Sports

Team India Leaves Barbados: వీడియో ఇదిగో, బార్బ‌డోస్‌ నుండి ఎట్టకేలకు బయలుదేరిన టీమిండియా, ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..

Vikas M

టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బ‌డోస్‌లో చిక్కుకున్న టీమిండియా ఎట్ట‌కేల‌కు తిరిగి స్వదేశానికి ప‌య‌న‌మైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన ఢిల్లీకి బయలుదేరింది

Rohit Sharma: బార్బ‌డోస్‌ పిచ్‌లోని మ‌ట్టిని తినడానికి గల కారణాన్ని వివరించిన రోహిత్ శర్మ, ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే..

Vikas M

పిచ్ మ‌ట్టిని తినాల‌ని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్ష‌ణం ఎందుకో అలా చేయాల‌నిపించింది. మ్యాచ్ అనంత‌రం పిచ్ ద‌గ్గ‌రికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుక‌ని ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుక‌నే ఈ విజ‌యానికి జ్ఞాప‌కంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ వెల్ల‌డించాడు.

ICC T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్‌ను ప్రకటించిన ఐసీసీ, నేరుగా అర్హత సాధించనున్న మొత్తం 12 జట్లు, ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్‌ టోర్నీ

Vikas M

ఐసీసీ 2026 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్‌ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

Team India's T20I Schedule: టీ20 ప్రపంచ కప్ 2026 వరకు టీమిండియా T20I షెడ్యూల్ ఇదిగో, మొత్తం 37 మ్యాచ్‌లు ఆడనున్న భారత్

Vikas M

బార్బడోస్‌లో జరిగిన 2024 ఎడిషన్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించినందుకు భారతదేశం ప్రస్తుత T20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలిచింది.ఈ విజయం తర్వాత, విరాట్ కోహ్లీ , రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ వంటి వారు కూడా T20I ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు,

Advertisement

'BCCI Should Save Gaekwad': బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న టీమిండియా మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, బీసీసీఐ కాపాడాలంటూ భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ విజ్ఞప్తి

Vikas M

భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ లండన్ ఆసుపత్రిలో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారని.. ఆర్థిక సాయం కోసం చూస్తున్నారని భారత మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

Badminton Star Dies of Heart Attack: వీడియో ఇదిగో, బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన చైనా స్టార్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో క్రీడాకారుడు కోర్టులో మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.

ICC T20 World Cup 2024 Team: విరాట్ కోహ్లీ లేకుండా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన, భారత్ నుంచి ఆరుగురు ప్లేయర్లకు చోటు

Vikas M

ఐసీసీ తమ టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఆరుగురు టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఇక ఫైనల్‌ మ్యాచ్‌ హీరో విరాట్‌ కోహ్లికి చోటు దక్కలేదు.

Team India Return Updates: బెరిల్ హరికేన్ దెబ్బకు బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టు, క్యూలో నిలబడి పేపర్ ప్లేట్‌లలో భోజనం చేసిన టీమిండియా ప్లేయర్లు

Hazarath Reddy

బెరిల్ హరికేన్ ద్వీపాన్ని తాకడంతో ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ తాజా అప్‌డేట్ ఇచ్చింది . తమ చారిత్రాత్మక T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత భారతదేశానికి బయలుదేరినట్లు ప్రకటించిన టీమ్ ఇండియా, హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది

Advertisement

Dinesh Karthik: ఆర్సీబీ న్యూ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్

Rudra

ఆర్సీబీ న్యూ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ నియమితులు అయ్యారు. ఈ మేరకు క్రికెట్ న్యూస్ ప్లాట్ ఫాం క్రిక్ బజ్ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Team India New Head Coach: శ్రీలంక సీరీస్ తోనే టీమిండియా కొత్త కోచ్ నియామకం.. బీసీసీఐ చీఫ్ జై షా వెల్లడి

Rudra

టీమిండియా కొత్త కోచ్ నియామకం రానున్న శ్రీలంక సీరీస్ లో జరుగనున్నట్టు బీసీసీఐ చీఫ్ జై షా తెలిపారు. రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్టు భావిస్తున్నారు.

