Karnataka Bribe: కర్ణాటకలో మరో లంచం ఉదంతం.. డబ్బు డిమాండ్ చేసిన ఆఫీసర్.. డబ్బులు ఇవ్వలేక ఎద్దుని తీసుకోమన్న రైతు.. కలకలం.. ఆ తర్వాత?

లంచాలకు కర్ణాటక కేరాఫ్ గా మారుతున్నది. లంచం డిమాండ్ చేస్తున్న కేసులు అక్కడ నిత్యకృత్యంగా మారుతున్నాయి. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని అధికారి తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ రైతు తన వద్ద ఉన్న ఎద్దునే లంచంగా ఇవ్వాలనుకున్నాడు.

Karnataka Bribe: కర్ణాటకలో మరో లంచం ఉదంతం.. డబ్బు డిమాండ్ చేసిన ఆఫీసర్.. డబ్బులు ఇవ్వలేక ఎద్దుని తీసుకోమన్న రైతు.. కలకలం.. ఆ తర్వాత?
Credits: Twitter

Bengaluru, March 11: లంచాలకు (Bribe) కర్ణాటక (Karnataka) కేరాఫ్ గా మారుతున్నది. లంచం డిమాండ్ (Demand) చేస్తున్న కేసులు అక్కడ నిత్యకృత్యంగా మారుతున్నాయి. లంచం తీసుకున్న అధికారి పని చేయకుండానే బదిలీ అయ్యాడు. కొత్తగా వచ్చిన అధికారి కూడా లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ రైతు తన వద్ద ఉన్న ఎద్దునే లంచంగా ఇవ్వాలనుకున్నాడు. దానినే కార్యాలయానికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హవేరిలో ఈ వింత ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సావనూరుకు చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మున్సిపల్‌ రికార్డుల్లో ఇంటి అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఓ అధికారికి లంచం ఇచ్చాడు. అయితే ఆ రైతు పని పూర్తి కాకుండానే ఆ అధికారి మారారు. కొత్త అధికారి వచ్చాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. 11 గంటలకు అధికారుల ముందుకు.. కేసీఆర్ కూతురిని అరెస్టు చేస్తారంటూ సర్వత్రా ఊహాగానాలు.. కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ.. మరింత హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కాం.. వీడియోలతో..

మళ్ళీ తన పని చేయమంటూ మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళాడు. రూ. 25,000 లంచం ఇవ్వమని ఆ రైతును ప్రభుత్వ అధికారి డిమాండ్ చేశాడు. డబ్బులు లేక   నిస్సహాయుడుగా మారిన ఎల్లప్ప సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర డబ్బులు లేవంటూ..  తన ఎద్దును తీసుకొని మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లాడు. ఆ ఎద్దుని ఆఫీసు దగ్గర కట్టేశాడు.దీంతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం కాస్తా ఉన్నతాధికారులకు తెలియడంతో స్పందించారు. లంచం అడిగిన అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్లప్ప పనిచేసి పెడతామని హామీ ఇచ్చారు.

ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్

(The above story first appeared on LatestLY on Mar 11, 2023 10:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).