Viral

Cancer Tablet in Rs 100: వంద రూపాయలకే క్యాన్సర్ టాబ్లెట్, క్యాన్సర్ తిరిగి రాకుండా నిరోధించే చికిత్స ట్రయల్స్ సక్సెస్ అని ప్రకటించిన ముంబై టాటా ఇన్‌స్టిట్యూట్‌

Hazarath Reddy

ఈ చికిత్సలో భాగంగా క్యాన్సర్ టాబ్లెట్‌ను రూపొందించినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే వెల్లడించారు. ట్యాబ్లెట్ విలువ కేవలం రూ.100 మాత్రమేనని (Cancer Tablet in Rs 100) తెలిపారు.

Worm in Cadbury Dairy Milk Chocolate: డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు, అవి తినడం సురక్షితం కాదంటూ బాంబు పేల్చిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ

Hazarath Reddy

డెయిరీ మిల్క్‌ చాక్లెట్ పై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ బిగ్ బాంబ్ పేల్చింది. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్స్‌ సురక్షితం కాదని నిర్ధారించింది. ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో బతికున్న పురుగు కనిపించడం సంచలనంగా మారింది. చిన్న పురుగు చాక్లెట్ రంగులోకి మారి తిరుగుతోంది.

Kadiyam Srihari Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మగతనం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్, నీ మగ తనాన్ని నిరూపించుకోమని సవాల్

Hazarath Reddy

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Accident Caught on Cam: ఈ రోడ్డు ప్రమాదంలో తప్పెవరది? సిగ్నల్ లేని చోట రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టిన బొలెరో వాహనం, అక్కడికక్కడే మృతి, సీసీటీవీ ఫుటేజీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా యువకుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం అక్కడున్న సీసీటీవీ పుటీజీలో రికార్డు అయింది.

Advertisement

Telangana Inter Exams 2024: ఇంటర్ పరీక్షలకు తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని వెనక్కి పంపిన అధికారులు, కంటతడి పెట్టుకున్న అమ్మాయి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని పావని 9:09 నిమిషాలకు రాగా.. అధికారులు వెనక్కు పంపించగా అమ్మాయి కంటతడి పెట్టుకుంది.

Stray Dog Attack on Journalist: వాకింగ్ చేస్తున్న జర్నలిస్టుపై వీధికుక్క దాడి, వీటి వల్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ ఆందోళన వ్యక్తం

Hazarath Reddy

ఢిల్లీలోని లోధీ గార్డెన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జర్నలిస్టుపై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపిన ఘటన. ఈ దాడి అనూహ్యమైనది. రోజంతా పార్కుకు తరచుగా వచ్చే పిల్లలు వృద్ధుల,తో సహా ప్రజల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.

Drug Bust in Gujarat: గుజరాత్‌లో 3,300 కేజీల డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ, 5గురు పాకిస్తాన్ జాతీయులు అరెస్ట్, దేశంలోనే అతిపెద్ద డ్రగ్ ఆపరేషన్ ఇదే అని తెలిపిన ఎన్‌సిబి

Hazarath Reddy

భారత నావికాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ముఖ్యమైన ఉమ్మడి భారీ ఆపరేషన్‌లో గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో ఓడ నుండి సుమారు 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నావికాదళం ప్రకారం, ఈ ఆపరేషన్ దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సీజ్‌గా గుర్తించబడింది. ఒక చిన్న నౌకను నౌకాదళం అడ్డగించడంతో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది.

Sowmya Janu Abuses Traffic Cop: ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడిచేసిన సినీ న‌టి, రాంగ్ రూట్ లో ఎందుకొచ్చావ‌ని అడిగినందుకు కానిస్టేబుల్ బట్ట‌లు చించి, మొబైల్ ప‌గులగొట్టి నానా ర‌చ్చ చేసిన హీరోయిన్ (వీడియో ఇదుగో)

VNS

మరోవైపు సౌమ్యజాను(Sowmya Janu) ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అత్యవసర వైద్యసహాయం నిమిత్తం రాంగ్‌రూట్‌లో వెళ్లానని, పోలీసులు క్షమించాలని కోరారు. విధుల్లో ఉన్న పోలీసులు అసభ్యంగా దూషించడం వల్ల తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. అతడిపై దాడి చేయలేదని, పోలీసులు విచారణకు పిలవలేదన్నారు.

Advertisement

RBI ఆంక్షలతో ఉద్యోగం పోతుందనే భయంతో Paytm బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య..

sajaya

ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఉద్యోగం పోతుందనే భయం మొదలైంది. ఇప్పుడు, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 35 ఏళ్ల ఉద్యోగి ఇండోర్‌లో ఉద్యోగం కోల్పోయే ఒత్తిడి కారణంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

Citizenship Amendment Act: మార్చి మొదటి వారంలో CAA పౌరసత్వ సవరణ బిల్లు అమలులోకి వచ్చే అవకాశం..ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం అతి పెద్ద అడుగు..

sajaya

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పౌరసత్వ నమోదు కోసం ఆన్‌లైన్ పోర్టల్ కూడా సిద్ధంగా ఉందని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిందని వర్గాలు తెలిపాయి.

