చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్‌ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసిన సంగతి విదితమే. ఆల్‌రౌండ్‌ షో తో పాక్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ గెలవదంటూ ఐఐటీ బాబా అభ‌య్ సింగ్‌ (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే.దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్‌ అభిమానులు సూచిస్తున్నారు.

చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

తాజాగా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

IIT Baba Apologizes 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)