Power Outage During President Address: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతుండగా 9 నిమిషాలపాటు పోయిన కరెంట్.. చీకట్లోనే ప్రసంగం.. ఒడిశాలోని మయూర్భంజ్లో ఘటన.. వీడియో వైరల్
రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.
Bhubaneswar, May 7: ఒడిశాలో (Odisha) మూర్భంజ్ జిల్లా బరిపదలోని మహారాజ శ్రీరామచంద్ర భంజదేవ్ వర్సిటీలో నిన్న స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రప్రతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రప్రతి ప్రసంగిస్తుండగా అనుకోని ఘటన చోటుచేసుకున్నది. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు. అసలేమైందంటే.. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.
Power outage during President Droupadi Murmu’s address at the convocation ceremony of MSCB university in Baripada; Tata Power says it is under maintenance of IDCO. Varsity electricity dept staff suspended. ADM says probe will be launched.#BlackoutDuringPresidentAddress #Odisha pic.twitter.com/2XYe83BTxI
— OTV (@otvnews) May 6, 2023
చీకటి, వెలుగులను సమానంగా చూడాలని
పోడియం నుంచి వస్తున్న వెలుతురు మధ్య రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చీకటి, వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on May 07, 2023 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

