క్రీడలు
CM Jagan Congratulates Jyothi: కంగ్రాట్స్ జ్యోతి, నీవు మేమంతా గర్వపడేలా చేశావంటూ జగన్ ట్వీట్, 100 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలుగమ్మాయి
Hazarath Reddyఛాంపియన్ గా నిలిచిన జ్యోతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు కురిపించారు. 'థాయ్‌లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జ్యోతికి అభినందనలు. నీవు మేమంతా గర్వపడేలా చేశావు' అని జగన్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడుతున్న ఇస్రో శాస్త్రవేత్తలకు కూడా బెస్ట్ విషెస్ చెప్పారు.
Mohammed Siraj Catch Video: మహ్మద్ సిరాజ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, వెనక్కి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్
Hazarath Reddyవెస్టిండీస్‌ తో బుధవారం మొదలైన తొలి టెస్టులో భారత్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో కరీబియన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతను ఐదు వికెట్లతో చెలరేగడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.
IND vs WI, 1st Test: తండ్రి, కొడుకులు ఇద్దరినీ టెస్టు మ్యాచులో ఔట్ చేసిన అరుదైన రికార్డు సాధించిన, టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్..అసలు సంగతి ఇదే..
kanhaడొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను రవి అశ్విన్ అవుట్ చేశాడు.
Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో ఆడబోమని బిసిసిఐ ప్రకటన, భారత్, పాక్ మ్యాచులు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో నిర్వహించాలని నిర్ణయం
kanhaఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌ వేదికగా జరిగే క్రికెట్ మ్యాచ్‌లో ఆడబోమని బిసిసిఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌లో ప్రస్తుతం ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, నేపాల్ వంటి దేశాలు ఆడుతున్నాయి.
India vs West Indies Test series: నేటి నుండి భారత్, వెస్టిండీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం.. ఎప్పుడు, ఏ సమయం, ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలో ఫ్రీగా టెస్ట్ మ్యాచ్ చూడచ్చో తెలుసుకోండి..
kanhaనేటి నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ (ఇండ్ Vs WI) ప్రారంభం కానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు జూలై 12 నుంచి జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓడిపోయిన తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కొత్త బౌలర్లు కమాండ్‌ని పొందడం చూడవచ్చు.
BCCI New Rule: బౌలర్లకు ఊరటనిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం, ఇకపై ఒక ఓవర్‌ లో రెండు బౌన్సర్లు వేయొచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనూ మార్పు
VNSభార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు కీల‌క నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌లో ఇటీవ‌ల బ్యాట‌ర్ల ఆధిప‌త్యం పెరుగుతోంది. దీంతో టీ20ల్లో బ్యాట్‌, బాల్ మ‌ధ్య స‌మ‌తుల్యత‌ను కాపాడాల‌ని భావించింది. ఈ క్రమంలో బౌల‌ర్లు ఓవ‌ర్‌కు రెండు బౌన్స‌ర్ల‌ను వేసే అవ‌కాశాన్ని క‌ల్పించింది. త్వర‌లోనే ప్రారంభం కానున్న స‌మ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ లో ఈ నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నట్లు వెల్లడించింది.
Luis Suarez Passes Away: స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం సూరెజ్‌ మిరమొంటెస్ కన్నుమూత, ఆ అవార్డు సాధించిన ఏకైక స్పెయిన్ క్రీడాకారుడు అతనే
VNSస్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ మిర‌మొంటెస్‌(Luis Suárez Miramontes) క‌న్నుమూశాడు. ‘గోల్డెన్ గ‌లిసియన్‌'(Golden Galician)గా పేరొందిన అత‌ను 88 ఏళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచాడు.
Wrestlers’ Sexual Harassment Case: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బ్రిజ్‌ భూషణ్‌కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు, 18న విచారణకు హాజరుకావాలని ఆదేశం
Hazarath Reddyమహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.
MS Dhoni 77 Feet Cutout Video: వీడియో ఇదిగో, నందిగామలో 77 అడుగుల ధోనీ కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులు, రేపు ధోనీ 44వ జన్మదినం
Hazarath Reddyమహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు నందిగామలో భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద రేపు ధోనీ 44వ జన్మదినాన్ని పురస్కరించుకొని 77 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు.
Steve Smith Dismissal Video: వీడియో ఇదిగో, 100వ టెస్ట్ మ్యాచ్‌లో 22 పరుగులకు ఔట్ అయిన స్టీవ్ స్మిత్
Hazarath Reddyతన 100వ టెస్ట్ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ప్రదర్శన ప్రణాళిక ప్రకారం జరగలేదు, కనీసం మొదటి ఇన్నింగ్స్‌లో కూడా అతను కేవలం 22 పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియన్ స్టాల్‌వార్ట్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన బంతిని ఢిపెన్స్ ఆడబోయి జానీ బెయిర్‌స్టోన్ చేతికి చిక్కాడు. అంపైర్ దానిని అవుట్ అని ప్రకటించాడు. స్మిత్ ఈ అవుట్ పై అప్పీల్ కు వెళ్లగా ధర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా వెనుదిరిగాడు.
