సోమవారం, నవంబర్ 17న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక డిమాండ్‌ను భారతదేశానికి అధికారికంగా పంపింది. గత సంవత్సరంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడంలో పాత్ర పోషించినందుకు ఉరిశిక్ష విధించబడిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ గృహ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లను భారత్ అప్పగించాలని ఢాకా కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. ఇటీవల వచ్చిన తాజా తీర్పులో, జూలై సంఘటనల్లో జరిగిన దారుణ మారణహోమానికి సంబంధించిన కేసులో పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమల్ దోషులుగా తేలి శిక్షించబడ్డారని పేర్కొంది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు పరారైన వ్యక్తులకు మన ఏదైనా పొరుగు దేశం ఆశ్రయం ఇవ్వడం స్నేహపూర్వక నైతికతకు విరుద్ధం. ఇది న్యాయ ప్రక్రియను అవమానపరచే తీవ్రమైన చర్య. అందువల్ల, ఈ ఇద్దరు దోషులను వెంటనే బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించాలని మేము భారత్‌ను గట్టిగా కోరుతున్నాము. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం భారతదేశం దీనిని గౌరవించాల్సిన బాధ్యత ఉందని ప్రకటనలో కోరింది.

Bangladesh Urged India To Extradite Former PM Sheikh Hasina 

(Photo Credits: X/@BDMOFA)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)