికెట్లను రూ.32 వేలకు బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించిన కాణిపాకం ఆలయ ఉద్యోగిని, కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

Hazarath Reddy

వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

Advertisement

TTD Darshan Tickets: వారికి నవంబర్‌ నెల కోటా టికెట్లను విడుదల చేయనున్న TTD, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి, శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక కోటా టికెట్లు (November quota of Special darshan tokens) విడుదల కానున్నాయి. నవంబర్‌ నెల కోటాకు చెందిన టికెట్లను టీటీడీ (TTD) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. వృద్ధులు, దివ్యాం‌గులకు సంబంధించిన ఈ టికెట్లు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నది.

Yadadri Temple: ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత, సాయంత్రం 4.59 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం కానున్న సూర్యగ్రహణం

Hazarath Reddy

ఈ నెల 25న సూర్యగ్రహణం (partial solar eclipse) ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు (Yadadri hill shrine will be closed) ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

TTD: తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూసివేత, సూర్య, చంద్ర గ్రహణం కారణంగా అక్టోబర్‌ 25 రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న రాత్రి 7.20 వరకు మూసివేత

Hazarath Reddy

తిరుమల: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని రెండు రోజుల పాటు అధికారులు మూసివేయనున్నారు. అక్టోబర్‌ 25, నవంబర్‌ 8న తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేస్తున్నా రు. అక్టోబర్‌ 25న సూర్యగ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం

Hazarath Reddy

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement
Advertisement