Sports
Danushka Gunathilaka Arrest: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్.. రేప్ ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు
Sriyansh Sశ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీలో పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ధనుష్క గుణతిలకను అరెస్టు చేయడంతో ఆయన లేకుండానే లంక టీం ఆస్ట్రేలియా నుంచి పయనమైంది.
ICC T20 World Cup: వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ లోనూ గెలవని ఆఫ్ఘనిస్థాన్... పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన వైనం.. నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహ్మద్ నబీ
Sriyansh Sఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు మహ్మద్ నబీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు నబీ వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు.
Virat Kohli Gifts Liton Das: కోహ్లీ చేసిన పనికి ఫిదా అవుతున్న క్రికెట్ అభిమానులు, భారత్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు కోహ్లీ గిఫ్ట్, ఇంతకీ ఏం ఇచ్చాడో తెలుసా?
Naresh. VNSబంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (Liton Das) ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం ఇండియాని ఓడించినంత పని చేశాడు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియాను భయపెట్టిన లిటన్ దాస్ కూ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. మేమందరం డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన బ్యాట్ ను లిటన్ దాస్ (Virat Kohli Gifts Liton Das) కూ బహుమతిగా ఇచ్చాడు
T20 World Cup 2022: మ్యాక్స్‌వెల్ మెరుపులు, ఆప్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్న కంగారులు
Hazarath Reddyటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ ఆప్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వరా సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది.
T20 World Cup 2022: హ్యట్రిక్ వీడియో, టీ20 ప్రపంచకప్‌-2022లో మరో హ్యాట్రిక్‌ నమోదు, న్యూజీలాండ్‌పై హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌
Hazarath Reddyఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌-2022లో మరో హ్యాట్రిక్‌ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ పేసర్‌ జాషువా లిటిల్‌ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన లిటిల్‌ రెండో బంతికి విలియమ్సన్‌, మూడో బంతికి నీషమ్‌, నాలుగో బంతికి శాంట్నర్‌ పెవిలియన్‌కు పంపాడు.
T20 World Cup 2022: సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ ముందడుగు, 35 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను మట్టి కరిపించిన కివీస్
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌(సూపర్‌-12)లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. గ్రూపు-1 నుం‍చి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా న్యూజిలాండ్‌ ముందడుగు వేసింది. గ్రూపు-1 నుం‍చి పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు +2.113 రన్‌ రేట్‌ ఉంది.
T20 World Cup 2022: వీడియో, ప్రపంచకప్‌ 2022లో అత్యంత భారీ సిక్సర్‌, 106 మీటర్ల దూరం బాదిన పాక్ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌, అవాక్కయి అలా చూస్తుండిపోయిన బౌలర్ ఎంగిడి
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా సౌతాఫ్రికా-పాకిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 3) జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 106 మీటర్ల భారీ సిక్సర్‌ బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డ్‌ అయ్యింది.
T20 World Cup 2022: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం, దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో ఘన విజయం
Hazarath Reddyటీం 20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా మరోసారి వర్షం బారినపడింది.లక్ష్యాన్ని కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. వర్షం అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులు చేసింది
T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం, బంగ్లా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు, లిటన్‌ దాస్‌ శ్రమ వృధా, బ్యాటింగ్‌లో మరోసారి దుమ్మురేపిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై భారత్ విజయం సాధించింది. వరుణుడు బంగ్లాదేశ్ ఆశల మీద నీళ్లు చల్లాడు. వర్షం వల్ల ఆట ఆగిపోవడంతో బంగ్లా బ్యాటర్లలో ఊపు తగ్గింది. దీంతో వర్షం తరువాత ఆట తిరిగి ప్రారంభం కాగానే ఊపు మీదున్న లిటన్‌ దాస్‌ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు.
T20 World Cup 2022: మ్యాచ్ ఆగితే భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టమే, డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌నే విజేత, ఆట తిరిగి ప్రారంభం కావాలని కోరుకుంటున్న భారత అభిమానులు
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి.టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్‌ అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
T20 World Cup 2022: ఒక్క బంతికి 14 పరుగులు పిండిన కెఎల్ రాహుల్, అందులో రెండు సిక్సర్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyటి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌లో రాహుల్‌ తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సరిగ్గా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే షోరిఫుల్‌ ఇస్లామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో రాహుల్‌ ఒక్క బంతికే 14 పరుగులు బాదడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది
T20 World Cup 2022: భారత బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లా బ్యాటర్ లిటన్‌ దాస్‌, ఏడు ఓవర్లలో 69 పరుగులు సాధించిన బంగ్లాదేశ్, వర్షం వల్ల ఆగిపోయిన మ్యాచ్, మళ్లీ కొనసాగే అవకాశం
Hazarath Reddyప్రస్తుతం బంగ్లాదేశ్‌ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్‌ దాస్‌ 59, హొస్సేస్‌ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ 17 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పటికే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్ల ఆట ముగియడంతో వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజేతను ప్రకటించనున్నారు.
Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు, మహేలా జయవర్థనేని అధిగమించిన భారత క్రికెటర్
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. 1016 పరుగులతో ఉన్న మహేలా జయవర్థనేని భారత క్రికెటర్ అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
T20 World Cup 2022: వైరల్ వీడియో, బౌలర్ 155 కిమీ వేగంతో బంతిని విసిరితే బ్యాటర్ దాన్ని 94 మీటర్ల దూరానికి కొట్టాడు, ఫిలిప్స్‌ సిక్స్ వీడియో వైరల్
Hazarath Reddyటి20 ప్రపంచకప్‌లో బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న సంగతి విదితమే.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కొట్టిన సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
T20 World Cup 2022: గెలిస్తే సెమీస్‌కు, ఓడితే లెక్కలు చూసుకోవాల్సిందే, నేడు బంగ్లాతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022(సూపర్‌-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్‌ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది.
T20 World Cup 2022: వైరల్ వీడియో, బంగ్లాదేశ్ మీద గెలుపు కోసం ప్రాక్టీస్‌లో కుస్తీలు పడుతున్న భారత ఆటగాళ్లు
Hazarath Reddyఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధమైంది. టోర్నీలో భారత్‌కి ఇది నాలుగో మ్యాచ్‌. ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో ఓడిన తర్వాత బంగ్లాతో తలపడనున్నందున ఎలాగైనా గెలవాలని కసిగా పెట్టుకుంది
T20 World Cup 2022: న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి, 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్
Hazarath Reddyఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-12 దశలో భాగంగా జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
T20 World CUP 2022: సెమీస్ రేసులోకి వచ్చేసిన శ్రీలంక, డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
Hazarath Reddyబ్రిస్బేన్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.దీంతో టీ20 ప్రపంచకప్‌-2022లో శ్రీలంక సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
T20 World Cup 2022: వరల్డ్‌కప్‌ గెలిచేందుకు రాలేదు, టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాం, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ (T20 World Cup 2022) ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.
India vs New Zealand: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు రెస్ట్, న్యూజిలాండ్‌ టూర్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా, వన్డే జట్టు కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌, పూర్తి లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత నవంబర్‌ 18 నుంచి 30 వరకు టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ ఇవాళ (అక్టోబర్‌ 31) ప్రకటించింది.