Rohit Sharma Retires: టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్ర‌క‌టించిన రోహిత్ శ‌ర్మ‌, వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదంటూ భావోద్వేగం

Vikas M

విరాట్ కోహ్లి బాట‌లోనే భార‌త కెప్టెన్,స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాపై విజ‌యనంత‌రం రోహిత్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్‌ పేర్కొన్నాడు.టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం చాలా సంతోషం ఉంది.

Prize Money of Rs 125 Crores for Team India: టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన బీసీసీఐ, టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచినందుకు నజరానా ఇస్తున్నట్లు తెలిపిన జై షా

Vikas M

టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పొట్టి ఫార్మాట్‌లో జగజ్జేతగా నిలిచిన టీమిండియాకు రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. టోర్నీ ఆధ్యాంతం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృడ సంకల్పం మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా ట్వీట్‌ చేశాడు.

Advertisement

Ravindra Jadeja Retires: టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మిగతా ఫార్మాట్లలో కొనసాగుతానని ప్రకటన

Vikas M

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్‌, భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్‌) కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Suryakumar Yadav Catch Video: తొలిసారి ప్రపంచకప్ ముద్దాడలన్న సఫారీల కలను దూరం చేసింది ఇదే, ఆ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టి ఉండకపోతే, డేవిడ్ మిల్లర్ చేతిలో..

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఫైన‌ల్లో సూర్య‌కుమార్ పట్టిన క్యాచ్ సఫారీలను ప్రపంచకప్ కు దూరం చేసింది. టీమిండియాను టీ20 వ‌ర‌ల్డ్ ఛాంఫియ‌న్స్‌గా నిలిపింది. క్యాచ్ వివరాల్లోకి వెళితే ద‌క్షిణాఫ్రికా విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు.

Suryakumar Yadav: టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌గానే సూర్య‌కుమార్ ఏం చేశాడంటే! భార్య‌తో క‌లిసి ట్రోఫీతో బెడ్ పై ప‌డుకొని ఫోటో పోస్ట్ చేసిన సూర్యకుమార్ యాద‌వ్

VNS

టీమ్​ఇండియా (Team India) విజేతగా నిలిచిన అనంత‌రం సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని త‌న బెడ్‌పై హ‌గ్ చేసుకొని ప‌డుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Rahul Dravid: అప్పుడు కెప్టెన్ గా సాధించ‌లేనిది...ఇప్పుడు కోచ్ గా సాధించాడు! టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యంపై రాహుల్ ద్ర‌విడ్ తొలి రియాక్ష‌న్ ఇది

VNS

మ‌రోసారి టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను (T-20 World Cup) సొంతం చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. 17 ఏళ్ల త‌రువాత టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడంతో ఆట‌గాళ్లు, అభిమానులు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముగియ‌డంతో ప్ర‌ధాన కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ (Rahul Dravid) ప‌ద‌వి కాలం ముగిసింది.

Advertisement

Rohit Sharma Eats Barbados Grass: భారత్ విశ్వవిజేతగా నిలిచిన శుభవేళ.. బార్బడోస్ మైదానంలోని గరికను తిన్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

Rudra

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Rohit Sharma Kisses Hardik Pandya: భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

Rudra

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Virat Kohli Announces Retirement From T20 Cricket: టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ..భారత్ టీ20 ప్రపంచ విజేతగా నిలవగానే కోహ్లీ సంచలన నిర్ణయం..

sajaya

భారత్‌కు తాను ఆడే చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని విరాట్ కోహ్లీ టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అయితే T20 అంతర్జాతీయ కెరీర్‌ను వరల్డ్ కప్ ఛాంపియన్‌ గా ముగించడం విశేషం.

T20 World Cup Final, IND vs SA: టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...

sajaya

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ను రెండవసారి గెలుచుకుంది. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది.

Advertisement
Advertisement