Cough Syrup Deaths Case: కలుషిత దగ్గు మందు తాగి 68 మంది చిన్నారులు మృతి ఘటన, భారత కంపెనీ డైరక్టర్‌కు 20 ఏళ్లు జైలు శిక్ష, మరో 22 మందికి రెండేళ్లు జైలు శిక్ష విధించిన ఉజ్బెకిస్థాన్ కోర్టు

Hazarath Reddy

డిసెంబర్ 2022లో కలుషితమైన దగ్గు సిరప్ తాగి 68 మంది చిన్నారులు మరణించిన కేసులో ఉజ్బెకిస్థాన్ కోర్టు మరో 22 మందితో పాటు ఒక భారతీయుడికి జైలు శిక్ష విధించింది.

Farmer Denied Entry Into Metro: బెంగుళూరు మెట్రోలో రైతుకు ఘోర అవమానం, బట్టలు సరిగా లేవని లోనికి పంపకుండా అడ్డుకున్న సిబ్బంది, వీడియో వైరల్ అయిన తర్వాత క్షమాపణలు చెప్పిన నమ్మ మెట్రో యాజమాన్యం

Hazarath Reddy

బెంగళూరు మెట్రో స్టేషన్‌లో సిబ్బంది రైతును అవమానించారు. ప్రజా రవాణా సంస్థ ‘నమ్మ మెట్రో’లోకి రైతును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. నాసిరకం బట్టలు వేసుకున్నాడని మెట్రో ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.ఈ ఘటనను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Advertisement

Mohammed Shami Reacts PM Modi Tweet: ధన్యవాదాలు సర్ అంటూ ప్రధాని మోదీకి రిప్లయి ఇచ్చిన మహ్మద్ షమీ, మడమ శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన భారత ప్రధాని

Hazarath Reddy

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చీల మండకు గాయం కావడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి విదితమే. మడమ శస్త్రచికిత్స విజయవంతమయినట్లు, శస్త్రచికిత్స తర్వాత ఫోటోలను పంచుకున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు

Fact Check on Floating Bridge Washed Away: విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందనేది అబద్దం, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన VMRDA, అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ తొలగింపు చేస్తామని క్లారిటీ

Hazarath Reddy

బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని VMRDA క్లారిటీ ఇచ్చింది . ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Farmer Denied Entry to Metro: మురికి బట్టలు వేసుకున్నాడని రైతును మెట్రో ఎక్కకుండా అడ్డుకున్న సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడిన తోటి ప్రయాణికులు, ఘటనపై బెంగుళూరు మెట్రో స్పందన ఇదే..

Hazarath Reddy

బెంగళూరు మెట్రో స్టేషన్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో నగరంలోని ప్రజా రవాణా సంస్థ ‘నమ్మ మెట్రో’లో ఓ రైతును అవమానించినట్లుగా తెలుస్తోంది. ఓ రైతు నాసిరకం బట్టలు వేసుకున్నాడని మెట్రో ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

Telangana: కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్, విద్యుత్ స్తంభం పై నుండి పడ్డ ఔట్ సోర్సింగ్ హెల్పర్, తలకు బలమైన గాయాలు

Hazarath Reddy

నారాయణపేట - జిల్లా కేంద్రంలోని సరాఫ్ బజార్ ప్రాంతంలో లైన్‌మెన్‌కు చెప్పకుండా ఔట్ సోర్సింగ్ హెల్పర్ అల్లావుద్దీన్ కరెంటు స్తంభం ఎక్కి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నాడు. పవర్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఆ ఏరియాలో ఉండే ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్ రావడంతో ప్రమాదం జరిగింది.

Advertisement

Cow Chews on Python: భారీ కొండచిలువను నమిలి మింగేయబోయిన ఆవు, అది చూసి షాకైన దాని యజమాని, పశువైద్యులు ఏం చెప్పారంటే..

Hazarath Reddy

జార్ఖండ్‌లోని డాల్తోన్‌గంజ్‌లో ఫిబ్రవరి 26, ఆదివారం నాడు దాని షెడ్‌లో నాలుగు అడుగుల పొడవున్న కొండచిలువను నమిలేస్తున్న ఆవును (Cow Chews on Four-Foot-Long Python) చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. పామును పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పాము శరీరం ఆవు నోటి నుండి వేలాడుతూ ఉంది.

HC On Old Age Pension: ఆధార్ కార్డు లేకపోయినా వృద్ధాప్య పింఛను చెల్లించాల్సిందే, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు లేని పిటిషనర్లకు బ్యాంకు రికార్డుల ద్వారా వారి వాస్తవికతను ధృవీకరించిన తర్వాత వారికి వృద్ధాప్య పెన్షన్ చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు

Hazarath Reddy

విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

First Bird Flu Case on Antarctica: అంటార్కిటికాలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు.. పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తల ఆందోళన

Rudra

అంటార్కిటికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్‌ ను ఈ నెల 24న గుర్తించారు.

Advertisement
Advertisement