Alamgir Tareen Dies: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం, ఆత్మహత్య చేసుకున్న పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్
Hazarath Reddyపాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ యజమాని అలంగీర్ తరీన్ లాహోర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 6వ తేదీ ఉదయం లాహోర్‌లోని తన నివాసంలో 63 ఏళ్ల అలంగీర్ తరీన్ చనిపోయినట్లు తెలిసింది. అతని మృతదేహం పక్కనే చేతితో రాసిన నోట్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. అలంగీర్ తరీన్ తన మేనల్లుడు అలీ ఖాన్ తరీన్‌తో కలిసి 2018లో ముల్తాన్ సుల్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు.
Adudam Andhra: అక్టోబర్ 2నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, మొత్తం 2 లక్షల 94 వేల మ్యాచ్‌లు, ఐదు కేటగిరిలో పోటీలు
Hazarath Reddyఅక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్‌.కే రోజా తెలిపారు. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.
Rishabh Pant’s Latest Pic: రిషబ్ పంత్ లేటెస్ట్ పిక్ ఇదిగో, భారత జట్టులోకి రావడానికి చెమటోడ్చుతున్న వికెట్ కీపర్-బ్యాటర్
Hazarath Reddyరిషబ్ పంత్ డిసెంబర్ 20, 2022 ఒక భయంకరమైన కారు ప్రమాదానికి గురైన సంగతి విదితమే. అప్పటి నుండి అతను బెడ్ రెస్ట్ మీద ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాటర్ ప్రస్తుతం భారత జట్టులోకి తిరిగి రావాలనే ప్రయత్నంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో చెమటోడ్చుతున్నాడు.
India's Squad For WI T20I Series: రింకూ సింగ్‌కు దక్కని చోటు, తిలక్ వర్మకు పిలుపు, వెస్టీండీస్ T20I సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో..
Hazarath Reddyవెస్టిండీస్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు గతంలో, వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు. ఇప్పుడు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం వెస్టిండీస్‌తో కరేబియన్ దీవులు, USAలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది
MS Dhoni-Sakshi Dhoni: ధోని బెడ్‌రూంలో ఏం చేస్తున్నాడో చూడండి, పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసిన భార్య సాక్షి ధోని
Hazarath Reddyజూన్‌ 4న ధోని, సాక్షిసింగ్‌ తమ 13వ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా సాక్షి ధోని.. ''ధోని బెడ్‌రూంలోనూ ఏం చేస్తున్నాడో చూడండి'' అంటూ ఒక పాత ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీషేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని మంచంపై పడుకొని ట్యాబ్‌లో వీడియో గేమ్‌ ఆడుతూ చాలా బిజీగా కనిపించాడు.
Ishant Sharma on MS Dhoni: ధోనీ బండబూతులు తిట్టేవాడు, కెప్టెన్‌ కూల్‌ కానే కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఇషాంత్‌ శర్మ
Hazarath Reddyకెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్ ధోనీపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ సంచలన వాఖ్యలు చేశాడు. ధోని అసలు కెప్టెన్‌ కూల్‌ కానే కాదని, ఫీల్డ్‌లో తరుచూ దుర్భాషలాడే వాడని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మహీ భాయ్‌కి చాలా బలాలు ఉన్నాయి. కానీ వాటిలో కూల్ అండ్ కామ్ ఒకటి కాదు. అతడు మైదానంలో బూతులు తిట్టేవాడు. నేను కూడా ఓసారి విన్నాను.
Virat Kohli Reverse Sweep: విరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో ఇదిగో, రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో ట్రై చేసిన టీమిండియా బ్యాటర్
Hazarath Reddyవిరాట్ కోహ్లి రివర్స్ స్వీప్‌ షాట్ వీడియో వైరల్ అవుతోంది. కానీ భారత్ vs వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు ముందు నెట్స్‌లో రవిచంద్రన్ అశ్విన్‌పై బౌలింగ్ లో ..బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఆడిన షాట్ అది.
Praveen Kumar Escape Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్
Hazarath Reddyజూలై 4న మీరట్‌లో వేగంగా వస్తున్న క్యాంటర్‌.. వాహనంను ఢీకొట్టడంతో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్, అతని కుమారుడు తృటిలో ఘోరమైన కారు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మాజీ ఫాస్ట్ బౌలర్ తన కారు ల్యాండ్ రోవర్‌లో ప్రయాణిస్తూ పాండవ్ నగర్ నుండి తిరిగి వస్తుండగా మీరట్‌లోని కమిషనర్ నివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Harbhajan's Best Test Players List: నో కోహ్లీ, నో రోహిత్, ప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు వీళ్లేనట, టాప్‌ ఫైవ్‌ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసిన హర్భజన్ సింగ్
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు నాథన్‌ లయాన్‌, స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌, మరో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు.
Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం
Hazarath Reddyఅనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.