Train Derails In Chennai: చెన్నైలో పట్టాలు తప్పిన లేడీస్ కంపార్ట్ మెంట్.. తిరువళ్లూరు వెళుతున్న రైలుకు బేసిన్ బ్రిడ్జ్ స్టేషన్ వద్ద ప్రమాదం.. హడలిపోయిన ప్రయాణికులు
రైలు ప్రమాద ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. చెన్నైలో ఓ రైలు పట్టాలు తప్పింది. తిరువళ్లూరు వెళుతున్న ఈ రైలు బేసిన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఈఎంయూ రైలులో చివరి నుంచి రెండో కంపార్ట్ మెంట్ పక్కకి ఒరిగిపోయింది. ఇది లేడీస్ కంపార్టమెంట్.
Chennai, June 12: రైలు ప్రమాద ఘటనలు (Train Accidents) ఇటీవల ఎక్కువయ్యాయి. చెన్నైలో (Chennai) ఓ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. తిరువళ్లూరు (Tiruvallur) వెళుతున్న ఈ రైలు బేసిన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఈఎంయూ (EMU) రైలులో చివరి నుంచి రెండో కంపార్ట్ మెంట్ పక్కకి ఒరిగిపోయింది. ఇది లేడీస్ కంపార్టమెంట్. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి బయల్దేరిన 8 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈఎంయూ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ఇతర రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు.
Coach of Tiruvallur-bound train derails near Basin Bridge railway station in Chennai https://t.co/BGi1ZxdOwe
— TOI Cities (@TOICitiesNews) June 11, 2023
ప్రయాణికులు భయంభయం
ప్రమాదం జరిగిన సమయంలో రైల్లోనే ఉన్నవారు, ఒక్కసారిగా రైలు కుదుపులకు గురై ఆగిపోవడంతో హడలిపోయామని చెప్పారు. ఇక ఆ రైల్లో ప్రయాణించడానికి భయపడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే రైలు దిగేసి వెంటనే బస్సెక్కి గమ్యస్థానానికి వెళ్లిపోయాడు.
(The above story first appeared on LatestLY on Jun 12, 2023 09:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

