క్రీడలు

T20 World Cup 2022: గెలిస్తే సెమీస్‌కు, ఓడితే లెక్కలు చూసుకోవాల్సిందే, నేడు బంగ్లాతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022(సూపర్‌-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్‌ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది.

T20 World Cup 2022: వైరల్ వీడియో, బంగ్లాదేశ్ మీద గెలుపు కోసం ప్రాక్టీస్‌లో కుస్తీలు పడుతున్న భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధమైంది. టోర్నీలో భారత్‌కి ఇది నాలుగో మ్యాచ్‌. ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో ఓడిన తర్వాత బంగ్లాతో తలపడనున్నందున ఎలాగైనా గెలవాలని కసిగా పెట్టుకుంది

T20 World Cup 2022: న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి, 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-12 దశలో భాగంగా జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

T20 World CUP 2022: సెమీస్ రేసులోకి వచ్చేసిన శ్రీలంక, డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

Hazarath Reddy

బ్రిస్బేన్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.దీంతో టీ20 ప్రపంచకప్‌-2022లో శ్రీలంక సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

Advertisement

T20 World Cup 2022: వరల్డ్‌కప్‌ గెలిచేందుకు రాలేదు, టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాం, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ (T20 World Cup 2022) ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.

India vs New Zealand: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు రెస్ట్, న్యూజిలాండ్‌ టూర్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా, వన్డే జట్టు కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌, పూర్తి లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత నవంబర్‌ 18 నుంచి 30 వరకు టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ ఇవాళ (అక్టోబర్‌ 31) ప్రకటించింది.

T20 World Cup 2022: 42 ర‌న్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా, రేపు ఇంగ్లండ్‌,న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కీల‌కం

Hazarath Reddy

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన గ్రూప్ వ‌న్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 ర‌న్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజ‌యం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆ గ్రూపులో రెండ‌వ స్థానంలోకి వెళ్లింది. 180 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవ‌ర్ల‌లో 137 ర‌న్స్‌కు ఆలౌటైంది.

T20 World Cup 2022: కళ్లు చెదిరే ఫీల్డింగ్ వీడియో వైరల్, వెన‌క్కి ఎగిరి ఎడ‌మ చేతితో బంతి సిక్స్ పోకుండా ఆపిన ఐర్లాండ్ ఫీల్డ‌ర్ బారీ మెక్‌కార్తి

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫీల్డ‌ర్ బారీ మెక్‌కార్తి అద్భుత‌మైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద గాలిలో బంతిని ప‌ట్టి సిక్స‌ర్ వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవ‌ర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు.

Advertisement

T20 World Cup 2022: చెత్త ఫీల్డింగ్‌తో కొంపలు ముంచారంటూ టీమిండియాపై ట్విట్టర్లో ఫైర్, ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది కోహ్లీ అంటూ నెటిజన్ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది.

T20 World Cup 2022: భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే పాకిస్తాన్ ఇంటికి, టీ20 ప్రపంచ కప్‌లో దాయాది దేశం సెమీస్ ఆశలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా (T20 World Cup 2022) దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి చెందిన సంగతి విదితమే. అయితే ఈ భారత్ పరాజయం (South Africa beat India on Sunday) పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

Virat Kohli: నా స్వంత హోటల్ గదిలోనే నాకు రక్షణ లేదు, సంచలన వీడియో షేర్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను అంటూ పోస్ట్

Hazarath Reddy

ఈ వీడియో భయంకరంగా ఉంది మరియు ఇది నా గోప్యత గురించి నాకు చాలా మతిస్థిమితం లేని అనుభూతిని కలిగించింది. నేను నా స్వంత హోటల్ గదిలో గోప్యతను కలిగి ఉండలేకపోతే, నేను నిజంగా వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను?? ఈ రకమైన మతోన్మాదం మరియు గోప్యతపై సంపూర్ణ చొరబాటుతో నేను సమ్మతించను.

Virat Kohli Creates Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డ్, చేసింది 12 పరుగులే అయినా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, టీ-20 వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు

Naresh. VNS

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12 రన్స్ చేయడం ద్వారా విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి (1001) కి ముందు శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (Jayawardene ) (1016) ఒక్కడే ఉన్నాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి చేరుకున్నాడు

Advertisement

India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన రోహిత్ సేన, వరల్డ్ కప్ లో తొలి ఓటమి

kanha

ఆస్ట్రేలియాలో జరుగుతున్న t20 లీగ్ మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ నేడే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు కోసం పాక్ అభిమానుల ప్రార్థనలు.. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు.. నేడు నెదర్లాండ్స్‌ తో జరిగే మ్యాచ్ లో పాక్ ఓడితే ఇంటికే

Sriyansh S

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

T20 World Cup 2022: ప్రపంచకప్ నుంచి భారత్ కూడా ఇంటికి వస్తుంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్, మూసుకుని ఉండు అంటూ మండిపడుతున్న టీమిండియా అభిమానులు

Hazarath Reddy

భారత్ కూడా పెద్ద తీస్ మార్ ఖాన్ జట్టేం కాదు. ఆ జట్టులో కూడా క్వాలిటీ లేదు. వాళ్లు కూడా వచ్చే వారం సెమీ ఫైనల్ ఆడి స్వదేశానికి (explosive statement against Team India) తిరిగెళ్లిపోతారు’ అని తేల్చిచెప్పాడు.

T20 World Cup 2022: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ఆటగాడు రజా, ఒక ఏడాదిలో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్‌ ఈయర్‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న ఆటగాడిగా జిబాంబ్వే స్టార్‌ ఆల్‌ రౌండర్‌ సికిందర్‌ రజా (Zimbabwe all-rounder Sikandar Raza) నిలిచాడు. 2022 ఏడాదిలో రజాకు ఇప్పటి వరకు 7 మ్యాన్‌ ఆఫ్‌ది అవార్డులు లభించాయి.

Advertisement

T20 World Cup 2022: బాబర్ నీవు ఓ చెత్త కెప్టెన్, ఆడింది చాలు ఇంటికి బయలుదేరండి, పాకిస్తాన్ ఆటగాళ్లపై మండిపడిన పాకిస్తాన్‌ మాజీ పాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్‌ ఓడిపోయిన సంగతి విదితమే.దీంతో ఈ మెగా టోర్నీలో (T20 World Cup) పాకిస్తాన్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ దిగ్గజ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar Fumes) నిరాశ వ్యక్తం చేశాడు.

T20 World Cup 2022: వీడియో, పాకిస్తాన్‌పై గెలుపు తర్వాత జింబాబ్వే ఆటగాళ్ల డ్యాన్స్ వీడియో వైరల్, పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్న ఆటగాళ్లు

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విజయం తర్వాత జింబాబ్వే ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలిపోయారు. జింబాబ్వే ఆటగాళ్లు మైదానంలోనే పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ICC T20 World Cup 2022:  చివరి ఓవర్ వరకు ఉత్కంఠ,  పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన జింబాబ్వే, ఒక పరుగు తేడాతో గెలిచిన జింబాబ్వే,  రెండవ ఓటమిని మూటగట్టుకున్న పాక్ 

Hazarath Reddy

టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కు జింబాబ్వే చుక్కలు చూపించింది. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ లో అదరగొట్టింది. పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా అవస్థలు పడ్డారు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి పాలైంది.

T20 World Cup 2022: ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసిన భారత్, నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు ​కోల్పోయి 179 పరుగులు సాధించింది.

Advertisement
Advertisement