ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. దేవరేట్, జాన్ ఎం. మార్టినిస్లకు సంయుక్తంగా అవార్డు ప్రకటించబడింది. వారు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్ అనే పరిశోధనకు గుర్తింపు పొందారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ఒక చిప్పై నడిపించిన పరీక్షల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ లక్షణాలను మాక్రోస్కోపిక్ స్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ ను ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా సవివరంగా పరిశీలించారు. ఈ ప్రయోగాల ద్వారా, క్వాంటమ్ లక్షణాలను పెద్దదైన (macroscopic) వ్యవస్థల్లో కూడా పరీక్షించవచ్చని వారు నిరూపించారు.
అసలు ప్రయోజనం ఏమిటంటే కంప్యూటర్ మైక్రోచిప్స్లోని ట్రాన్సిస్టర్స్ ఆధారంగా క్వాంటమ్ టెక్నాలజీ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. నోబెల్ కమిటీ ప్రకారం, ఈ పరిశోధనలు రాబోయే తరాల క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ సెన్సార్స్ అభివృద్ధికి దారి చూపుతాయి. శాస్త్రవేత్తల అధ్యయనం క్వాంటమ్ ఫిజిక్స్ను ప్రాక్టికల్ డివైసులలో ఉపయోగించడానికి ఒక మైలురాయిగా నిలుస్తోంది. నోబెల్ అవార్డు కమిటీ ఈ పరిశోధనలను క్వాంటమ్ ప్రపంచం మరియు భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంపై విప్లవాత్మక ప్రభావం చూపే ప్రయత్నంగా తెలిపింది.
Nobel Prize in Physics 2025 Winners:
BREAKING NEWS
The Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Physics to John Clarke, Michel H. Devoret and John M. Martinis “for the discovery of macroscopic quantum mechanical tunnelling and energy quantisation in an electric circuit.” pic.twitter.com/XkDUKWbHpz
— The Nobel Prize (@NobelPrize) October 7, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)